breaking news
c. vinod kumar
-
ఆర్టీసీ టిక్కెట్ల రద్దుపై రీఫండ్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రద్దయ్యే ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు టిక్కెట్ల రుసుమును తిరిగి చెల్లించనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఆన్లైన్లో ఈ-టిక్కెట్ బుక్ చేసుకున్న వాళ్లు తమ బస్సు సర్వీసు రద్దయితే.. online.support @apsrtc.in కు తమ టిక్కెట్ వివరాలను ఈ మెయిల్ చేయాలి. అలాగే బి2బి(సింగిల్ ఫ్రాంచైజీ) వద్ద టిక్కెట్ కొనుగోలుచేసిన ప్రయాణికులు సదరు బీ2బీ ఏజెంట్ వద్ద మాత్రమే రీఫండ్ తీసుకోవాలి. బస్స్టేషన్లలో, అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టిక్కెట్ బుక్ చేసుకున్న వాళ్లు తమ ప్రయాణానికి 48 గంటలు ముందు కానీ, 48 గంటలు తరువాత కానీ టిక్కెట్లు రద్దు చేసుకోవచ్చు. నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాలు, మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలోని టిక్కెట్ కౌంటర్లలో డబ్బులు తిరిగి తీసుకోవచ్చు. -
వినాయక చవితికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 6, 7 తేదీల్లో బయల్దేరి వెళతాయి. రోజూ తెలంగాణ జిల్లాలకు రాకపోకలు సాగించే 2,836 రెగ్యులర్ బస్సులతోపాటు 6న 145, 7వ తేదీన 300 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే తీసుకుంటారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి, పలు ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. పై రెండు రోజుల్లో ఆదిలాబాద్కు 15, నిజామాబాద్కు 20, కరీంనగర్కు 90, వరంగల్కు 60, ఖమ్మంకు 30, నల్లగొండకు 60, మహబూబ్నగర్కు 60, మెదక్కు 60 బస్సుల చొప్పున నడుపుతారు. ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ల నుంచి మరో 40 బస్సులను కూడా సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు.