breaking news
buchaiah
-
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
యాచారం మండలం కిషన్పల్లిలో పురుగులమందు తాగి బుచ్చయ్య(55) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిట్టల్లా రాలుతున్న అన్నదాతలు
రోజుకు ఒకరిద్దరి చొప్పున ఆత్మహత్య 9 రోజుల్లో 13 మంది బలవన్మరణం మృతుల్లో పత్తిరైతులే ఎక్కువ..! వర్షాభావం, అప్పులబాధలే కారణం సాక్షి, మహబూబ్నగర్: పాలమూరు రైతన్నను కరువు వెంటాడుతోంది.. అన్నం పెట్టే అన్నదాత మృత్యుఘోష వినిపిస్తోంది. కాలం కనికరించక.. అప్పులు తీర్చేమార్గం లేక ఇక చావే మార్గమని భావిస్తున్నారు. ప్రాణంగా చూసుకునే పంటచేలల్లోనే తనువుచాలిస్తున్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 13 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఎక్కువమంది పత్తిరైతులే ఉన్నారు. ఇదిలాఉండగా, మరో నలుగురు రైతులు పంటలకు నీళ్లు పారించే క్రమంలో విద్యుదాఘాతానికి బలయ్యారు. ఖరీఫ్ మొదటి నుంచి వరుణుడు దాగుడుమూతలు ఆడుతున్నాడు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది అధికవర్షాల కారణంగా మెట్టపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తిరైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాదైనా అప్పులబాధ నుంచి గ ట్టెక్కుదామని భావించిన రైతన్నకు ఈ సారీ తీవ్ర నిరాశే ఎదురైంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కజొన్న, పత్తి పంటలు చేతికిరాకుండాపోయాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువకావడంతో అప్పులు తీర్చేమార్గం లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో ఉప్పునుంతలలో భార్యాభర్తలు మృతిచెందారు. పంటకోసం తెచ్చిన అప్పులు గుదిబండలా మారడంతో కొట్టం బచ్చయ్య(48) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంత్యక్రియల అనంతరం అతని భార్య వెంకటమ్మ(38) కుప్పకూలి తనువు చాలించింది. ఈ సంఘటనలు రైతుల మనోవేదనకు అద్దంపడుతున్నాయి. చనిపోయిన రైతులు వీరే.. 21న మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన పాతింటి ఈరన్న(30)అప్పులబాధతో కుంగిపోయి ఆస్పత్రిలో చనిపోయాడు. 22న వంగూరు మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన లింగం(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 23న మల్దకల్ మండలం దాసరిపల్లిలోని బతుకన్న(32) ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అదేరోజు పాన్గల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి(30), ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వడ్డెన్న మృత్యువాతపడ్డారు. 25న అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన ఆలూరు పర్వతాలు(35)పురుగుల మందుతాగాడు. అదేరోజున పెద్దమందడి మండలం పెద్ద మునగాల్చేడ్ గ్రామానికి చెందిన చాకలి నాగేష్(35)తనువుచాలించాడు. 26న వీపనగండ్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన బడికెల కిష్టన్న (36)మరణించారు. అదేరోజు ఉప్పునుంతలకు చెందిన కొట్టం బచ్చయ్య(48)పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 27న ఉప్పునుంతలకు చెందిన కొట్టం వెంకటమ్మ, తన భర్త బచ్చయ్య మరణం తట్టుకోలేక కుప్పకూలి మరణించింది. అదేరోజు అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన కోరె బాలస్వామి(28)ఆత్మహత్య చేసుకున్నాడు. 28న భూత్పూరు మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన బక్కా జగదీష్(60)పురుగుమందుతాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. 29న ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుదాఘాతంతో.. 20న గద్వాల మండలం కొత్తపల్లికి చెందిన కుర్వరాజు(27)పొలంలో విద్యుదాఘతానికి గురై మరణించాడు. 21న వడ్డేపల్లికి చెందిన కుర్వపెద్ద గోవిందు(45)విద్యుదాఘతానికి గురైమృతిచెందాడు. 22న గట్టు మండలం మర్సన్దొడ్డి పంచాయితీ సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన నాగరాజు(23) విద్యుదాఘాతానికి గురయ్యాడు. 28న మల్దకల్కు చెందిన నర్సింహులు(27)విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరుణించని వరుణుడు వరుణుడు మొదటి నుంచీ కరుణించడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నాటికి 374.8మి.మీ వ ర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 329 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లాలోని 23 మం డలాల్లో తీవ్రవర్షభావ పరిస్థితులు నెలకొన్నా యి. దీంతో సాధారణ సాగుకంటే అతితక్కువగా పంటలు సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7,37,582 హెక్టార్లు సాగుచేయాల్సి ఉండగా, ఆశించిస్థాయిలో వానలు కురకపోవడంతో 7,09,583 హెక్టార్లు మాత్రమే సాగయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 8,700 హె క్టార్ల మేర మొక్కజొన్న పంట చేతికిరాకుండా పో యింది. ప్రస్తుత కాతదశలో ఉన్న పత్తి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. పక్షం రో జులుగా చినుకులేకపోవడంతో పత్తిచేలు ఎండిపోతున్నాయి. -
పోలీసుల అదుపులో అటవీ సిబ్బంది..
చర్ల, న్యూస్లైన్: జిల్లాలో అటవీ, పోలీస్శాఖల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 22వ తేదీన అనుమతులు లేకుండా ఉంజుపల్లి అటవీప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టారని ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పోలీస్శాఖ వారిని అడ్డుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు తమదైన శైలిలో అటవీశాఖ అధికారి, సిబ్బం దిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది సైతం పోలీసులకు ఎదురు తిరిగారు. మీడి యా వారు ఇదంతా చిత్రీకరిస్తుండడంతో అ టవీశాఖ సిబ్బంది వెనక్కు తగ్గడంతో పోలీ సులు తమ పని కానిచ్చారు. అప్పటి నుంచి ఇరు శాఖల అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం విధి నిర్వహణలో భాగంగా ఉంజుపల్లి అటవీ ప్రాంతానికి వెళ్తున్న చర్ల రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బుచ్చయ్య, నాగేశ్వరరావు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విజయరావులను సీఐ నరేందర్, ఎస్సై - 1 సంతోష్లు సిబ్బందిలో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ విష యం తెలిసి మీడియా వారు అక్కడికి వెళ్లేలోగానే వారిని హడావిడిగా పోలీస్స్టేషన్కు తీ సుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇ చ్చారు. అటవీప్రాంతంలో వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, అందుకే అదుపులోకి తీసుకున్నామని ఒకసారి, ఉంజుపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరి వాహనాలు ఆపి తనిఖీ చేయగా డ్రైవింగ్ లెసైన్స్లు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని మరోసారి బదులిచ్చారు. వాహనాలు తనిఖీ చేసినప్పుడు ఎవరినీ ఇలా స్టేషన్కు తరలించి నిర్బంధించిన దాఖలాలు లేవని, కొత్తగా ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సీఐ నరేందర్,ఎస్సై - 1 సంతోష్లను వివరణ కోరగా తాము ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, కేవలం వాహన తనిఖీల్లో భాగంగానే సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామన్నారు. గతంలో ఇటువంటి కేసులు నమోదైన దాఖలాలు ఎన్నడూ లేవని ప్రశ్నించగా ఇక నుంచి ఇలాగే కొనసాగిస్తామని బదులిచ్చారు.