breaking news
Carbs
-
Rani Mukerji: టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!
బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్బస్టర్ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్ బాడీతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్ ప్లాన్, వర్కౌట్లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్నెస్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్ ఫిగర్ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్-వర్కౌట్ ప్లాన్ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్ సత్యజిత్ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన్గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్ ప్లాన్ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!) -
ఓ మోస్తరు పిండిపదార్థాలతో మెరుగైన ఆరోగ్యం...
పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని.. కొన్ని రకాల వ్యాధులకు చికిత్స లభిస్తుందన్న ప్రచారం ఇటీవలి కాలంలో జోరుగా సాగుతోంది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నప్పటికీ ఓ మోస్తరు స్థాయిలో కార్బోహైడ్రేట్లను ఆహారంలో చేర్చుకోవడమే మేలని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం ఆహారం ద్వారా శరీరానికి అందే శక్తిలో 40 శాతం కంటే తక్కువ కార్బోహైడ్రేట్ల ద్వారా వస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశముండగా, 50 – 55 శాతం శక్తి వస్తే మెరుగయ్యే అవకాశముంది. అమెరికాలో దాదాపు 15 వేల మందిపై జరిపిన అధ్యయనంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంకో 4.3 లక్షల మంది వివరాల విశ్లేషణ ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు బోస్టన్లోని బ్రైగమ్ అండ్ విమెన్ హాస్పిటల్ శాస్త్రవేత్త సారా సెడిల్మ్యాన్ తెలిపారు. జంతు సంబంధిత ఆహారంతో కార్బోహైడ్రేట్లను తగ్గించినప్పుడు జీవిత కాలం తగ్గే అవకాశముందని తమ పరిశోధన చెబుతోందని, బదులుగా మొక్కల నుంచి అందే కొవ్వులు, ప్రొటీన్లను, ఓ మోస్తరుగా కార్బోహైడ్రేట్లను చేర్చడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. తక్కువ కార్బోహైడ్రేట్ల ఆహారం స్వల్పకాలంలో ప్రయోజనం కల్పించినా.. ఎక్కువ కాలం వాడినప్పుడు మాత్రం సమస్యలు సృష్టించే అవకాశముందన్నారు. -
ఇలా తింటే ఎక్కువకాలం జీవిస్తారు...
కొత్త పరిశోధన శరీరానికి మేలు చేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా ఆహారంలో తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేలరీల్లో 40 శాతం తగ్గించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా తీసుకున్నప్పుడు కూడా దాదాపు అలాంటి ఫలితమే దక్కుతుందని వారు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ వైద్య నిపుణులు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. డయాబెటిస్, స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు రోజువారీ ఆహారంలో ఏకంగా 40 శాతం కేలరీలను తగ్గించుకోవడం అంతగా ఆచరణ సాధ్యం కాదని, దాని బదులు పిండి పదార్థాలను బాగా తీసుకుని, ప్రొటీన్లను కొంతమేరకు తగ్గించుకున్నట్లయితే తేలికగా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సిడ్నీ వర్సిటీ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ సింప్సన్ చెబుతున్నారు.