Businessmen
-
కుబేరులకు కునుకు లేదు..?!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు నిద్రలేమితో బాధపడుతున్నారట. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు మొత్తం 260 మందిని సర్వే చేయగా ఆర్థిక అనిశి్చతి, ఎక్కువ సమయం పనిచేయడం, నిర్ణయాలు తీసుకోడానికి అధిక ఒత్తిడిని ఎదుర్కోడం, నిరంతర డిమాండ్లు తదితర అంశాలతో 55 శాతం మంది ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారట. ఇటీవల హార్ట్ఫుల్నెస్, టీఐఈ గ్లోబల్ సంయుక్తంగా నిద్ర సంక్షోభంపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ యజమానులు, టెక్ నిపుణులకు సైతం నిద్ర పట్టడంలేదని తేలింది. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు.పనితీరుపై ప్రభావం.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది తగినంత సమయం నిద్రలేకపోవడంతో పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, అలసటకు గురవుతున్నామని అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ఏకాగ్రత కోల్పోతున్నామని, ఫలితంగా కార్యాలయ పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. నిద్రలేమితో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారట. 26 శాతం మంది రాత్రి 6 గంటలే నిద్రపోతున్నారని, 19 శాతం మంది చాలా పేవలమైన నిద్రతో ఒత్తిడి, ఆందోళనల కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. నిద్రను త్యాగం చేస్తున్నారు.. స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపార వేత్తలు తమ విజయాల్లో నిద్రను త్యాగం చేస్తున్నారు. ఉత్పాదకత, నిర్ణయాలు తీసుకోవడం, పనితీరుపై నిద్ర లేమి ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. స్థిరమైన విజయానికి కీలకమైన ఆరోగ్యకరమైన పని–జీవన సమతుల్యతను సాధించడంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే వనరులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. – మురళి, గ్లోబల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ కేవలం విశ్రాంతి కాదు.. నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. మనసు, శరీరం, ఆత్మ పునరుజ్జీవనం పొందడానికి ఒక పవిత్ర అవకాశం. ఆరోగ్యకరమైన నిద్ర పద్ధతులతో జ్ఞానం, సృజనాత్మకత, సమతుల్యతతో నడిపించే సామర్థ్యం మెరుగ్గా ఉంటాయి. అంతర్ దృష్టి బలపడుతుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. – రెవరెండ్ దాజీ, హార్ట్ఫుల్ నెస్ గైడ్, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు -
జినెస్మెన్ అలర్ట్!
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు..వ్యాపారవేత్తలు, సంస్థలను కూడా తరచూ టార్గెట్ చేస్తున్నారు. వారి సర్వర్లలోకి చొరబడి విలువైన డేటాను తస్కరించడంతోపాటు ర్యాన్సమ్వేర్ ఎటాక్స్తో అందినకాడికి దోచుకుంటున్నారు. బిజినెస్ ఈ–మెయిల్స్ను కాంప్రమైజ్ (బీఈసీ) చేయడం ద్వారా ఈ నేరాలకు బీజం పడుతోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులుచెబుతున్నారు. ఈ నేరాలను ఎలా కనిపెట్టాలనే అంశంపై కీలకసూచనలు చేస్తూ మంగళవారం బుక్లెట్ను విడుదల చేశారు. - సాక్షి, హైదరాబాద్1. ఇటీవల పలువురికి సైబర్ నేరగాళ్ల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నట్లుచెప్తున్న సైబర్ నేరగాళ్లు.. అసాంఘికకార్యకలాపాల్లో మీ పేరుతో ఉన్ననంబర్ల వినియోగం జరిగిందని? కొన్నిగంటల్లోనే అన్ని నంబర్లు బ్లాక్ చేస్తున్నామని చెప్తున్నారు.ఆయా సెల్ఫోన్ నంబర్లు,హ్యాండ్ సెట్లకు సంబంధించినఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నంబర్లను పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీల సూచనలతో బ్లాక్ చేస్తుంటారు. ఈ పని ట్రాయ్ చేయదు.. ఆయా సర్వీస్ ప్రొవైడర్లు చేస్తుంటారు. 2 కస్టమ్స్, కొరియర్ సంస్థల పేరుతోనూ ఫోన్లు వస్తున్నాయి. మీ పేరుతో వస్తున్న పార్శిల్లోనిషేధిత వస్తువులు, డ్రగ్స్ ఉన్నాయని.. వెంటనే నిర్ణీతమొత్తం చెల్లించకుంటే కేసుఅవుతుందని బెదిరిస్తున్నారు. మీరు ఏ వస్తువునూ ఎక్కడకీపంపనప్పుడు భయపడాల్సిన పని లేదు. నిషేధిత వస్తువులు, డ్రగ్స్తో ముడిపడి ఉన్న కేసుల్లో జరిమానా చెల్లిస్తే బయటపడటం జరగదు. కస్టమ్స్ సహా ఏ ఏజెన్సీ కూడా ఇలా ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేయదు. 3 మీ బంధువులు మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నారని, వారిని అరెస్టు చేస్తున్నామని ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వీడియో కాల్ చేసి, ఆ మొత్తం చెల్లించే వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్తుంటారు.దేశంలోని ఏ పోలీసు, ఏజెన్సీ డిజిటల్ అరెస్టు చేయదు. ఇప్పటివరకు అమలులోకి వచ్చిన, అమలులో ఉన్న ఏ చట్టంలోనూ దీని ప్రస్తావన లేదు. ఇలాంటి కాల్స్ వస్తే నమ్మొద్దు.4బ్యాంకు అధికారులు, ఏజెంట్లుగా చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కేవైసీ అప్డేట్, రివార్డ్ పాయింట్స్ రీడీమ్ అంటూ వ్యక్తిగత వివరాలు తీసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తుంటారు.బ్యాంకులు, ఆర్థికసంస్థలు ఫోన్లు చేసి కేవైసీలు అడగవు. వ్యక్తిగతంగాసంబంధిత శాఖకు వచ్చి ఇవ్వమని చెప్తారు. బీఈసీ సంకేతాలు ఏంటి?» కొత్త ఈ–మెయిల్ ఐడీ నుంచి మెయిల్స్ రావడం. » బిజినెస్ ఈ–మెయిల్స్ పాస్వర్డ్స్ వ్యాపారులు,» ఆయా సంస్థల ప్రమేయం లేకుండా మారిపోవడం. » అనుమానిత సమయాలు, అనుమానాస్పద ప్రాంతాల నుంచి బిజినెస్ ఈ–మెయిల్స్లోకి లాగిన్ కావడానికి ప్రయత్నాలు జరగడం. » గుర్తుతెలియని వ్యక్తులు కంపెనీ డేటాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం.ఈ–మెయిల్స్ కాంప్రమైజ్ అయినట్లు గుర్తించడం ఎలా?సాధారణంగా బీఈసీ కోసం వాడే వైరస్తో ఈ–మెయిల్స్ను నేరగాళ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున(ఆడ్ అవర్స్) పంపిస్తూ ఉంటారు. ఆయా వేళల్లో అసాధారణ ఈ–మెయిల్ ఐడీలనుంచి మెయిల్స్ వస్తే అనుమానించాల్సిందే.ఒకేసారి కొత్త ఈ–మెయిల్ ఐడీలకు భారీగా డేటా బదిలీ కావడం, సున్నిత అంశాలతో కూడిన ఫైల్స్ వేళకాని వేళల్లో అధికారిక మెయిల్ ద్వారా బయటకు వెళితే అనుమానించాలి. పరిశీలించాల్సిన అంశాలు ఏంటి?» ఒకేసారి హఠాత్తుగా పెద్ద సంఖ్యలో ఈ–మెయిల్స్ వస్తుంటే బీఈసీని అనుమానించాల్సిందే. ఆ ఈ–మెయిల్స్లోని ప్రతి అక్షరాన్నీ నిశితంగా పరిశీలించాలి. » ‘వైర్ ట్రాన్స్ఫర్’, ’అర్జంట్ పేమెంట్’, ‘బ్యాంక్ అకౌంట్ చేంజ్డ్’తదితర పదాలతో వచ్చే ఈ–మెయిల్స్ విషయంలో మరింతఅప్రమత్తంగా ఉండాలి. వ్యాపారుల ఖాతాలకు బదులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు పంపే సైబర్ నేరగాళ్లు చేసేఈ నేరాలను అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్ అంటారు. కంప్యూటర్లలో బీఈసీ జరిగితే ఏం చేయాలి?» మాల్వేర్, వైరస్తో కూడిన ఈ–మెయిల్ ద్వారా బీఈసీ అయిన కంప్యూటర్ను ఇంటర్నల్ ల్యాన్ లేదా వీపీఎన్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. » అనుమానాస్పద ఐడీ అడ్రస్లు, ఈ–మెయిల్ ఐడీలను తక్షణం బ్లాక్ చేయాలి. కాంప్రమైజ్ అయినట్లు అనుమానిస్తున్న ఈ–మెయిల్ ఖాతాలను డిజేబుల్ చేయాలి. యాక్సెస్కంట్రోల్స్ను పెంచడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాల కోసం సదరు కంప్యూటర్, ఈ–మెయిల్లోని ఆధారాలను భద్రపరచాలి. -
రామ్ చరణ్ విలన్.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడా?
సినీ తారలకు సినిమా ఒక్కటే ప్రపంచం కాదు. ఎంత స్టార్డమ్ వచ్చినా వారు కేవలం ఆ రంగానికే పరిమితం కారు. తమ టాలెంట్ను పలు రకాలుగా చూపిస్తారు. కేవలం సినిమాల్లోనే చేస్తూ ఖాళీగా ఉండరు. కాస్తా సమయంలో దొరికితే చాలు ఏదో ఒక బిజినెస్ చేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో కనిపిస్తారు నటుడు అరవింద స్వామి. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా ధైర్యంగా నిలిచిన అతి కొద్దిమందిలో ఒకరాయన. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. ఎందుకంటే రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో ప్రతి నాయకుడిగా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. 20 ఏళ్లకే సినీ కెరీర్ ప్రారంభం 1991లో 20 ఏళ్లకే మణిరత్నం సినిమా తలపతిలో ఎంట్రీ ఇచ్చిన అరవింద స్వామి.. బొంబాయి, రోజా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాతే స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. అనంతరం బాలీవుడ్ భామ కాజోల్తో నటించిన చిత్రం మిన్సార కనవు చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత ఏడాదిలోనే సాత్ రంగ్ కే సప్నే చిత్రంలో జూహీ చావ్లా సరసన బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికీ కూడా అతన్ని కోలీవుడ్లో రజనీకాంత్, కమల్ హాసన్ల లాంటి స్టార్స్కు వారసుడిగా భావిస్తారు. అయితే 1990ల్లోనే బొంబాయి, రోజా సినిమాలతో సూపర్ స్టార్గా ఎదిగిన అరవింద్ స్వామి ఓ వ్యాపారవేత్త అని చాలామందికి తెలియదు. ప్రస్తుతం అరవింద్ స్వామి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం గురించి వివరాలేంటో తెలుసుకుందాం. 30 ఏళ్లకే నటనకు గుడ్బై- పక్షవాతంతో పోరాటం అయితే 90వ దశకం చివరి నాటికి అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. దీంతో తన సినిమా కెరీర్ పట్ల నిరాశతో ఉన్న స్వామి.. 2000 తర్వాత సినిమాల్లో నటించడం మానేశాడు. ఆ తర్వాత తన తండ్రి వ్యాపార వ్యవహరాలను చూసుకున్నారు. వీడీ స్వామి అండ్ కంపెనీలో పని చేస్తూనే.. ఆపై ఇంటర్ప్రో గ్లోబల్లో పని చేయడంపై దృష్టి సారించారు. అయితే 2005లో అతని కాలు పాక్షికంగా పక్షవాతానికి దారితీసింది. వ్యాపార సామ్రాజ్యం అయినప్పటికీ 2005లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించారు. పక్షవాతం నుంచి కోలుకున్నాక పే రోల్ ప్రాసెసింగ్, తాత్కాలిక సిబ్బందిని నియమించే టాలెంట్ మాక్సిమస్ అనే సంస్థను స్థాపించారు. రాకెట్ రీచ్ వంటి మార్కెట్ ట్రాకింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. 2022లో టాలెంట్ మాగ్జిమస్ ఆదాయం దాదాపు 418 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ. 3300 కోట్లు)గా ఉంది. ప్రస్తుతం అరవింద్ స్వామి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ అయితే మళ్లీ 2013లో తన గురువు మణిరత్న ప్రాజెక్ట్ కాదల్తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వామి తెలుగులో రామ్ చరణ్ మూవీ ధృవలో విలన్గా మెప్పించారు. 2021లో అతను తమిళ-హిందీ ద్విభాషా చిత్రం తలైవిలో కంగనా రనౌత్ సరసన ఏంజీ రామ్చంద్రన్ పాత్రలో నటించారు. -
స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!
ఇటీవల ఇటలీలో రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ సంఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ను పెళ్లాడిన గాయత్రి.. తన కెరీర్లో కేవలం ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ను వివాహం చేసుకుంది. సార్డినియా సూపర్కార్ టూర్లో పాల్గొనేందుకు గాయత్రి, వికాస్ ఇటలీకి వెళ్లారు. ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రీ జోషి కెరీర్ ఎలా ప్రారంభమైంది? 1977లో నాగ్పూర్లో జన్మించిన గాయత్రి ముంబైలోని కళాశాలలో చదువుతున్న సమయంలో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. మోడల్గా ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ ప్రకటనలలో నటించింది. షారుఖ్ ఖాన్తో కూడా ఓ ప్రకటనలో మొదటిసారి కనిపించింది. 1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. జపాన్లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2000లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. స్వదేశ్తో బాలీవుడ్లో అరంగేట్రం 2004లో మోడల్గా సక్సెల్ అయిన గాయత్రిని అశుతోష్ గోవారికర్ స్వదేశ్ చిత్రంలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాయత్రి తన తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. అయితే వికాస్ ఒబెరాయ్ని వివాహం చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. పెళ్లి తర్వాత గాయత్రి లైఫ్ గాయత్రి భర్త వికాస్.. ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఒకరు. అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 22,780 కోట్లు. ఇతరత్రా కలిసి ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 28000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయత్రి, వికాస్లకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ముంబయిలో నివసిస్తున్నారు. -
Women Behind Top Businessmen: బిజినెస్ టైకూన్ల సక్సెస్: ఈ విమెన్ గురించి తెలుసా?
-
నయవంచన..నటిపై పలుసార్లు అత్యాచారం.. !
ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ బిజినెస్మెన్ అత్యాచారానికి పాల్పడినట్లు నటి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా ఏఎన్ఐ ట్వీట్ చేసింది. (ఇది చదవండి: 'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!) కాగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని నటి ముంబై పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టాంజానియాకు చెందిన వ్యాపారి వీరేన్ పటేల్పై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. డబ్బులిస్తా వచ్చేయన్నాడు: హీరోయిన్) On the basis of a complaint from a female actor, a rape case has been registered against a businessman in NM Joshi Marg police station. The complainant told police that the businessman raped her several times on the pretext of marriage. Further investigation underway: Mumbai… — ANI (@ANI) August 5, 2023 -
Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశాడు. సబ్స్క్రిప్షన్ చార్జీలు చెల్లించని యూజర్ల అకౌంట్లన్నింటికీ బ్లూ టిక్లు తొలగించింది ట్విటర్. ఇందులో టాప్ సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, హై-ప్రొఫైల్ బిజినెస్మేన్లు ఉన్నారు. నెలవారీ రుసుము 8 డాలర్లు (సుమారు రూ. 660) చెల్లించని హై-ప్రొఫైల్ యూజర్ల ఖాతాలకు సంబంధించిన బ్లూటిక్లను ట్విటర్ తొలగించింది. వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే కచ్చితంగా సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించాలని లేకుంటే ఏప్రిల్ 20 నుంచి బ్లూటిక్లను తొలగిస్తామని గత కొన్ని రోజులుగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరిస్తూనే ఉన్నారు. గడువు తేదీ అయిపోగానే సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించని అకౌంట్లన్నికీ వెరిఫైడ్ బ్లూటిక్ టిక్ను ట్విటర్ తొలగించింది. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ ఇంకా పలువురు బడా వ్యాపారవేత్తలు తమ ట్విటర్ అకౌంట్లకు బ్లూటిక్ను కోల్పోయారు. తమ బ్లూ టిక్ అలాగే ఉండాలనుకునేవారు నెలకు సుమారు రూ.660 చొప్పున చెల్లించి ట్విటర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఇక వెరిఫైడ్ బ్యాడ్జ్ను ఉంచుకోవాలనుకునే సంస్థలు నెలవారీ రుసుము 1,000 డాలర్లు (రూ. 82వేలకు పైగా)తో పాటు 50 డాలర్లు (సుమారు రూ. 4,100) అదనంగా చెల్లించాలి.ట్విటర్ 'వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్' కోసం గోల్డ్ టిక్లను, ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు గ్రే టిక్లను ట్విటర్ అందిస్తుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
రాహుల్ గాంధీకి వాళ్లతో లింకులు.. ఆజాద్ సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. రాహుల్ విదేశాలకు వెళ్లి కలవకూడని వ్యాపారవేత్తలను కలుస్తారని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. దీన్నే అవకాశంగా అందిపుచ్చుకున్న బీజేపీ.. రాహుల్ విదేశాల్లో కలిసిన ఆ వ్యాపారవేత్తలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. వాళ్లను ఎందుకో కలిశారో కూడా వివరణ ఇవ్వాలని నిలదీసింది. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటు సాక్షిగా గళమెత్తిన ఆయన మోదీ, అదానీ విమానంలో కలిసి ప్రయాణించిన ఫొటోను కూడా సభలో ప్రదర్శించారు. అయితే రెండు రోజుల క్రితం అదానీ కంపెనీలకు చెందిన రూ.20వేల కోట్ల బినామీ డబ్బు ఎవరిదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిజాన్ని దాస్తూ బీజేపీ ప్రతిరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అదానీ పేరులోని అక్షరాలతో కాంగ్రెస్ మాజీ నాయకులు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్లు కలిసేలా ఫొటో పోస్టు చేశారు. ఇందులో గులాం నబీ ఆజాద్ పేరుతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత బిశ్వ శర్మ, అనిల్ ఆంటోని పేర్లు ఉన్నాయి. सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं! सवाल वही है - अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx — Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023 దీనిపైనే స్పందిస్తూ ఆజాద్ రాహుల్పై ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ అభిమానమే అని, అందుకే ఇంతకంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటానికి మాత్రం రాహుల్ గాంధీనే ప్రధాన కారణమని ఆజాద్ మరోసారి తేల్చిచెప్పారు. …their entire family (the Gandhis) have all along had association with businessmen, including him (Rahul Gandhi). He (Rahul) goes abroad and meets undesirable businessmen… - Ghulam Nabi Azad Rahul Gandhi must explain who are these businessmen he meets and for what purpose? pic.twitter.com/2juk0GlvhW — BJP (@BJP4India) April 9, 2023 కాగా.. అదానీ పేరులోని అక్షరంతో తన పేరును చూపడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. అదానీతో సంబంధం లేని తనను ఈ వ్యవహారంలోకి లాగినందుకు రాహుల్పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చదవండి: కాంగ్రెస్కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు
-
రష్యాలో ఒకరి తర్వాత ఒకరు.. అపర కుబేరులు ఎందుకు చనిపోతున్నారు?
రష్యాలో అపర కుబేరులు హఠాత్తుగా చనిపోతున్నారు. అంత్యంత అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వారేఎందుకిలా చనిపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఒక్క రష్యాలోనే కాదు ఇతర దేశాల్లోనూ రష్యన్ కుబేరులు మిస్టీరియస్గా తలలు వాల్చేస్తున్నారు. ఇవన్నీ ఆత్మహత్యలేనని పుతిన్ ప్రభుత్వం అంటోంది. అయితే మరణాలు జరిగిన తీరు చూస్తే మాత్రం ఇవి హత్యలేమో! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? లేక సహజ మరణాలా? హత్యలైతే వీటి వెనుక ఉన్న కుట్రదారు ఎవరు? సూత్రధారి ఎవరు? హంతకులు ఎవరు? ఏంటీ డెత్ మిస్టరీ? డిసెంబరు 24న మన పొరుగునే ఉన్న ఒడిషాలోని రాయగడలోని ఓ హోటల్ కిటికీ నుంచి పడి రష్యాకు చెందిన ఎంపీ, మల్టీ బిలియనీర్ పావెల్ ఆంటోవ్ అనుమానస్పద స్థితిలో మరణించారు. దీనికి రెండు రోజుల ముందే అంటే డిసెంబరు 22న ఇదే హోటల్లో ఆంటోవ్ సన్నిహితుడు అయిన మరో రష్యన్ వ్లదిమీర్ బిడెనోవ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు రష్యన్లు డిసెంబరు 21న ఈ హోటల్ లో దిగారు. ఆంటోవ్ 66వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోడానికి ప్రశాంతంగా ఉండే రాయగడ ప్రాంతాన్ని ఎంచుకున్న నలుగురు స్నేహితులు కలిసి ఇక్కడకు వచ్చారు. బిడెనోవ్ మరణంతో షాక్ తిన్న ఆంటోవ్ డిప్రెషన్లో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండచ్చన్నది పోలీసుల అనుమానం. అయితే ఈ రెండూ కూడా సహజ మరణాలో ఆత్మహత్యలో కావని ఇవి కచ్చితంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్లేనని మరి కొందరు అంటున్నారు. ఇంకో చిత్రం ఏంటంటే ఆంటోవ్ చనిపోయిన రోజే సెయింట్ పీటర్స్ బర్గ్ లోఅడ్మిరల్లీ షిప్ యార్డ్స్ డైరెక్టర్ జనరల్ అలెక్జాండర్ బుజకోవ్ హఠాత్తుగా మరణించారు. ఆయన మరణానికి కారణాలేంటన్నది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. వెనకున్నదెవరు? ఏంటీ మరణాలు? వీటి వెనుక ఏమన్నా కుట్ర ఉందా? కిరాయి హంతకులు ఉన్నారా? ఉంటే ఆ హంతకుల వెనుక ఉన్నదెవరు? ఎందుకంటే చనిపోయిన ఈ ముగ్గురూ కూడా మామూలు మనుషులు కారు. ఆంటోవ్ అయితే రష్యాలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడు. వ్యాపారాల్లోనూ దిట్ట. మిగతా వారూ మల్టీ బిలియనీర్లే. ఒక వేళ వీరివి హత్యలే అయితే.. వీరిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కోట్లకు పడగలెత్తిన వీరిని హతమార్చడానికి కిరాయి హంతకులను కుదుర్చుకోగల సత్తా ఎవరికి ఉంటుంది? కచ్చితంగా ఈ కోటీశ్వరులను తలదన్నే పెద్దలే దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. రష్యాలో ఇలా అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తోన్న కుబేరుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? పెద్ద సస్పెన్స్ హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ను మరిపించే ఈ వరుస మిస్టీరియస్ డెత్స్ వెనుక ఉన్న కథేంటి? ఇదే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ ఒక్క నెలలోనే అయిదుగురు రష్యన్ కుబేరులు అనుమానస్పదంగా మరణించారు. మొత్తం మీద ఏడాదికాలంగా 22 మంది రష్యన్ ప్రముఖులు భయానకంగా చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రష్యాలోని ప్రముఖ చమురు , సహజ వాయువు కంపెనీల్లో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనార్హం. గ్రాజ్ పోమ్, నోవాటెక్ వంటి ఆయిల్ కంపెనీలు రష్యాలో వ్యాపారాలను శాసిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన కుబేరులు అనుమానాస్పదంగా మరణించిన వారిలో ఉండడం విశేషం. చనిపోయిన వారిలో చాలా మంది తాము ఉన్న అపార్ట్మెంట్పై అంతస్థుల కిటికీలనుండి కిందకు పడి చనిపోయారు. కొందరయితే తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. కొద్ది మంది గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొనగా ఒకళ్లిద్దరి విషయంలో మరణాలకు కారణాలు కూడా తెలీలేదు. కొందరి మరణాలు సంభవించిన తీరు మరీ భయంకరంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఇవి నిజంగానే సహజ మరణాలా? ఆత్మహత్యలా? లేక కిరాయి హంతకులతో వీరిని ఎవరైనా తుదముట్టించారా? అన్న అనుమానాలు కలగక మానవు. విగత జీవులుగా భార్య పిల్లలు.. ఆయనేమో ఉరికి నోవాటెక్ కంపెనీ మాజీ డిప్యూటీ ఛైర్మన్ సెర్గీ ప్రోటో సెన్యా ఈ ఏడాది ఏప్రిల్లో కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ లక్జరీ విల్లాలో బస చేశారు. ఓ రోజు ఉదయాన చూసే సరికి ప్రోటో సెన్యా విల్లా చూరుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ప్రొటో సెన్యా భార్య, కూతురుల మృతదేహాలు విల్లాలో ఉన్నాయి. ఆ ఇద్దరి శరీరాలపైనా గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే కత్తితో పొడిచిన గాట్లు కూడా ఉన్నాయి. ప్రొటో సెన్యానే తన భార్యా పిల్లల్ని రాక్షసంగా చంపేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని స్పానిష్ పోలీసులు అన్నారు. ఒకవేళ ప్రొటొ సెన్యా ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటున్నాడో ఓ లేఖను పెట్టే వాడు. కానీ ఈ విల్లాలో ఎక్కడా కూడా సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఒక్కరోజు ముందే ప్రొటో సెన్యా విషాద మరణానికి ఒక్కరోజు ముందే ఏప్రిల్ 18న గ్యాజ్ ప్రోమ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లడిశ్లావ్ అవయేవ్ మాస్కోలనో తన అపార్ట్ మెంట్ లో భార్య పిల్లలతో సహా శవమై కనిపించారు. తన భార్య పిల్లల్ని కాల్చి చంపిన తర్వాత అవయేవ్ పిస్తోల్తో తనని తాను కాల్చుకుని చనిపోయి ఉండచ్చని భావిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే కంపెనీకి గతంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఇగోర్ వోలో బుయేవ్ అయితే అవయేవ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని అన్నారు. బహుశా వ్యవస్థలో చాలా పెద్దలకు సంబంధించిన కీలక సమాచారం ఏదో అవయేవ్ కు తెలిసి ఉంటుందని.. అది తమకి ప్రమాదమని భావించే వారి చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని ఇగోర్ భావిస్తున్నారు. అనుమానస్పద మృతి అవయేవ్ మరణానికి ఇంచుమించు నెల రోజుల క్రితం మార్చి 23న మెడ్ స్టార్మ్ కంపెనీ అధినేత వాసిలీ మెల్నికోవ్ నోవో గొరోడ్ లోని తన అపార్ట్ మెంట్లో తన భార్య, ఇద్దరు కొడుకులతో సహా అనుమానస్పద స్థితిలో మరణించారు. వైద్య పరికరాల తయారీ కంపెనీ అధినేత అయిన మెల్నికోవ్ తన భార్య, కొడుకులను కత్తితో పొడిచి చంపి అనంతరం తనని తాను పొడుచుకుని చనిపోయారన్నది పోలీసుల కథ. ఉరి తాడుకు వేలాడుతూ గతేడాది జనవరి 30న గ్యాస్ ప్రోమ్ డైరెక్టర్ షుల్మన్ తన ఇంట్లోని బాత్ రూంలో శవమై కనిపించారు. ఆయన పక్కన ఓ సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు పోలీసులు చెప్పారు. గ్యాజ్ ప్రోమ్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ట్యుల్య కోవ్ సెయింట్ పీటర్ బర్గ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. ట్యుల్యకోవ్ చనిపోయిన మూడు రోజులకే రష్యాలోనే ప్రముఖ ఆయిల్ కంపెనీ మ్యాగ్నెట్ గా పేరొందిన మిఖైల్ వాట్ ఫోర్డ్ ఇంగ్లాండ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత స్కై రిసార్ట్ అధినేత ఆండ్రీ క్రుకోవ్ స్కీ ఓ శిఖరంపై నుండి జారి పడి చనిపోయారు. పుతిన్పై అనుమానాలు అన్నీ అనుమానస్పద మరణాలే. ప్రతీ మరణ ఘటన లోనూ ఎన్నో ప్రశ్నలు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. అన్నీ దారుణ ఘటనలే. వీటన్నింటినీ నిశితంగా గమనిస్తే ఇవన్నీ కూడా రష్యా ప్రభుత్వాధినేత పుతిన్ చేయించినవే కావచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వారిని కానీ.. తనకు కంట్లో నలుసుగా తయారయ్యే వారిని కానీ తనకి భవిష్యత్తులో తలనొప్పిగా మారతారన్న వారిని కానీ ప్రాణాలతో విడిచి పెట్టడం అంత మంచిది కాదని పుతిన్ భావిస్తారన్నది పుతిన్ వ్యతిరేకుల వాదన. మొదట్నుంచీ కూడా పుతిన్ తన ప్రత్యర్ధులపై హత్యాయత్నాలకు పాల్పడిన చరిత్ర ఉందని వారంటున్నారు. రాజకీయాల్లో పుతిన్కు నిద్ర లేకుండా చేసిన రాజకీయ ప్రత్యర్ధి నావెల్నీపై 2020లో విష ప్రయోగం జరిగింది. ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అనంతరం నావెల్నీ ప్రాణాలతో బయట పడ్డారు. అంతకు రెండేళ్ల క్రితం 2018లో రష్యా నిఘా విభాగానికి మాజీ అధిపతి అయిన సెర్గీ స్క్రిపాల్ పైనా నావెల్నీ తరహాలోనే విష ప్రయోగం జరిగింది. ఈయన కూడా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రష్యా భద్రతాధికారి అలెగ్జాండర్ లిట్వినెంకోపై లండన్లో రేడియో ధార్మిక పదార్ధమైన పొలోనియంను ప్రయోగించారు. అలెగ్జాండర్ మాత్రం ఈ ఘలనలో చనిపోయారు. పుతిన్ పై అనుమానానికి కారణాలు లేకపోలేదు. ఒడిషాలో అనుమానస్పదంగా మరణించిన పావెల్ ఆంటోవ్ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కాలు దువ్వడాన్ని విమర్శించారు. క్యీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులను ఉగ్ర వాద చర్యగా అభివర్ణించారు. అయితే ఆ వెంటనే ఆంటోవ్ పై నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఆ వెంటనే ఆంటోవ్ చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించేశారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని అవగాహనా రాహిత్యంతో సాంకేతిక లోపంతో చేసిన వ్యాఖ్యలని ఆంటోవ్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అసలు అపర కుబేరులే ఎందుకు చనిపోతున్నారు.? ఈ మిస్టీరియస్ డెత్స్ వెనుక నిజంగానే పుతిన్ ఉన్నారా? ఇంతకీ ఈ అపర కుబేరులు ఎలా అవతరించారో కూడా తెలుసుకోవాలి. 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కమ్యూనిస్టు దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రష్యా కొత్త నేత బోరిస్ ఎల్సిన్ అధికారంలోకి రావడంతోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారు. వేలాది సంస్థలను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకున్నారు. రాత్రికి రాత్రే వారు అపర కుబేరులయ్యే అవకాశం వచ్చింది. ప్రత్యేకించి రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు సహజ వాయు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులు అడుగు పెట్టారు. అలా కీలక రంగాలన్నీ దక్కించుకున్న ఈ నయా వ్యాపారులనే ఆలిగాక్స్ అని పిలుస్తున్నారు. వారే రష్యాలో అత్యంత ధనవంతులన్నమాట. పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాపారుల్లో కొందరు పుతిన్ కు అండగా నిలిచారు. పుతిన్ వ్యవహార శైలి నచ్చక కొందరు దూరంగా ఉన్నారు. ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధానికి కాలుదువ్విన మరుక్షణమే ప్రపంచంలో అందరి కన్నాఎక్కువగా ఆందోళన చెందింది ఈ కుబేరులే. ఎందుకంటే తమ వ్యాపారాలపై యుద్ద ప్రభావం పడుతుందని వీరు భయపడ్డారు. వీరు అనుకున్నట్లే నాటో దేశాల ఆంక్షల తో రష్యన్ బిలియనీర్ల వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అన్నింటినీ మించి యూకే, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ లలో రష్యన్ కుబేరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విలాసవంతమైన విల్లాలు, ఎస్టేటులు కొన్నారు ప్రైవేటు జెట్ విమానాలు, ఓడలు పోర్టులు కొన్నారు. రష్యా యుద్ధం మొదలు పెట్టగానే నాటో దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యన్లకు ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఒక పక్క రష్యాలో తమ వ్యాపారాలు పడిపోవడం మరో పక్క విదేశాల్లోని తమ ఆస్తులన్నీ ఫ్రీజ్ అయిపోవడంతో రష్యన్ బిలయనీర్లు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇది వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే యుద్ధానికి కారణమైన పుతిన్ పై వ్యాపారులు మండి పడ్డారు. ఆ కోపంలోనే పుతిన్ పై విమర్శలూ చేశారు. ఆ తర్వాతనే 22 మంది సంపన్నులు అనుమానస్పద స్థితిలో చనిపోతూ వచ్చారు. సస్పెన్స్ సినిమాలో మాదిరిగా ఒకరి తర్వాత ఒకరు ఒకే విధంగా మరణానికి గురి కావడం ఆశ్చర్యచకితులను చేసింది. కొన్ని మరణాలు మరీ బీభత్సంగా క్రూరంగా ఉండడం మిగతా వారిని భయపెట్టింది. ప్రభుత్వం ఏమో ఆత్మహత్యలే అంటుంది. అక్కడి వాతావరణం చనిపోయిన తీరు చూస్తే అవి హత్యలేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.ఈ మారణ హోమం ఎప్పటికి అంతం అవుతుందనేది అతి పెద్ద ప్రశ్న. ఉక్రెయిన్ తో యుద్ధం ఆగిన వెంటనే ఈ మరణాలు కూడా ఆగితే మాత్రం ఇవి ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వ హత్యలే అనుకోవలసి వస్తుందని మేథావులు అంటున్నారు. పాలకులను చికాకు పెట్టే వారినీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టేవారినీ మూడోకంటికి తెలీకుండా మాయం చేసేసి శాల్తీలు గల్లంతు చేయడం అనేది రష్యాకు కొత్తకాదంటున్నారు విశ్లేషకులు. సోవియట్ యూనియన్ రోజుల్లోనూ నాటి గూఢచర సంస్థ కేజీబీ ఇదే చేసేదని వారంటున్నారు. ఇపుడు రష్యాలో కమ్యూనిజం లేకపోవచ్చుకానీ ప్రత్యర్ధులను లేపేసే వారసత్వం మాత్రం అలానే కొనసాగుతోందని వారంటున్నారు. పుతిన్ విధానాలను నిలదీసినందుకే రష్యాలో ఆలిగాక్స్ ల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉండచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సోవియట్ యూనియన్ కాలంలోనే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశాధినేత పుతిన్ కూడా ఒకనాటి కేజీబీ అధికారి కాబట్టే సోవియట్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లుందని వారు అభిప్రాయ పడుతున్నారు. విషాదం ఏంటంటే రష్యాలో చోటు చేసుకుంటోన్న వరుస మృతి ఘటనల్లో ఏ ఒక్క కేసులోనూ సరియైన సాక్ష్యాలు లేకపోవడం. అయితే దీన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
వ్యాపారి దారుణ హత్య
సనత్నగర్: ప్రముఖ వ్యాపారి ఎంఏ అజీజ్ హత్యకు గురయ్యారు. ఎర్రగడ్డ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన అజీజ్ హత్య దావనలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, హతుడి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. ఎర్రగడ్డకు చెందిన ఎంఏ అజీజ్ చిన్న కిరాణాషాపు నుంచి అంచలంచెలుగా ఎదిగి బడా వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయనకు ఆరుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మజీద్లో ప్రార్థనలు నిర్వహించి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలోని లక్ష్మీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళాడు. ఆయనను తన మనుమడు అద్నాత్ ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్ళి అక్కడ దిగబెట్టి వెళ్ళిపోయాడు. అయితే సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో తన తండ్రి కనిపించడం లేదంటూ అజీజ్ రెండో కుమారుడు మహ్మద్ అబ్దుల్ రహీం సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం వరకు కూడా తన తండ్రి ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల సా యంతో కుటుంబసభ్యులు లక్ష్మీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద గల సీసీ కెమెరాలను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం 2.19 గంటలకు ఎంఏ అజీజ్ స్థానిక లక్ష్మి కాంప్లెక్స్ను ఆనుకుని ఉన్న రహమత్ టవర్స్లోకి వెళ్ళినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆయన ముందు ఇద్దరు యువకులు కూడా నడుచుకుంటూ వెళ్లారు. రహమత్ టవర్స్ వైపు వెళ్ళిన అజీజ్ గురువారం వరకు కూడా తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించలేదు. పోలీసు సిబ్బంది , కుటుంబ సభ్యులు రహమత్ టవర్స్లో గాలించారు. సెల్లార్ చివరన ఉన్న గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. ఆ గది తాళం పగులగొట్టి చూడగా గదిలో అజీజ్ మృతదేహం కనిపించింది. ఒంటిపై రక్తపు మరకలు, గొంతుకు లుంగీతో చుట్టి ఉంది. హత్య విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత అంజన్కుమార్యాదవ్, ఎంఐఎం నేత మహ్మద్ షరీఫ్ సంఘటనా స్థలానికి వచ్చి హంతకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘ఈ–కామర్స్’కు కళ్లెం..!
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారస్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడులున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం... తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ సొంత పోర్టల్స్లో విక్రయించడం కుదరదు. ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ఎక్స్క్లూజివ్గా తమ పోర్టల్స్లోనే విక్రయించేలా ఈ–కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. తమ షాపింగ్ పోర్టల్స్లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ–కామర్స్ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, పేమెంట్స్, ఫైనాన్సింగ్ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి. ఈ–కామర్స్ సంస్థకు చెందిన గ్రూప్ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఈ–కామర్స్ సైట్లో విక్రేతలు తమ దగ్గరున్న నిల్వల్లో 25 శాతం ఉత్పత్తులకు మించి విక్రయించరాదు. ఉదాహరణకు, 4,000 యూనిట్ల ఉత్పత్తులు ఉంటే.. ఒక ఈ–కామర్స్ పోర్టల్లో 1,000 మాత్రమే విక్రయించవచ్చు. నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లుగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్ను ఈ– కామర్స్ కంపెనీలు ఆ పై ఏడాది సెప్టెంబర్ 30 లోగా రిజర్వ్ బ్యాంక్కు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిటైల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సవరించిన కొత్త విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పుష్కలంగా నిధులున్న ఈ–కామర్స్ సంస్థల తీవ్ర పోటీ నుంచి దేశీ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ప్రస్తుత విధానం ప్రకారం విక్రేత, కొనుగోలుదారుకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే మార్కెట్ప్లేస్ తరహా ఈ–కామర్స్ సంస్థల్లో మాత్రమే ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి. ఇలాంటి సంస్థలు తాము స్వయంగా కొనుగోళ్లు జరిపి, ఉత్పత్తులను నిల్వ చేసుకుని, విక్రయించడానికి లేదు. కొనుగోలుదారులకు ఈ–కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లిస్తూ తమ వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయంటూ దేశీ వ్యాపార సంస్థల నుంచి పెద్ద యెత్తున ఫిర్యాదులు రావడంతో ఈ–కామర్స్ సంస్థలను నియంత్రించే క్రమంలో కేంద్రం తాజా చర్యలు ప్రకటించింది. పెట్టుబడులకు ప్రతికూలం.. కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాలు మిశ్రమంగా స్పందించాయి. కొత్తగా మరింత మంది విక్రేతలను ఆన్లైన్ ప్లాట్ఫాం వైపు ఆకర్షించే దిశగా పెడుతున్న పెట్టుబడులపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ–కామర్స్ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. సర్క్యులర్ ను పరిశీలిస్తున్నామని అమెజాన్ ఇండియా ప్రతి నిధి వెల్లడించారు. అయితే, తాజా నిబంధనలను ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ స్వాగతించింది. ‘మార్కెట్ప్లేస్లనేవి నికార్సయిన, స్వతంత్ర వెం డార్ల కోసం ఉద్దేశించినవి. వీటిలో చాలా సంస్థలు చిన్న, మధ్యస్థాయివే. కొత్త మార్పులతో.. అందరికీ సమాన అవకాశాలు లభించగలవు‘ అని స్నాప్డీల్ సీఈవో కునాల్ బెహల్ వ్యాఖ్యానించారు. స్వాగతించిన సీఏఐటీ.. తాజా నిబంధనలను ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ స్వాగతించింది. ఈ–కామర్స్ రంగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని, ఈ–కామర్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరింది. ‘సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న విజయం ఇది. దీన్ని సక్రమంగా అమలు చేస్తే.. ఈ–కామర్స్ కంపెనీలు పాటించే అనుచిత వ్యాపార విధానాలు, పోటీ లేకుండా చేసే ధరల విధానాలు, భారీ డిస్కౌంట్లు మొదలైనవి ఇకపై ఉండబోవు‘ అని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కాకుండా ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వర్తింపచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్నారు. -
సింగపూర్లో హైదరాబాద్ నగల వ్యాపారి హత్య
-
సింగపూర్లో హైదరాబాద్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: సింగపూర్లో నగర వ్యాపారి వాసుదేవ్ రాజ్ దారుణ హత్యకు గురయ్యారు. వ్యాపారం పేరుతో కుషాయిగూడ మహేష్నగర్ వాసి అయిన వాసుదేవ్ను నిందితులు సింగపూర్ తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో బంధించి అతని బంధువులకు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. వాసుదేవ్ను బంధించిన ఫొటోలను వారికి వాట్సప్లో పంపారు. అయితే వారు సకాలంలో స్పందించలేదనే కోపంతో వాసుదేవ్ను హతమార్చారు. భారత రాయబార కార్యాలయ అధికారుల ద్వారా కుటుంబీకులకు వాసుదేవ్ హత్యకు సంబందించిన సమాచారం అందింది. శనివారం లేదా ఆదివారం అతని మృతదేహం నగరానికి చేరుకోనుంది. -
జోరుగా వడ్డీ దందా
♦ చిరువ్యాపారులు, రైతులే టార్గెట్ ♦ రూ.3నుంచి రూ.10 వడ్డీ వసూలు ♦ అనుమతి లేని ఫైనాన్స్లే అధికం నేరడిగొండ(బోథ్): జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలు, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడుతున్న శ్రమజీవులకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీ గుంజుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పాటు ఖరీఫ్ కూడా మొదలైంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం, రైతులు సాగు పెట్టుబడుల కోసం ప్రైవేట్ ఫైనాన్స్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వడ్డీ వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. తోపుడు బండ్లు, చాయ్ హోటళ్లు, పాన్షాప్లు, ఆటోరిక్షాలు, చిన్నచిన్న మెకానిక్ సెంటర్లను టార్గెట్గా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అవసరాలే ఆసరాగా.. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడిపోతున్నారు. సకాలంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో కొందరు, జమ అయినా బ్యాంకు నుంచి నగదు అందక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు విధి లేక వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో చిన్నవి.. పెద్దవి కలిపి అనుమతులు పొందినవి, పొందనివి 200లకు పైగా ఫైనాన్స్లు ఉన్నాయి. వీరంతా రూ.100కు రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితుల ద్వారా తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చిన రైతులకు చెందిన భూముల పత్రాలను తాకట్టు పెట్టుకుంటున్నారు. ఖాళీ బాండ్ పేపర్ల మీద రైతులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంతకాలు చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. అనుమతి లేకుండా దర్జాగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రైతులకు ఇచ్చే అప్పుల్లో ముందుగానే వడ్డీలను పట్టుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారు. రైతులు పంటలు పండగానే మొత్తం డబ్బులను ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యమైనా ఇచ్చిన డబ్బులకు మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. అలాగే చిరు వ్యాపారులకు ఇచ్చే డబ్బుల్లోనూ ముందుగానే వడ్డీ తీసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. రోజువారీగా డబ్బులు వసూలు చేస్తుంటారు. దీంతో అప్పులు తీసుకున్న వారి నుంచి 20శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లల చదువుల కోసం వేలాది రూపాయలు చెల్లించలేక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. వడ్డీ ఎక్కువైనా సరే అంటూ పిల్లల భవిష్యత్ కోసం అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీ భారాన్ని మోయలేక, తిరిగి చెల్లించలేక నానా యాతన పడుతున్నారు. పట్టించుకునేవారేరి? ఈ ఫైనాన్స్లలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు చోట్ల అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని అప్పులు ఇస్తున్నారు. ప్రతీరోజు జిల్లాలో కోట్లలో వ్యాపారం సాగుతోంది. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు. లైసెన్సులు లేకుంటే చర్యలు ఎవరైనా లైసెన్సు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా అధికవడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తాం. ఫైనాన్స్ నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తాం. – వేముల చంద్రప్రభు, డీఎస్పీ, ఉట్నూర్ -
అద్దెతీసుకొని రోడ్డు పాల్జేశారు..
మహా మండపంలోని వ్యాపారుల ఆవేదన ఇంద్రకీలాద్రి: ‘ఏడాదికి రూ. 1.70 కోట్లు చెల్లిస్తున్నాం..పుష్కరాల నుంచి ఏ రోజు కూడా బోణీ అయింది లేదు.. కనీసం కొండ కింద దుకాణాలు పెట్టుకునేలా అనుమతించాలని అడిగితే టోల్గేటు వద్ద రోడ్డుపై నిల్చుని పూజా సామగ్రి అమ్ముకోవాలని చెబుతున్నారు.. ఇదెక్కటి న్యాయమా’ అంటూ మహా మండపంలోని ఐదో అంతస్తులోని దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాల తర్వాత దుకాణాలను కొండ కింద ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తామని దుర్గగుడి ఈవో పేర్కొనడంతో మూడు రోజులుగా దుకాణ యజమానులందరూ లీజెస్ విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు...అయితే అధికారులు మంగళవారం చెప్పిన మాటలు విని దుకాణదారులు షాక్కు గురయ్యారు. నెలకు ఒక్కొక్క దుకాణానికి రూ. 40 వేల నుంచి రూ. 70 వేల వరకు చెల్లిస్తూ టోల్గేటు వద్ద రోడ్డుపై నిల్చుని పూజా సామగ్రి విక్రయించుకోవాలని సూచించడంతో వారు నివ్వెరపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ తమ దుకాణాలను మూసి వేసి నిరసన తెలిపారు. దుర్గగుడి ఈవో, లీజెస్ విభాగం అధికారుల తీరుపై ఎమ్మెల్యే బుద్ధా వెంకన్నను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. షాపులు మహా మండపంలో.. రాకపోకలు ఘాట్ రోడ్డుపై.. ఘాట్ రోడ్డులో షాపులు తొలగించాం.. ఇక భక్తుల రాకపోకలు మహా మండపం మీదగానే అని నమ్మించి లక్షల రూపాయల కట్టించుకున్న దుర్గగుడి అధికారులు తమను మోసం చేశారని పలువురు దుకాణదారులు ఆవేదన చెందుతున్నారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఘాట్ రోడ్డుపై నుంచే భక్తులకు కొండపైకి అనుమతిస్తున్నారన్నారు. కనీసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాపు తీసుకుని కూర్చున్నా పట్టుమని రూ. 100 కూడా అమ్మడం లేదని వాపోతున్నారు. ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తోందని, అధికారుల ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామని స్పష్టం చేస్తున్నారు. -
వ్యాపారులకు అండగా చాంబర్ ఆఫ్ కామర్స్
పాత గుంటూరు: 75 ఏళ్ల నుంచి వ్యాపార, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి చాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేసిందని ది ఇండియన్ చాంబర్ ఆఫ్కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. జిన్నాటవర్ సెంటర్లోని చాంబర్ కార్యాలయంలో మంగళవారం 77వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆతుకూరి ఆంజనేయులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్లో 3 వేల మంది సభ్యులు, 90 అనుబంధ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీ యాక్ట్ కింద రిజిష్ట్రరు అయి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చాంబర్ గుంటూరు ఒక్కటేనన్నారు. ఎక్స్పోర్టు సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజన్ ఇచ్చే అధికారం ఉందన్నారు. జిల్లాలో పొగాకు, మిర్చి, కాటన్ ఎగుమతి అవుతుందని, ఎవరైనా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళాలంటే చాంబర్ లెటర్ ఉంటేనే వ్యాపార వీసా ఉంటుందని వెల్లడించారు. డిసెంబరులో చాంబర్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం∙జూబిలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆతుకూరి ఆంజనేయులును సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు, మిత్రులు శాలువా, పూలదండలతో సత్కరించారు. సంస్థ కార్యదర్శి అన్నా పూర్ణచంద్రారవు, గజవల్లి శివన్నారాయణ, రంగ బాలకృష్ణ, తూనుగుంట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణాలకు సిమెంట్ పోటు
పెరిగిన ధరలు.. ఆందోళనలో నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు పాత గుంటూరు: పెరిగిన సిమెంట్ ధరల కారణంగా జిల్లాలో నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. 20 రోజుల వ్యవధిలో సిమెంటు ధర పెరగడంతో భవన నిర్మాణ దారులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలు చేపట్టడం కష్టతరంగా ఉందని వాపోతున్నారు. గతంలో రూ. 320లు ఉన్న సిమెంటు బస్తా ధర, ప్రస్తుతం రూ. 360లకు చేరింది. ఈ ప్రభావం తమను నష్టాలకు గురిచేస్తుందని కాంట్రాక్టర్లు సైతం బెంబేలెత్తుతున్నారు. భవన యజమానులతో తక్కువ ధరకు ఒప్పందాలు కుదుర్చుకొని పెరిగిన సిమెంట్ ధరల కారణంగా నిర్మాణాలు చేయలేక పోతున్నామని అంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా లక్ష టన్నుల వరకు 23 కంపెనీలకు చెందిన సిమెంటు అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు నగరంలో ఉన్న 100 సిమెంటు దుకాణాల ద్వారా 30 వేల టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయని సమాచారం. గత ఆరు నెలలుగా సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒకేసారి రూ.40 ధర పెరిగింది. సిమెంట్ ఉత్పత్తి లేదని చెప్పి సంస్థలు సరఫరా నిలిపివేయడంతోనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సిమెంటుకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉందని, ప్రస్తుతం వున్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తేనే ఎగుమతి చేస్తామని ఉత్పత్తి సంస్థలు అంటున్నాయని, అయితే అధిక ధరలకు కొనుగోలు చేసి అమ్మకాలు కొనసాగించే పరిస్థితి ప్రస్తుతం లేదని సిమెంటు డీలర్లు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలు దిగివచ్చేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. నష్టాల బాట పడుతున్నాం.. ఉత్పత్తి సంస్థలు సిమెంటు ధరలు పెంచడంతో అమ్మకాలు జరపలేకపోతున్నాం. పాత ధరలకే కొనుగోలు దారులకు సిమెంటును ఇవ్వాల్సి వస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టాల బాట పడుతున్నాం. – అబ్దుల్ మదన్, సిమెంటు వ్యాపారి -
రైల్ నీల్ కుంభకోణంలో చార్జిషీటు
న్యూఢిల్లీ: సంచలనం రేపిన రైల్ నీల్ కుంభకోణంలో సీబీఐ శుక్రవారం చార్జ్షీటు దాఖలుచేసింది. మంచినీటి సీసాల సరఫరా వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టింది. నార్తరన్ రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్లు ఎం.ఎస్. ఛలియా, సందీప్ సిలాస్లపై చార్జిషీటు నమోదు చేసింది. వివిధ ప్రైవేటు కంపెనీ అధిపతులు సహా మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఉన్నతాధికారి దేవ్ ప్రీత్ సింగ్ తెలిపారు. భారతీయ రైల్వేల ద్వారా సరఫరా చేసే నాణ్యమైన మంచినీటి సీసాలకు బదులుగా చౌకరకం బాటిళ్లు సరఫరా చేసిన విషయంలో అప్పట్లో చీఫ్ కమర్షియల్ మేనేజర్లుగా ఉన్న అధికారులిద్దరిపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించి భారతీయ రైల్వే సంస్థకు సుమారు 20 కోట్ల మేర నష్టం కలిగించినట్టు ఆరోపణలున్నాయి. రాజధాని, శతాబ్ది లాంటి ప్రధాన రైళ్లలో తప్పనిసరి చేసిన 'రైల్ నీర్'ను కాకుండా చౌకరకం బాటిళ్లను సరఫరా చేసిన వ్యవహారంలో సీబీఐ శుక్రవారం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఆర్కే అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యం కేటరర్స్, అంబుజ్ హోటల్ అండ్ రియల్ ఎస్టేట్, పీకే అసోసియేట్స్, సన్షైన్ ప్రైవేట్ లిమిటెడ్, బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్, ఫుడ్వరల్డ్ సంస్థలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేసింది. మంచినీటిని సరఫరా చేసిన ఆర్కే అసోసియేట్స్, బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్ల యజమానులైన శ్యాంబిహారీ అగర్వాల్, ఆయన కుమారులు అభిషేక్, రాహుల్ల నివాసాల నుంచి రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులకు భారీ ముడుపులు అందాయని, ప్రైవేటు క్యాటరర్లు చౌకరకం బాటిళ్లతో భారీగా లాభాలను ఆర్జించారని సీబీఐ ఆరోపిస్తోంది. తద్వారా ఖజనాకు భారీనష్టం కలిగిందని సీబీఐ అధికారి తెలిపారు. తమ విచారణను మిగతా 16 జోన్లకు కూడా విస్తరిస్తామమన్నారు. -
ఇక థాయ్ వీసా గడువు 6 నెలలు
ఆలోగా ఎన్నిసార్లయినా వెళ్లి రావచ్చు... - నవంబర్ 13 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి - థాయ్లాండ్ కాన్సుల్ జనరల్ సోమ్సాక్ త్రియంజంగరుణ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు థాయ్లాండ్ ఎర్రతివాచీ పరిచింది. గతంలో 90 రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆ దేశానికి వెళ్లొచ్చే అవకాశముండేది. కానీ, కొత్త వీసా నిబంధనలతో ఒకసారి వీసా తీసుకుంటే 6 నెలల్లో వ్యాపారులు, పర్యాటకులు థాయ్కు ఎన్నిసార్లయినా వెళ్లొచ్చే అవకాశం రానుంది. నవంబర్ 13 నుంచి ఈ కొత్త వీసా నిబంధన అమలులోకి రానున్నట్లు థాయ్లాండ్ కాన్సుల్ జనరల్ సోమ్సాక్ త్రియంజంగరుణ్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ‘థాయ్లాండ్ ఆర్థికాభివృద్ధి- వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై మంగళవారమిక్కడ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమ్సాక్ మాట్లాడుతూ.. ‘‘కొత్త వీసా జారీకి 5,000 థాయ్ భట్స్ (థాయ్లాండ్ కరెన్సీ. మన కరెన్సీలో సుమారు 10వేలు) ఖర్చవుతాయి. వీసా జారీని మరింత వేగవంతం చేసేందుకు బంజారాహిల్స్లో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించాం. దరఖాస్తు చేసుకున్న 3-4 రోజుల వ్యవధిలో వ్యాపారులు, పర్యాటకులకు వీసా, పాస్పోర్ట్ను అందిస్తాం’’ అని చెప్పారు. ఏటా థాయ్లాండ్కు విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని... ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 70 లక్షల మంది పర్యాటకులు థాయ్ను సందర్శించారని పేర్కొన్నారు. టూరిజానికే కాకుండా థాయ్లో వ్యాపారావకాశాలూ పుష్కలంగా ఉన్నాయని.. వాహన పరికరాలు, కూరగాయలు, విలువైన రాళ్లు, జ్యుయలరీ రంగాలకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలియజేశారు. 2014లో ఇండియా, థాయ్ మధ్య 8 బిలియన్ డాలర ్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని.. ఈ ఏడాది అది 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని సోమ్సాక్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్యూ2లో థాయ్లాండ్ నుంచి ప్రపంచ దేశాలకు 52.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగ్గా.. ఇతర దేశాల నుంచి థాయ్కు 44.8 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయని తెలిపారు. -
కొనసాగుతున్న కూలీ రేట్ల పెంపు వివాదం
విశాఖపట్టణం(చోడవరం): హామాలీలు, వ్యాపారులకు మధ్య కూలీ విషయంలో మొదలైన వివాదం ఇంకా సద్దుమణగలేదు. కొన్ని రోజులుగా హామాలీలకు చిరు వ్యాపారులకు మధ్య కూలీ రేట్ల పెంపు విషయమై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా హామాలీలు సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు వ్యాపారులు అనూహ్యంగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రైవేట్ కూలీల సహయంతో సరకు రవాణా చేస్తుంటే కొందరు హామాలీలు అడ్డుకుంటున్నారని వ్యాపారులు తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. -
పెట్టుబడులకు అత్యుత్తమం.. భారత్
వాషింగ్టన్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వాషింగ్టన్ : పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా బుధవారం నుంచీ 10 రోజుల అమెరికా పర్యటన ప్రారంభించిన ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తన న్యూయార్క్ పర్యటనను ముగించుకుని రాజధాని వాషింగ్టన్కు చేరుకున్నారు. రెండు నగరాల్లో అత్యున్నత స్థాయి అమెరికా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థికంగా తీవ్ర మందగమనంలో నడుస్తున్న ప్రపంచంలో.. భారత్ పెట్టుబడులకు అత్యుత్తమ మార్గమని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు పూర్తి కట్టడిలో ఉన్నాయని, వృద్ధి రేటు ప్రపంచదేశాల్లోనే వేగంగా పురోగమిస్తోందని వివరించారు. కేంద్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం సుస్థిర, విశ్వసనీయ, పారదర్శక విధానాల వ్యవస్థను అందిస్తోందని పేర్కొన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి పెట్టుబడిదారూ.. తమకు సుస్థిర విధాన వ్యవస్థ కావాలని కోరారని, ఇలాంటి వ్యవస్థ రూపకల్పనకు, ఈ ప్రక్రియను కొనసాగించడానికి భారత్ కట్టుబడి ఉందని, తద్వారా ఆర్థికాభివృద్ధి తమ లక్ష్యమని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► భారత్ పట్ల పెట్టుబడిదారుల వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడింది. మరో మూడు రోజుల శాన్ఫ్రాన్సిస్కో పర్యటన ద్వారా పెట్టుబడిదారుల అభిప్రాయాలను తెలుసుకోడానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తాను. ► {పత్యక్ష పన్ను రేట్లు 25 శాతానికి తగ్గించడం, వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) దిశగా దేశం మార్పునకు ముందడుగు, పాతలావాదేవీలపై కొత్త పన్ను (రెట్రాస్పెక్టివ్) భయాలు తొలగేలా చూడడం.. పన్నుల వ్యవస్థలో ప్రధాన సంస్కరణలకు సంబంధించి అంశాలు, రెట్రాస్పెక్టివ్ సమస్య ఇప్పటిదికాదు. మా ప్రభుత్వ ముందు నుంచీ వస్తున్న ఈ వివాద పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు భయపడాల్సింది ఏదీ లేదు. అసాధారణ అంశం అయితే తప్పించి, పాత లావాదేవీలపై కొత్త పన్ను భారాలు సరికాదన్నది మా అభిప్రాయం. ► సబ్సిడీల హేతుబద్దీకరణ, బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతి, తద్వారా ప్రత్యక్ష ప్రయోజనాల బదలాయింపు (డీబీటీ) యంత్రాంగం వినియోగం, సహజవనరుల వినియోగం వంటి ముఖ్య అంశాల్లో హేతుబద్దీకరణ ప్రభుత్వ చొరవల్లో కీలకమైనవి. ► నైపుణ్య భారతంపై ప్రస్తుతం దృష్టి సారించాం. అలాగే దేశంలో మౌలిక రంగం పురోగతికి భారీ పెట్టుబడుల ప్రణాళికను కేంద్రం చేపట్టింది. ఇందుకు వీలుగా ఈ ఏడాదిపాటు ద్రవ్య స్థిరత్వం విషయంలో కొంత వెసులుబాటు తీసుకుంటున్నాం. తయారీ రంగం వృద్ధికి తగిన పన్ను విధాన రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఈ రంగం మెరుగుపడుతుందన్న విశ్వాసముంది. ► నల్లధనం సమస్య పరిష్కారానికి అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగుతోంది. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతల సమస్యలను అరికట్టడానికి ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియెన్స్ యాక్ట్ (ఎఫ్ఏటీసీఏ)లో భాగం పంచుకోడానికి భారత్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు జరిగేదీ ఇంకా నిర్ణయం కాలేదు. పన్నులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా సమాచార మార్పిడికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది. అంతర్జాతీయంగా లెక్కచూపని ఆస్తులను బయటకు తేవాలన్న ప్రభుత్వ సంకల్పం దీనితో నెరవేరుతుంది. ► ఒకవేళ వర్షాభావ పరిస్థితులు తలెత్తితే... ఎదుర్కొనడానికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విస్తరించాలన్న యోచన ఉంది. ఈ పథకానికి తాజా బడ్జెట్లో దాదాపు రూ.54,000 కోట్లు కేటాయించాం. ► బ్యాంకులకు తగిన తాజా మూలధన కల్పన ప్రభుత్వ విధానం. ఇందుకు ఒక మార్గం బడ్జెటరీ మద్దతు. మరొకటి ప్రభుత్వ వాటాను 52 శాతానికి కుదించడం. ఇక ఆర్థిక వృద్ధి మెరుగుపడితే... క్రమంగా బ్యాంకులకు మొండిబకాయిల (ఎన్పీఏ) బెడదా తగ్గిపోతుందన్నది మా విశ్వాసం. కాగా ఆల్టైమ్ గరిష్టం ► 6 శాతానికి చేరిన ఎన్పీఏలు ఇప్పుడు 5.64 శాతానికి చేరడం చెప్పుకోదగిన మరో ముఖ్యాంశం. ద్వైపాక్షిక అంశాలపై చర్చ.. ఆర్థికమంత్రి వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అమెరికా ఉన్నతస్థాయి అధికారులతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇందులో ఒకటి. ఆర్థికమంత్రి సమావేశమయిన వారిలో అమెరికా ఆర్థికమంత్రి జాన్ లీ, వాణిజ్యమంత్రి పెన్నీ పిడ్జ్కర్ ఉన్నారు. ట్రేడ్ రిప్రజెంటేటివ్ మైక్ ఫ్రోమెన్తో కూడా జైట్లీ సమావేశం జరిపారు. పలు అంశాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి తెలిపారు. ఎందుకు పెరిగాయంటే... వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కరువు భయాలు తొలగడం వంటి కారణాలతో గత వారమంతా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే నడిచింది. మారిషస్కు చెందిన ఎంవీ ఎస్సీఐఎఫ్ సంస్థ 0.5 శాతం వాటా కొనుగోలు చేయడంతో జేపీ అసోసియేట్స్, 4జీ సర్వీసులను డిసెంబర్కల్లా తెస్తామని ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎగిశాయి. ఎందుకు తగ్గాయంటే... కెయిర్న్, వేదాంత విలీనం ఆకర్షణీయంగా లేదని కెయిర్న్ ఇండియా మైనార్టీ వాటాదారుల్లో ఒకటైన ఎల్ఐసీ ఆందోళన వ్యక్తం చేయడంతో వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అదానీ పవర్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు తగ్గాయి. -
ఫేస్ బుక్కయ్యాడు
* ఫేస్బుక్ ద్వారా మోసం చేసిన యువకుడు అరెస్టు * మోసపోయిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరుమాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు * ఫ్యాన్సీ సెల్ఫోన్ నంబర్లు ఇప్పిస్తానని రూ.20 లక్షలకు టోకరా * రూ.12.22 లక్షలు రికవరీ * వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీకాంత్ ఒంగోలు క్రైం : ఫేస్బుక్ ద్వారా ప్రముఖులతో పరిచయాల ఏర్పరచుకుని ఫ్యాన్సీ సెల్నంబర్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ యువకుడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, వ్యాపారవేత్తలను మోసం చేసి లక్షల రూపాయలకు టోకరా పెట్టి చివరకు బుక్కయ్యాడు. ఈ హైటెక్ మోసగాడ్ని చీరాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని మోసాలకు సంబంధించిన వివరాలను స్థానిక తన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, చీరాల డీఎస్పీ జయరాంరాజు, చీరాల టూటౌన్ సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ శనివారం సాయంత్రం వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ ఫ్యాన్సీసెల్ఫోన్ నంబర్ల పేరుతో దాదాపు రూ.20 లక్షల వరకు మోసం చేశాడు. మోసపోయిన వారిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్ (చీరాల), దామచర్ల జనార్దన్ (ఒంగోలు) ఉన్నారు. వీరితోపాటు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గోపాలపురం ఎమ్మెల్యేలు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్, ఏలూరి మాజీ ఎమ్మెల్యే కూడా బాధితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీ, విశాఖపట్నంకు చెందిన పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీ, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన యజమానులను కూడా మోసం చేసి లక్షల రూపాయలకు టోకరా వేశాడు. చీరాలలోని గుంటూరు బస్టాండ్ సెంటర్లో నిందితుడిని చీరాల డీఎస్పీ, సీఐలు తమ సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నేపథ్యమిదీ... నిందితుడు దీపుబాబు తండ్రి లక్ష్మణరావు తూర్పుగోదావరి జిల్లాలో ఓ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడు కోరుకొండలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. చిన్న వయసులోనే స్కేటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కుడికాలు కోల్పోయాడు. కొయ్య కాలుతో ఇతను మనుగడ సాగిస్తున్నాడు. మోసాలు చేసైనా సరే లక్షలు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లతో ఫొటోలు తీయించుకుని వారందరితో పరిచయాలున్నట్టు ఇతరులను నమ్మించేవాడు. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు ఫేస్బుక్ ద్వారా మేసేజ్లు పంపించి ఫ్యాన్సీ సెల్ఫోన్ నంబర్లు ఇప్పిస్తానంటూ నమ్మించేందుకు ప్రయత్నించేవాడు. తన స్నేహితుడు చల్లగుంట సురేష్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీయించి ఆ అకౌంట్లో డబ్బులు వేయించుకునేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. రాష్ట్రం మొత్తం మీద ఇతనిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని, మొట్టమొదటగా జిల్లాలో రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ వివరించారు. నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న చీరాల డీఎస్పీ జయరామరాజు, చీరాల రెండో పట్టణ సీఐ ఎండీ అబ్దుల్ సుబాన్, ఎస్సై ఎం.రామానాయక్, ఏఎస్సై వై.శ్రీనివాసరావు, హెచ్సీ డి.సత్యరాజు, కానిస్టేబుల్ డి.రవి, అచ్చయ్య, అలెక్స్, హెచ్జీ వి.రమణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చేసిన నేరాలు... * చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు ఫ్యాన్సీ సెల్ఫోన్ నంబర్లు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్నుంచి రూ.9,26,900 వేయించుకున్నాడు. * ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కూడా ఇదేవిధంగా మోసం చేసి అతని అకౌంట్ నుంచి రూ.4 లక్షలు వేయించుకున్నాడు. * పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.64 వేలు, గోపాలపురం ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్ నుంచి రూ.48 వేలు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.15 వేలు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.24 వేలు, పైడి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానుల బ్యాంకు అకౌంట్ నుంచి రూ.2,22,000, ప్రగతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానుల నుంచి రూ.48 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సొత్తు స్వాధీనం... * నిందితుడి నుంచి డీఎస్కే హైసగ్ స్పోర్ట్స్ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.50 లక్షలు. అతని స్నేహితుని బ్యాంక్ అకౌంట్ను నిలిపివేయడం ద్వారా బ్యాంకులో ఉన్న రూ.5.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.లక్షన్నర విలువైన బంగారు చైన్, మూడు ఉంగరాలు, రూ.35 వేలు విలువైన యాసర్ ల్యాప్టాప్, రూ.83 వేల విలువైన మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
మద్యాన్ని నిషేధించలేం... నియంత్రిస్తాం
సింగపూర్: 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం సింగపూర్లో స్థానిక పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు వేసిన ప్రశ్నలకు బాబు సమాధాన మిచ్చారు. ఆ ప్రశ్న జవాబుల పరంపర ఇలా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో వివరించాలని పారిశ్రామికవేత్తలు బాబును కోరారు. కంపెనీలు స్థాపించేవారికి వేగంగా అనుమతులు మంజురు చేస్తామని బాబు సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఒక్క రాజధానిపైనే ఎందుకు దృష్టి సారించింది? గతంలో జరిగిన నష్టమే మళ్లీ జరుగుతుందని మరో పారిశ్రామికవేత్త అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నకు బాబు సమాధానమిస్తూ... విశాఖ, తిరుపతి నగరాలతో సహా 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చంద్రబాబు వారికి వివరించారు. గుజరాత్ రాష్ట్రం మద్యాన్ని పూర్తిగా నిషేధించింది... కేరళ కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది... మరీ మీరెందుకు మద్యాన్ని నిషేధించరని చంద్రబాబును మరో పారిశ్రామికవేత్త ప్రశ్నించారు. అందుకు చంద్రబాబు మాట్లాడుతూ... మద్యాన్ని మాత్రం నిషేధించలేం కాని... నియంత్రిస్తామని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వెల్లడించారు. -
బిజినెస్ బాబూ.. 'బిజీ'నెస్
ప్రజలే దేవుళ్లు.. వాళ్లకోసమే జీవిస్తానంటూ చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఆయన తన పార్టీలో వ్యాపారవేత్తలకు అత్యంత గౌరవం ఇస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత నారాయణను ముందుగానే మంత్రిని చేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. రాజధాని నిర్ణయంలో గానీ, మరే విషయంలోనైనా ఆయనకు అగ్రపీఠం వేస్తున్నారు. ఇక బడా వ్యాపారవేత్త సుజనా చౌదరికి చంద్రబాబు ఇచ్చే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో ముఖ్యమైన నిర్ణయాలన్నింటి వెనకా ఆయన ఉంటారన్నది ఒక టాక్. పార్టీకి ఫండ్ ఇవ్వడంలో పెద్ద చెయ్యి అనిపించుకునే చౌదరి.. చంద్రబాబు నాయుడు కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయారు. ఇక కొత్త రాజధాని నగరాన్ని నిర్ణయించడానికి చంద్రబాబు తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీ నియమించగా.. అందులో ఆరుగురు వ్యాపారవేత్తలే. ఈ నిర్ణయం ఎన్ని విమర్శలకు దారితీసినా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ఛత్తీస్గఢ్ పర్యటనలో చంద్రబాబు వెంట అంతమంది వ్యాపారవేత్తలు, అధికారులు ఎందుకు ఉన్నారన్న విషయం కూడా చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు వెంట ఈ పర్యటనలో ఏకంగా 15 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారట! పోలవరం ప్రాజెక్టు విషయమై ఛత్తీస్గఢ్ లేవనెత్తిన అభ్యంతరాల గురించి చర్చించడానికి వెళ్తుంటే ఇంతమంది ఏం చేస్తారని అందరూ నోళ్లు వెళ్లబెట్టారు. సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్తే.. ఆయన వెంట మంత్రులు, కొద్ది సంఖ్యలో అధికారులు ఉంటారు గానీ ఇంతమంది వ్యాపారవేత్తలు ఏంటని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
వ్యాపారుల చూపు.. ఖమ్మం వైపు..
రాష్ట్ర విభజనతో తరలిరానున్న వ్యాపార సంస్థలు పెద్ద వ్యాపార కూడలిగా మారనున్న ఖమ్మం! జిల్లాకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా జిల్లా అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాపార, విద్య, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో మంచి పేరున్న జిల్లా కేంద్రమైన ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటివరకు విజయవాడ కేంద్రంగా జరిగిన వ్యాపారమంతా ఇక నుంచి ఖమ్మం కేంద్రంగా జరుగుతుందని.., పన్నుల మినహాయింపుతో పాటు, తెలంగాణలోని నాలుగైదు జిల్లాలకు కూడలిగా ఖమ్మం ఉండడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల చూపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాపై పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని రకాల వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడకు దీటుగా జిల్లాలో వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే కార్పోరేట్ వ్యాపార సంస్థలు రాగా, ఇప్పుడు హోల్సేల్, రిటైల్ వ్యాపారులు కూడా జిల్లాపై కన్నేశారు. దీంతో రానున్న కొద్ది కాలంలోనే విజయవాడకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత ఖమ్మం అతిపెద్ద వ్యాపార కూడలి అయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్ని రకాలుగా అనువైన ప్రదేశం... ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు విజయవాడ ఆధారంగా జరిగాయి. ముంబై, కోల్కతా, సూరత్ల్లోని వస్త్ర పరిశ్రమల కేంద్రాలతో విజయవాడ వ్యాపారులకు సంబంధాలున్నాయి. అక్కడి ఏజెన్సీలు విజయవాడలో ఉన్నాయి. ఉత్పత్తులు ముందుగా ఏజెన్సీలు, హోల్సేల్ షాపులకు వస్తాయి. అక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల హోల్సేల్, రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తారు. వీటితోపాటు అల్యూమినియం, ఇత్తడి, స్టీలు, ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆటోమొబైల్, ఇతర ఆటవస్తువులు, కుటీర, మధ్యతరగతి పరిశ్రమల విడిభాగాలు, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్), ఫ్యాన్సీ, కిరాణ, చెప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు విజయవాడ హోల్సేల్ మార్కెట్లో లభిస్తాయి. విజయవాడ వన్టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, వస్త్రలత, ఆటోనగర్, బీసెంట్రోడ్డు, నెల్లూరురోడ్డు, బందర్రోడ్డు ప్రాంతాల్లో జరిగే ఈ వ్యాపారంలో సగానికి పైగా క్రయవిక్రయాలు తెలంగాణ జిల్లాల వారే చేస్తారు. ప్రతిరోజు సుమారు రూ. 10కోట్ల మేరకు విజయవాడ నుంచి తెలంగాణ ప్రాంతాలకు వ్యాపారం జరుగుతుంది. ఇలా సీజన్, అన్సీజన్తో కలుపుకొని నెలకు సుమారు రూ. 300 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. ఇందుకోసం ఒక్క ఖమ్మం నగరానికే ప్రతిరోజు సుమారు 100 మందికి పైగా గుమస్తాలు, వ్యాపారులు ఆర్డర్లు తీసుకునేందుకు వస్తారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సంస్థలతో విజయవాడ కేంద్రంగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రంగా ఉన్నప్పుడు మామూలుగానే వ్యాపారం సాగేది. ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఇరు రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీల పన్నులు, వాహనాల టాక్స్లు వగైరా చెల్లింపులుంటాయి. -
కొత్తగా కోస్టల్ డెవలప్మెంట్ ఫోరమ్