breaking news
Burhi Gandak
-
బిహార్ వరదలకు మరో 19 మంది బలి
న్యూఢిల్లీ: బిహార్లో వరదల ప్రకోపం కొనసాగుతోంది. మరో 19 మంది చనిపోవడంతో ఈ సీజన్లో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరింది. తాజా మరణాల్లో పట్నాలో గరిష్టంగా 10 , శరణ్లో ఆరు, లఖిసరాయ్, సమస్తిపూర్, బెగుసరాయ్లో ఒక్కొక్కటి చొప్పున సంభవించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. గంగాతో పాటు ఇతర నదులు సోన్, పున్పున్, బుర్హి గండక్, గాంగ్రా,కోసి ఉప్పొంగటమే వరదలకు కారణమని భావిస్తున్నారు. 12 జిల్లాల్లోని సుమారు 41.90 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారు. 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దిఘా ఘాట్, గాంధీ ఘాట్, బక్సార్, హతిదా ఘాట్లో గంగా ఉధృతి తగ్గుముఖం పడుతున్నట్లు బిహార్ నీటి వనరుల శాఖ తెలిపింది. ఉత్తర భారత్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిశాయి. హిమాచల్ప్రదేశ్లోని ఎగువ ప్రాంతాల్లో స్వల్పంగా మంచు పడింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృత్సర్లో 32.5 డిగ్రీలు, అంబాలలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
153కు బిహార్ వరద మృతులు
న్యూఢిల్లీ: బిహార్ వరదల్లో శనివారం మరో నలుగురు మృతువాత పడడంతో మొత్తం మృతుల సంఖ్య 153కు చేరింది. భోజ్పూర్, బెగుసరాయ్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 12 పంచాయతీ ప్రాంతాలు ముంపులో చిక్కుకోవడంతో మొత్తం 12 జిల్లాల్లో 34.69 లక్షల మంది వరద బారిన పడ్డారు. గంగా, సోనే, పున్పున్, బుర్హీ గండక్, ఘాఘ్రా, కోసి, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో వరద తీవ్ర రూపం దాల్చడంతో శనివారం ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇంతవరకూ మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇక ఉత్తర్ప్రదేశ్లో పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో 987 గ్రామాల్లో 8.7 లక్షల మంది ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా ఎత్తై పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్లో మొదటి సారి మంచు కురిసింది.