-
అక్కను హతమార్చిన తమ్ముడు
సాక్షి, గుంటూరు: తోబుట్టువును సోదరుడే హతమార్చిన ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టాభిపురం ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి కథనం ప్రకారం మారుతీనగర్కు చెందిన కొవ్వూరి యేసు నగరంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తాడు. 30 సంవత్సరాల క్రితం తన అక్క సీతామహాలక్ష్మి కుమార్తె దానమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు పిల్లలు. అయితే రెండు నెలల క్రితం యేసు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అనంతర కాలంలో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శనివారం భార్యాభర్తలు తారాస్థాయిలో గొడవపడడంతో సీతామహాలక్ష్మి ఇరువురికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. దీంతో కోపం పెంచుకున్న యేసు తెల్లవారు జామున ముందు గదిలో నిద్రిస్తున్న అక్క సీతా మహాలక్ష్మమ్మను పలుగుతో మెడపై నొక్కి హత్యచేశాడు. అనంతరం మరోగదిలో నిద్రిస్తున్న భార్య దానమ్మను హతమార్చేందుకు యత్నించాడు. దానమ్మ పెనుగులాడడంతో అలికిడికి పెద్ద కుమారుడు ఆదిసురేష్ నిద్రలేచి తండ్రిని అడ్డుకున్నాడు. తల్లీ, కుమారుడు ఇరువురు మరోగదిలోకి వెళ్లి తలుపులు వేసుకోని కేకలు వేయడంతో యేసు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
అక్కను కడతేర్చిన తమ్ముడు
కేకే.నగర్: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఇంటిలోకి అనుమతించిన అక్కపై ఆగ్రహంతో ఆమెను హత్య చేసి పారిపోయిన తమ్ముడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రామనాథపురం జిల్లా సాయల్కుడి సమీపంలో నోమ్ బహుళం గ్రామానికి చెందిన ముత్తు రామలింగం రైతు. ఇతని భార్య పూంగొడి (45). ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రెండో కుమార్తె నాగవళ్లి (24). సాయల్కుడి సమీపంలో కడుగు సంత సత్రం ప్రాంతంలో వేరే కులానికి చెందిన కన్నన్ (29)ను ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకుంది. ఈ వివాహానికి నాగవల్లి తల్లిదండ్రులు వ్యతిరేకత తెలిపారు. కన్నన్ ఇంటిలో వీళ్ల ప్రేమను ఒప్పుకున్నారు. పెళ్లి తరువాత కన్నన్ నాగవల్లి కడుగు సత్రంలో నివసించేవారు. నాగవల్లికి కొంత కాలం కిందట ఆడపిల్ల పుట్టింది. మనువరాలు పుట్టిన సంగతి తెలిసి పూంగొడి ఆనందపడింది. కూతురిపైన కోపం మరచిపోయి నాగవళ్లిని, బిడ్డను ఇంటికి పిలుచుకుని వచ్చింది. భార్య, బిడ్డను చూడడానికి కన్నన్ తరచూ అత్తగారింటికి వచ్చి వెళ్లేవాడు. ఇదిలా ఉండగా నాగవల్లిని చూడడానికి మదురైలో నివసిస్తున్న పూంగొడి తమ్ముడు మణి శుక్రవారం అక్క ఇంటికి వచ్చాడు. లేచిపోయిన కూతురిని మళ్లీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావ్ అంటూ అక్క పూంగొడితో ఘర్షణకు దిగాడు. చుట్టు పక్కల వారు అతడిని సమాధానపరచి పంపారు. ఈ సంఘటన వలన ఆగ్రహం చెందిన మణి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఇంటిలో నిద్రిస్తున్న పూంగొడిని కత్తితో పొడిచి చంపాడు. కేకలు విని అడ్డుకున్న నాగవళ్లిని కత్తితో పొడిచాడు. రక్తం మడుగులో పడి గిలగిల లాడుతూ పూంగొడి మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన నాగవళ్లిని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. సాయలేకుడి పోలీసులు పూంగొడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రామనాథపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీ ఉన్న మణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement