-
బెదిరింపులకు భయపడం..తైవాన్పై మా నిర్ణయం మారదు
బీజింగ్: చైనాను బెదిరించాలనుకునే విదేశీ శక్తులు 140 కోట్ల దేశ ప్రజలు, శక్తిమంతమైన దేశ మిలటరీలతో కూడిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ హెచ్చరించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాను వ్యతిరేకించే దేశాలకు జిన్పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షిక ఉత్సవాలను గురువారం ప్రతిష్టాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మావో జెడాంగ్ భారీ చిత్రపటం నేపథ్యంలో.. తియానన్మెన్ గేట్ బాల్కనీ నుంచి వేలాది దేశభక్తులను ఉద్దేశించి జిన్పింగ్ ప్రసంగించారు. చైనాలో తైవాన్ పునఃవిలీనం తమ చరిత్రాత్మక లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అమెరికా పేరును ప్రస్తావించకుండా.. చైనాను భయపెట్టే అవకాశం ఏ విదేశీ శక్తికి ఇవ్వబోమని సీపీసీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ కూడా అయిన జిన్పింగ్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య చర్యలకు పాల్పడుతోందని అమెరికా సహా ఇండో పసిఫిక్ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చైనాతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం, ఆ దిశగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో పాటు, మానవహక్కులు, కరోనా పుట్టుక.. తదితర అంశాలపై చైనాను విమర్శించడం తెలిసిందే. ‘విదేశాల బెదిరింపులకు భయపడం. మనం ఇంతవరకు ఏ దేశాన్ని భయపెట్టలేదు.. అణచివేయలేదు.. వేధించలేదు. ఇకపై కూడా అలా చేయబోం. అలాగే, ఏ దేశం కూడా మనల్ని భయపెట్టే, అణచివేసే, వేధించే చర్యలకు పాల్పడితే సహించబోం’ అని జిన్పింగ్ తేల్చిచెప్పారు. 3ఒకవేళ ఏ దేశమైనా అందుకు తెగిస్తే.. 140 కోట్ల మందితో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ను ఢీ కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో దాదాపు 70 వేల మంది పార్టీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, కార్యక్రమంలో అత్యాధునిక జే 20 ఫైటర్ జెట్స్ సహా 71 యుద్ధ విమానాలు సాహసోపేత విన్యాసాలు చేశాయి. ఉత్సవాల్లో మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీలో మావో తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నేతగా జిన్పింగ్ ఎదిగారు. పార్టీ శతవార్షిక ఉత్సవాల్లో 100 ఏళ్ల క్రితం పార్టీ వ్యవస్థాపకుడు మావో తరహాలో గ్రే కలర్ సూట్ను ధరించి జిన్పింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తైవాన్ విలీనంపై రెండో ఆలోచన లేదని ఈ సందర్భంగా జిన్పింగ్ స్పష్టం చేశారు. ‘దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే విషయంలో దేశ ప్రజల ప్రతిన, పట్టుదల, అసాధారణ సామర్ధ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు’ అని వ్యాఖ్యానించారు. తైవాన్ను స్వతంత్ర దేశంగా ఆ దేశస్తులు భావిస్తారు. కానీ చైనా మాత్రం అది చైనా భూభాగమేనని వాదిస్తోంది. ఒకవేళతైవాన్ను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే.. తైవాన్కు మిలటరీ సాయం అందించాలని అమెరికా చట్టాల్లోనే ఉంది. రెండు పర్యాయాలు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేసి, నచ్చినంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా జిన్పింగ్ ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా సాయుధ దళాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సి ఉందని జిన్ పింగ్ పేర్కొన్నారు. సాయుధ దళాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను 1921 జులై 1 న మావో ప్రారంభించారు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నుంచి సీపీసీ అధికారంలో కొనసాగుతోంది. సీపీసీని చైనా ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమవడం ఖాయమని ఈ సందర్భంగా జిన్పింగ్ వ్యాఖ్యానించారు. 95 లక్షల మంది పార్టీ సభ్యులు, 140 కోట్ల దేశ ప్రజలు ఆ పరిస్థితిని రానవ్వరన్నారు. సీపీసీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్లను ఏరివేస్తామని, పార్టీలో అసమ్మతిపై పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, హాంకాంగ్లో చైనా నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయడాన్ని జిన్పింగ్ సమర్థ్ధించారు. ‘మనకు చెప్పే హక్కు తమకే ఉందని భావించే వారి నీతులను వినే ప్రసక్తే లేదు’ అని అమెరికాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థి క వ్యవస్థపై మాట్లాడుతూ.. మైలురాళ్ల వంటి సంస్కరణలతో కేంద్రీకృత ఎకానమీని సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా విజయవంతంగా మార్చగలిగామని జిన్పింగ్ పేర్కొన్నారు. -
అయ్యో..ఓయూ..
⇒ఓయూలో నిధుల కోసం మల్లాగుల్లాలు ⇒ప్రణాళికలు బారెడు... నిధుల కేటాయింపు మూరెడు ⇒శతాబ్ది ఉత్సవాలకు కేటాయించిన నిధులు అంతంత మాత్రమే తార్నాక: ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్సవాలను ప్రపంచ కీర్తిని గడించేలా నిర్వహించాలనుకున్న అధికారుల ఆశలపై నిధుల కేటాయింపు నీళ్లు చల్లింది. ఎన్నో ఆశలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించిన అధికారుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కోట్ల రూపాయల అంచనాలతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేయగా, ప్రభుత్వం కేటాయించిన నిధులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దాదాపు రూ.416 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ఓయూ అధికారులు నివేదించగా, ఈ వార్షిక బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులకు ,అంచనా వ్యయానికి పొంతనలేకుండా పోవడంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల విషయమై ఓయూ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవంటున్నారు. ముఖ్యంగా ఓయూలో విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది. కనీసం తొలి దశలో హాస్టళ్ల ఆధునీకరణకు శ్రీకారం చుడితే బాగుంటుందంటున్నారు. అంచనా వ్యయం రూ.416కోట్లు.. ఇచ్చింది రూ.200 కోట్లు... శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని, ఈ సందర్బంగా స్థిరంగా గుర్తుండేలా ఉండేందుకు గాను పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. అందుకు రాష్ట్ర వార్షిక బడ్జెట్కు మూడు నెలల ముందుగానే వివిధ రకాలుగా తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.416 కోట్లు అంచనా వ్యయంగా నివేదిక అందజేశారు. అంచనా ఇలా.. ఓయూలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను రెండు విధాలుగా రూపొందించారు. అందులో ఒకటి మౌళిక సదుపాయాల కల్పన అంశం కాగా, రెండవది వర్సిటీలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు వాటికి కేటాయించిన అంచానా విలువలు ఇలా ఉన్నాయి.. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో.. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్త్రపతి హాజరు అవుతున్న నేపథ్యంలో ఆయన స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అత్యవసరంగా రూ.20 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నిధులతో ప్రారంభ కార్యక్రమాలను గట్టెక్కించే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. శతాబ్ది ఉత్సవాల నిధుల వినియోగంపై ప్రత్యేక అధికారి..? ఓయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఓయూకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిసింది. కేటాయించిన నిధులను సదరు అధికారి పర్యవేక్షణలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు.ఈ నిధులతోని ప్రతి రూపాయికి అధికారులు లెక్క చూపాల్సి ఉంటుందంటున్నారు. కాగా ఈ విషయమై ఓయూ అ«ధికారులను సంప్రదించగా, దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement