breaking news
Caste-based occupations
-
‘లక్ష’ణంగా..300 మంది బీసీలకు! ఈ నెల 15వ తేదీ నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. ఈ మేరకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పంపిణీ శనివారం (ఈ నెల 15వ తేదీ) నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తొలివిడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 300 మందికి సాయాన్ని అందిస్తామని, ఈ ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. మంత్రి గురువారం తన చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్లతో బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అర్హులైన బీసీ కులవృత్తిదారులకు సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ చేపట్టాలని.. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు ఆర్థిక సాయం అందుకున్న వెంటనే కులవృత్తులకు సంబంధించిన యూనిట్ను గ్రౌండింగ్ చేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా.. బీసీ కులవృత్తుల వారికి ఆర్థికసాయం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వాటి పరిశీలన పూర్తయిన వెంటనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని.. ఈ సొమ్ముతో కులవృత్తికి సంబంధించిన ముడిసరుకులు, పనిముట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. -
పొట్టనింపని కులవృత్తి
కనుమరుగవుతున్న కంసాలీలు ప్రత్యామ్నాయ వృత్తులపై దృష్టి రామచంద్రాపురం: మండలంలో కులవృత్తులు నమ్ముకుని జీవించే కంసాలి కులస్తుల పరిస్థితి దుర్భరంగా మారి కనుమరుగయ్యే ప్రమాదంలోకి వచ్చింది. మండలంలో అనుప్పల్లి, నెత్తకుప్పం, సీకేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలలో కంసాలి(విశ్వబ్రాహ్మణ) కులస్తులు కుల వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో వ్యవసాయం మెండుగా రైతులు సాగిస్తూ వ్యవసాయ పనిముట్లను తాయు చేస్తే అందుకు ప్రతిఫలంగా పంట దిగుబడి సమయంలో కంసాలీలకు వేరుగా వరిధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆ కుటుంబం జీవనం సాగిస్తూ వుండేది. రాను రాను కులవృత్తుల ఆదరణ తగ్గడం, సంప్రదాయ వ్యవసాయ పనిముట్లకు గిరాకీ తగ్గడంతో వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గడ్డపారలు, పారలు, తొలికలు, మడకలు (మరక), చెక్క, వలంత, గొర్ర, బెల్లం పెనుములు వంటివి తయారు చేసేవారు. కానీ నేడు ఇవన్నీ పరిశ్రమల నుంచే రెడీమేడ్గా మార్కెల్లో లభిస్తుండడం వల్ల కంసాలి వృత్తులు కనుమరుగవుతున్నాయి. దీంతో కంసాలులు ప్రత్యామ్నాయ వృత్తులపై దృష్టిసారిస్తున్నారు. కులవృత్తే కూడుపెడుతాయనుకున్న వృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం కులవృత్తులవారిని ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కంసాలి కులస్తులు కోరుతున్నారు. కులవృత్తులకు ఆదరణ కరువు గతంలో కులవృత్తులకు మంచి ఆదరణ ఉండేది. కులవృత్తులే కూడు పెట్టేవి. అలాంటి కులవృత్తులకు ఆదరణ లేక కనుమరుగువుతున్నాయి. కుల వృత్తులకు పనులు లేక తినడానికి తిండి కూడా కరువుగా వుంది. ప్రభుత్వం కులవృత్తులనుఆదుకోవాలి. -దొరస్వామి ఆచారి, సీకేపల్లి ప్రత్యామ్నాయ పనులు చేస్తున్నాం కులవృత్తులకు చేతినిండా పనులు లేక కుటుంబాన్ని పోషించ లేక ప్రత్యామ్నాయం పనులు చేసుకుంటున్నారు. కులవృత్తులను నమ్ముకుంటే కడుపు నిండదు. ఆక లితో అలమటించాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఆదుకోవాలి. - వెంకటశివాచారి, సీకేపల్లి