breaking news
Buddha Prakash
-
ప్రారంభం కాని ‘ట్రామా’
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. 2013 డిసెంబర్ 15వ తేదీన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశ్రాజ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, వైద్య ఆరోగ్యమిషన్ డెరైక్టర్లు డాక్టర్ బుద్ధ ప్రకాశ్, జ్యోతి కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, ట్రామాకేర్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. నివేదికలు పూర్తిగా సిద్ధం చేసుకుని వెళ్ళారు. అయితే వారు సందర్శించి 6 నెలలకుపైగా గడిచినా ట్రామాకేర్ సెంటర్ ప్రారంభం విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. రూ.4 కోట్లకు పైగా నిధులతో.. రహదారులపై ప్రమాదాలకు గురయ్యేవారికి వైద్యం అందించడానికి రూ. 4 కోట్లకుపైగా నిధులతో ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికి ట్రామాకేర్ సెంటర్ భవన నిర్మాణానికి రూ. 67 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మరో రూ. కోటితో ఆధునాతన అంబులెన్స్, ఎక్స్రే యంత్రం, ఈసీజీ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు కొన్నారు. అయితే అవన్నీ ఆయా గదుల్లో తుప్పు పడుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలో ఆంబులెన్స్ ధ్వసం అయి ఉంది. ఇంకా రూ. కోటిన్నర విలువగల యంత్రాలు రావాల్సి ఉంది. అలాగే ఈ సెంటర్కు కావాల్సిన ఆర్థోపెటిక్ సర్జన్లు, మత్తు డాక్టర్లు, న్యూరాలజిస్టు, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులను నియమించాల్సి ఉంది. లక్షల రూపాయలు గుల్ల కామారెడ్డి జాతీయ రహదారితోపాటు ఆయా మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన వారు మెరుగైన వైద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ట్రామాకేర్ సెంటర్ ప్రారంభమైతే ఇక్కడే మెరుగైన వైద్యసేవలు అందేవి. సెంటర్ ప్రారంభం కాకపోవడంతో క్షతగాత్రులు ప్రైవేట్ ఆస్పత్రులు, హైదరాబాద్కు వెళ్లడంతో వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. నెల రోజుల్లోనే 11 మంది మృతి కామారెడ్డి డివిజన్ పరిధిలో కేవలం జూన్ ఒక్క నెలల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతిచెందగా 20 మందికి తీవ్ర గాయాల య్యాయి. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యు వకులే మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. వీ రిలో తలకు గాయాలై చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా కొందరు మృతిచెందా రు. వీరికి ట్రామాకేర్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందితే కొందరైన బతికుండేవా రు. మాచారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు, గాంధారి, దోమకొండ మండలాలతో పాటు డి చ్పల్లి నుంచి రామాయంపేట్ వరకు జాతీయరహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతూ చాలామంది మృత్యువాత పడుతున్నారు. -
నేడు కలెక్టర్గా రఘునందన్రావు బాధ్యతల స్వీకారం
నేడు కలెక్టర్గా రఘునందన్రావు బాధ్యతల స్వీకారం కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్లైన్ : విజయదశమి ఘడియల్లో సోమ వారం బాధ్యతలు చేపడుతున్న కొత్త కలెక్టర్ ఎం.రఘునందన్రావుకు జిల్లా లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ యంత్రాం గాన్ని ప్రజలకు అనుకూలంగా నడిపిం చాల్సిన ఆయనకు సమస్యలు సవాళ్లు విసరనున్నాయి. ఇంతకుముందు కలెక్టర్లుగా పనిచేసిన ఎంతోమంది జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటే, మరి కొంతమంది ప్రజలకు దూరంగానే మొక్కుబడిగా విధులు నిర్వర్తించారు. వారంతా పాలనాయంత్రాంగంపై పట్టు లేకపోవడం, ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టకపోవడం, కీలక అభివృద్ధి సాధించలేకపోవడం వంటి విషయాల్లో జనాదరణ పొందలేకపోయారు. ఇంకొంతమంది జిల్లాలో పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీఅయినప్పటికీ ప్రజలు వారి ని మరవలేకపోతున్నారు. కలెక్టర్గా పనిచేసిన ఎస్.ఎ.ఎం.రిజ్వీ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న బుద్ధప్రకాష్ పనితీరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు నచ్చకపోవడంతో వచ్చిన 15 నెలల్లోనే సాగనంపారు. సమస్యలు ఇవీ.. జిల్లాలో రాజకీయ, అధికార వర్గాలను శాసించే స్థాయిలో ఉన్న ఇసుక మాఫియా ఇబ్బందికరంగా మారింది. కోస్తాతీరంలోను, కొల్లేరు నడిబొడ్డున ఇబ్బడిముబ్బడిగా తవ్వుతున్న చెరువులు అధికార యంత్రాంగానికి సవాళ్లుగా మారాయి. అక్రమ చెరువుల క్రమబద్ధీకరణ కూడా అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాభివృద్ధి కోసం ఇటీవల ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు నిధులు ఇస్తాయని ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీల్లో దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన శాఖలకు పూర్తిస్థాయి బాధ్యులు లేక ఇన్చార్జులతోనే పాలన మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలో శోభిల్లుతున్న మంగినపూడి బీచ్, హంసలదీవి సాగరసంగమం, కొల్లేరుతీరం, వేదాద్రి, కూచిపూడి తదితర ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న బందరులడ్డు, రోల్డుగోల్డు పరిశ్రమ, కలంకారీ, కొండపల్లి బొమ్మలు వంటి వాటికి మరింత తోడ్పాటునందించాల్సిఉంది. గరికపాడు వద్ద స్వాగతం.. జగ్గయ్యపేట : జిల్లాకు వస్తున్న రఘునందన్రావుకు ఆదివారం జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద అధికారులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించేందుకు హైదరాబాదు నుంచి విజ యవాడ వస్తుండగా జిల్లా సరిహద్దులో ఆయన్ను అధికారులు కలిశారు. స్వాగ తం పలికినవారిలో ఎంపీడీవో జయచంద్ర, తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి, చిల్లకల్లు ఎస్.ఐ. అబ్దుల్నబీ, వీఆర్వోలు రాటకొండ శ్రీనివాసరావు, నారాయణరావు, వెంకటరత్నం తదితరులున్నారు.