breaking news
buying grains
-
Telangana: బియ్యం సేకరణకు కేంద్రం ఓకే..
►రాష్ట్రంలో రైస్ మిల్లులు ఎట్టకేలకు తిరిగి తెరుచుకోబోతున్నాయి. 43 రోజులుగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి సెంట్రల్ పూల్కు బియ్యం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో మిల్లులు తెరుచుకోనున్నాయి. నిలిచిపోయిన బియ్యం సేకరణ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. ►కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డితో కలిసి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే ఇంతకాలం ధాన్యం మిల్లింగ్, బియ్యం సేకరణలో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు. ఎఫ్సీఐ నేతృత్వంలో బియ్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించనున్నామని, ధాన్యం సేకరణలో అవకతవకలపై తెలంగాణకు ఆడిట్ బృందాలను పంపిస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో అవకతవకల ఆరోపణలు, మిల్లుల్లో ఎఫ్సీఐ ప్రత్యక్ష తనిఖీలు తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మార్చి, మే నెలల్లో కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎఫ్సీఐ రైస్మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో 40 మిల్లుల్లో 4,53,896 బస్తాల ధాన్యం (ఒక్కో బస్తాలో 40 కిలోలు) మాయమైనట్లు గుర్తించింది. మే నెలలో జరిపిన పరిశీలనలో 63 మిల్లుల్లో 1,13,872 ధాన్యం బస్తాల లెక్క తేలలేదు. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం బస్తాలను నిల్వ చేశారని పేర్కొంది. ఇదే విషయాన్ని ఎఫ్సీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ, ఆయా మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క మిల్లుపైనా చర్యలు తీసుకోలేదని ఎఫ్సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గత ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పేదలు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ నుంచి తీసుకొంది. కానీ ప్రజలకు పంపిణీ చేయలేదు. అయితే ఇందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ధాన్యం నిల్వల మాయం, బియ్యం పంపిణీ కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. గత జూన్ 7వ తేదీ నుంచి రాష్ట్రంలో సెంట్రల్ పూల్కు బియ్యం సేకరణను నిలిపివేసింది. కస్టమ్ మిల్లింగ్ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కూడా..మిల్లర్లపై తీసుకున్న చర్యలు, బియ్యం పంపిణీ కాకపోవడంపై ఎఫ్సీఐకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తేనే సెంట్రల్ పూల్కు బియ్యం తీసుకునే అంశం పరిశీలిస్తామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తేల్చిచెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల ప్రయత్నాలు, మిల్లర్ల ఒత్తిడి వంటి తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నాని మొలకెత్తిన ధాన్యం.. ఈ యాసంగిలో సుమారు 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం మిల్లులకు తరలించినా నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గత వానాకాలం, అంతకుముందు యాసంగికి సంబంధించిన సుమారు 44 లక్షల టన్నుల ధాన్యం సీఎంఆర్ కోసం మిల్లుల్లోనే ఉండటంతో.. చాలాచోట్ల ధాన్యం బస్తాలు ఆరుబయట, మిల్లుల ఆవరణల్లోనే ఉండిపోయాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు టార్పాలిన్ల కింద ఉంచిన ధాన్యం చాలావరకు తడిచిపోయింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , ఖమ్మం మొదలైన ఉమ్మడి జిల్లాల్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచి మొలకెత్తింది. ఈ నేపథ్యంలో మిల్లర్లు ఆందోళనలకు కూడా సిద్ధమయ్యారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించినా ఏవీ సత్ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో తడిచిన 10 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించాలని, తరువాత ఇతర ధాన్యాన్ని కూడా అమ్మేయాలని నిర్ణయించినా.. ముఖ్యమంత్రి నుంచి తుది ఆమోదం లభించలేదు. ఎట్టకేలకు బుధవారం సెంట్రల్ పూల్కు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడంతో దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని ఏం చేస్తారనే దానిపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ లేఖ రాష్ట్రంలో నిలిచి పోయిన బియ్యం సేకరణను గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎఫ్సీఐ తెలిపింది. ఈ మేరకు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్.అశోక్కుమార్ బుధవారం రాత్రి పౌరసరఫరాల శాఖ కమిషనర్కు లేఖ రాశారు. ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలకు దిగిన నేపథ్యంలో బియ్యం సేకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివరణ ఇస్తేనే సేకరణ – కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ తీరు వల్లనే ఆ రాష్ట్రంలో సెంట్రల్ పూల్ కింద బియ్యం సేకరణను నిలిపివేసినట్లు కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో మిల్లుల్లో ధాన్యం బస్తాలు మాయం కావడాన్ని గుర్తించడంతో పాటు, అనేక మిల్లుల్లో ధాన్యం లెక్కించడానికి వీల్లేకుండా ఉండటాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. మరోవైపు పీఎంజీకేఏవై కింద తీసుకున్న కోటా బియ్యాన్ని కూడా పంపిణీ చేయలేదని వివరించింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ పూల్ కింద బియ్యం సేకరణను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇప్పటికైనా సంబంధిత అంశాలపై వివరణతో సమగ్ర నివేదికను అందజేస్తే సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. -
రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు: గిరిజా శంకర్
సాక్షి, అమరావతి: రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే.. ‘‘ఇప్పటి వరకు 17 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. రోజుకి 50 వేల నుండి లక్ష మెట్రిక్ టన్నులను కొంటున్నాం. రైతులకు 21 రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తున్నాం రూ.1,153 కోట్లు రైతులకు డబ్బులు చెల్లించాం. మిల్లర్ల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ఈ సారి నూరు శాతం ఈ క్రాప్ చేశాం. అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ క్రాప్ డేటాని వినియోగిస్తున్నాం. ప్రతి రైతు ఖాతాని ఆధార్కి అనుసంధానం చేశాం. దళారులు లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. 80 శాతం మందికి డబ్బులు ఇవ్వడం లేదనడం అవాస్తవం. 21 రోజులు పూర్తయిన వారికి డబ్బులు ఇస్తున్నాం. తప్పుడు వార్తలు రాసిన పత్రికలకు లీగల్ నోటీసులు ఇస్తున్నాం. పోర్టిఫైడ్ బియ్యం ఎక్కువ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అందుకు అవసరమైన యంత్రాలను మిల్లులలో ఏర్పాటు చేస్తున్నాం. కడప, విశాఖపట్నంలో పోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని నిర్ణయించామని గిరిజా శంకర్ వెల్లడించారు. -
31,53,524 మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: రబీ సీజన్(2019–20)లో 2,15,150 మంది రైతుల నుంచి రూ.5,744.96 కోట్ల విలువ చేసే 31,53,524.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,437 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,835, సాధారణ ధాన్యానికి 1,815 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. ► స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ► ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు సేకరించిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎమ్మార్) కోసం మిల్లులకు పంపుతారు. ధాన్యం మిల్లులకు చేరిన 15 రోజుల్లోగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ► బియ్యం కొరత ఉన్న జిల్లాలకు మిగులు ఉన్న జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ► సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5,744.96కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ధాన్యం కొనుగోలుకు బల్క్ బయ్యర్లకు అవకాశం!
న్యూఢిల్లీ: ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేసేవారికి(బల్క్ బయ్యర్స్, బిగ్ రీటెయిలర్స్, ప్రాసెసర్స్) రైతులు, సహకార సంస్థల నుంచి ధాన్యాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనుమతినివ్వాలని కేంద్రం రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. మూడు నెలల పాటు వారికి ఆ అవకాశం కల్పించాలని కోరింది. తద్వారా వ్యవసాయ మార్కెట్లపై భారం తగ్గుతుందని, అలాగే, వినియోగదారుడికి తగినంత స్థాయిలో ఉత్పత్తులు లభిస్తాయని సూచించింది. అలాగే, వేర్హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టరైన గోదాములను ‘ఈ నామ్’ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్కు వీలైన మార్కెట్లుగా ప్రకటించాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ బుధవారం లేఖ రాశారు. అంబేడ్కర్ జయంతిన సెలవు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14ను కేంద్రం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన కార్యాలయాలు మూతపడనున్నాయి. -
గోదావరి జిల్లాల నుంచే ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ
హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి జిల్లాల నుంచే అత్యధికంగా ధాన్యం కోనుగోలు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19.10 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏన్సీడీఎక్స్ ద్వారా జరిపిన కొనుగోళ్ల వల్ల రూ.34కోట్ల ఆదాయాన్ని సమకూర్చగలిగామన్నారు.