breaking news
BSF helicopter
-
కారేపల్లి యువతి.. అసోంలో ...
కారేపల్లి (ఖమ్మం): కారేపల్లి యువతి.. అసోంలో మృతిచెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... కారేపల్లి అంబేడ్కర్ సెంటర్కు చెందిన బాణోతు శిరీష(22), పేరుపల్లి గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన అజ్మీర నరేష్ను ప్రేమ వివాహం చేసుకుంది. నరేష్, బీఎస్ఎఫ్ (సరిహద్దు రక్షణ దళం) కానిస్టేబుల్గా అసోం రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఇక్కడి నుంచి రైలులో అస్సాం బయల్దేరారు. మంగళవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతోంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. అలాగే అసోం వెళ్లింది. మంగళవారం రాత్రి జ్వరం (డెంగీ) మరింత తీవ్రమైంది. అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె తండ్రి జామ్లా నాయక్, టేకులపల్లి మండలంలో ఆర్ఐగా పనిచేస్తున్నారు. తల్లి జమున, గార్ల మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తమ కూతురు ఇక లేదన్న సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసోం కోల్కతాకు, అక్కడి నుంచి సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానంలో మృత దేహం చేరుకుటుందని, అక్కడి నుంచి అంబులెన్స్లో కారేపల్లికి గురువారం తెల్లవారుజామున తీసుకొస్తామని కుటుంబీకులు తెలిపారు. -
18న విశాఖ రానున్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
విశాఖ: ఈ నెల 18న కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ విశాఖపట్నం రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఆయన భేటీ కానున్నారు. రాత్రి విశాఖలోనే రాజ్నాథ్ సింగ్ బస చేయనున్నారు. మరుసటి రోజు 19న ఉదయం 10 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాఫ్టర్లో కోరాపుట్కు రాజ్నాథ్ సింగ్ వెళ్లనున్నారు.