-
ఓ మోస్తరు పిండిపదార్థాలతో మెరుగైన ఆరోగ్యం...
పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని.. కొన్ని రకాల వ్యాధులకు చికిత్స లభిస్తుందన్న ప్రచారం ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నప్పటికీ ఓ మోస్తరు స్థాయిలో కార్బోహైడ్రేట్లను ఆహారంలో చేర్చుకోవడమే మేలని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం ఆహారం ద్వారా శరీరానికి అందే శక్తిలో 40 శాతం కంటే తక్కువ కార్బోహైడ్రేట్ల ద్వారా వస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశముండగా, 50 – 55 శాతం శక్తి వస్తే మెరుగయ్యే అవకాశముంది. అమెరికాలో దాదాపు 15 వేల మందిపై జరిపిన అధ్యయనంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంకో 4.3 లక్షల మంది వివరాల విశ్లేషణ ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు బోస్టన్లోని బ్రైగమ్ అండ్ విమెన్ హాస్పిటల్ శాస్త్రవేత్త సారా సెడిల్మ్యాన్ తెలిపారు. జంతు సంబంధిత ఆహారంతో కార్బోహైడ్రేట్లను తగ్గించినప్పుడు జీవిత కాలం తగ్గే అవకాశముందని తమ పరిశోధన చెబుతోందని, బదులుగా మొక్కల నుంచి అందే కొవ్వులు, ప్రొటీన్లను, ఓ మోస్తరుగా కార్బోహైడ్రేట్లను చేర్చడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తక్కువ కార్బోహైడ్రేట్ల ఆహారం స్వల్పకాలంలో ప్రయోజనం కల్పించినా.. ఎక్కువ కాలం వాడినప్పుడు మాత్రం సమస్యలు సృష్టించే అవకాశముందన్నారు. -
ఇలా తింటే ఎక్కువకాలం జీవిస్తారు...
కొత్త పరిశోధన శరీరానికి మేలు చేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా ఆహారంలో తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేలరీల్లో 40 శాతం తగ్గించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా తీసుకున్నప్పుడు కూడా దాదాపు అలాంటి ఫలితమే దక్కుతుందని వారు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ వైద్య నిపుణులు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. డయాబెటిస్, స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు రోజువారీ ఆహారంలో ఏకంగా 40 శాతం కేలరీలను తగ్గించుకోవడం అంతగా ఆచరణ సాధ్యం కాదని, దాని బదులు పిండి పదార్థాలను బాగా తీసుకుని, ప్రొటీన్లను కొంతమేరకు తగ్గించుకున్నట్లయితే తేలికగా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సిడ్నీ వర్సిటీ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ సింప్సన్ చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement