-
బీసీ కులగణనకు సన్నాహం
సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి, కాకినాడ: జాతీయస్థాయిలో కులగణన ప్రక్రియను చేపట్టాలనే బీసీల న్యాయమైన డిమాండ్ను పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్లో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. దీంతో కులగణనను వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది. ఇందుకోసం సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ, మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో శాఖల వారీగా కసరత్తు ముమ్మరం చేసింది. కులగణనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది. ఇదిలా ఉంటే.. జనాభా లెక్కలు–2022 సేకరణలో బీసీ కులగణన జరపాలంటూ దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ బీసీ కులం కాలమ్ పెట్టి జనగణన చేపట్టడానికి కేంద్రం సమ్మతించకపోవడంతో రాష్ట్ర పరిధిలో నిర్వహించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే బీసీ కులం కాలం చేర్చి జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీహార్లో చేపట్టిన కులగణనను అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కులాల వారీగా వివరాలు సేకరించేందుకు (కులగణన) క్షేత్రస్థాయిలో సిబ్బందిని వినియోగించుకునేందుకు నిర్ణయించింది. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఇందుకోసం ఉపయోగించనుంది. సర్వే పారదర్శకంగా జరిగేలా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో స్థాయిలో పునఃపరిశీలన చేస్తారు. రాష్ట్రంలో సమర్థవంతంగా కులగణన నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుండటం విశేషం. బీసీల పక్షపాతి సీఎం జగన్ : మంత్రి వేణు ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురుచూస్తున్న కులగణన ప్రక్రియను చేపట్టడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి బీసీల పక్షపాతినని నిరూపించుకున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 తరువాత ఈ ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమవుతుందన్నారు. ఈ చర్య రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఓ పెద్ద ఊరటని, వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటుందని చెప్పారు. వెనుకబడిన తరగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్య, సంక్షేమం, వంటి అంశాలలో ప్రాధాన్యత కల్పించే దిశగా కులగణన జరుగుతుందని తెలిపారు. సాధ్యం కాదనుకున్న బీసీల కోరిక సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి ఆ బాధ్యతను తనకు అప్పగించినందుకు రుణపడి ఉంటానన్నారు. కుల గణనను ప్రారంభించే ముందు వివిధ కుల సంఘాల నాయకులు, పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకుంటామని మంత్రి వివరించారు. -
వెనుకబడిన కులాల జాబితాలోకి ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ చిక్కబళ్లాపురం : ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి కసరత్తు చేస్తున్నట్లు రాష్ర్ట సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ వెల్లడించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదివారం స్థానిక హర్షోదయ కల్యాణమంటపంలో ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రదానం చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సమాజంలో జాతి, కుల, మత విభేదాలు ఉండరాదని జాతిపిత మహాత్మగాంధీ అనాడే చాటి చెప్పారన్నారు. ఆర్యవైశ్యులకు వివిధ సౌలభ్యాలను అందించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారని తెలిపారు. ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి అంగీకరించారన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో నవంబరు నుంచి కులాలవారీగా గణన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విధానపరిషత్ సభాపతి డీహెచ్.శంకరమూర్తి మాట్లాడుతూ విద్యకు ఉన్న విలువ దేనికీ లేదన్నారు. అనంతరం వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలను మంత్రి ఆంజనేయ, డీహెచ్.శంకరమూర్తిఅందజేశారు. అంతకు ముందు కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారి శోభయాత్రను రాష్ర్ట విద్యాశాఖ కమిషనర్ నందకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధాకర్, మంజునాథ్, జగదీశ్కుమార్, ఎమ్మెల్సీ శరవణ, డీఐజీ గుప్తచరపద్మనయన. ఆర్యవైశ్య మండలి చిక్కబళ్లాపుర శాఖాధ్యక్షుడు నజుండరామశెట్టి, ఆర్యవైశ్యమహాసభా అధ్యక్షుడు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement