breaking news
Challengess
-
‘ఇంతకీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?.. టీడీపీనా.. బీజేపీనా..’
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారు..? ఇంతకీ మీది టీడీపీనా..? బీజేపీనా..? ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుపై వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయర్త, నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడే మైక్ బీజేపీది.. మాట టీడీపీదని... అలాగే మాట్లాడే ఆఫీస్ బీజేపీది.. అజెండా టీడీపీదని ఎద్దేవా చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో కేకే రాజు మాట్లాడారు. చదవండి: సబ్బం హరి ఆస్తులు సీజ్! నా జెండా.. అజెండా వైఎస్సార్ సీపీనే అని... ఊపిరున్నంత వరకు సీఎం వైఎస్ జగనన్న వెంటేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సీటుపై, రాజకీయ భవిష్యత్పై బెంగలేదన్నారు. విష్ణుకుమార్ రాజుకు మాత్రం రాజకీయ భవిష్యత్పై బెంగ ఉంటే వైఎస్సార్ సీపీలో కార్యకర్తలా చేర్చుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉంటూ చంద్రబాబు, లోకేష్పై ప్రేమ ఒలకపోస్తూ జ్యోతిష్యుడి అవతారం ఎత్తుతున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే సీటు కోసం రాజకీయాల్లోకి రాలేదని, సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఊపిరున్నంత వరకూ జగనన్న వెంటే నిలుస్తానని సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా...? అని విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరారు. అసలు నోట్ల రద్దు, కరెన్సీ ముద్రణ అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. 22 ఏ భూములపై నిర్లక్ష్యం వహిస్తున్నామంటున్నారని... అయితే గతంలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే దుష్ప్ర చారం రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణిపై టీడీపీ, బీజేపీ నాయకులు దు్రష్పచారం చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగితే భారతమ్మపై దు్రష్పచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీ‹Ù, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తా: జయలలిత
తమిళ ప్రజల అభిమానమే నా బలం: జయలలిత జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా ప్రకటన సాక్షి, చెన్నై: తాను జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని.. ప్రస్తుత సవాలును కూడా తమిళ ప్రజల అభిమానంతో విజయవంతంగా అధిగమిస్తానని తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేర్కొన్నారు. ఆమె తన ప్రజా జీవితాన్ని భయంకరమైన సముద్రాన్ని ఈదడంగా పోల్చారు. జైలు నుంచి బెయిల్పై విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తొలిసారిగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. తమిళ ప్రజల ప్రేమ, అభిమానంతో వాటిని విజయవంతంగా అధిగమించాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీ సోదరిగా ప్రజా సంక్షేమం కోసం పనిచేశాను. తమిళనాడు ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తల క్షేమం, అభివృద్ధే నా లక్ష్యం..’’ అని ఆమె పేర్కొన్నారు. తనకు వచ్చిన ఈ పరిస్థితిని తట్టుకోలేక 139 మంది గుండె ఆగి చనిపోయారని, 54 మంది బలిదానం చేసుకున్నారని.. వారి మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నానని జయలలిత పేర్కొన్నారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. మూడేసి లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాగా.. జయలలితకు బెయిల్ అంశంలో స్పందించేందుకు ఆమె రాజకీయ ప్రత్యర్థి డీఎంకే చీఫ్ కరుణానిధి నిరాకరించారు. ఆమెకు జైలు శిక్ష పడ్డప్పుడు ఆనందపడలేదని, బెయిల్ వచ్చినప్పుడు చింతించనూ లేదని పేర్కొన్నారు. రజనీకాంత్, మేనకాగాంధీ హర్షం జైలు నుంచి జయలలిత విడుదలై ఇంటికి చేరడం పట్ల సూపర్స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రి మేనకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు వారు వేర్వేరుగా రాసిన లేఖలను అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి.