breaking news
British divers
-
నోరు జారాడు.. అనుభవిస్తున్నాడు
థాయ్ కేవ్ ఆపరేషన్లో పాల్గొన్న ఓ బ్రిటీష్ డైవర్పై.. టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సదరు డైవర్ అసలు సహాయక చర్యల్లో పాల్గొనలేదని.. పైగా అతను చిన్నారులను లైంగికంగా వేధించే వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. థాయ్ కేవ్ ఆపరేషన్లో భాగంగా వైల్డ్ బోర్ అనే డైవర్స్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ బృందంలో బ్రిటీష్ డైవర్ వెర్నోన్ అన్స్వోర్త్ కూడా ఉన్నారు(మ్యాపింగ్ రూట్ సమాచారం అందించటం...). టెస్లా తరపున సహాయక చర్యల కోసం మస్క్.. జలంతర్గాములను పంపించాడు. అయితే అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, ఆపరేషన్కి పనికి రాలేదని, ఆ విషయం తెలిసికూడా టెస్లా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే వాటిని పంపిందని వెర్నోన్ పేర్కొన్నారు. దీంతో మండిపోయిన మస్క్.. వెర్నోన్ను విమర్శిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. ‘మా సబ్మెరెన్లు పనికి రావని ఆ పెద్ద మనిషి అన్నారు. కానీ, ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం ప్రచారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం కూడా నాకు ఈ మధ్యే తెలిసింది. ఆయనొక పెడో. (పెడో.. పైడోఫిలేకి సంక్షిప్త రూపం.. పిల్లల్ని ప్రలోభ పెట్టి లైంగికంగా వాడుకోవటం). అలాంటి వ్యక్తి చేసే పనికిమాలిన కామెంట్లను పట్టించుకోవటం.. మాకు అవమానం’ అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. అయితే ఈ విషయంలో వెర్నోన్కే మద్ధతుగా చాలా మంది నిలిచారు. మస్క్ను విమర్శిస్తూ పెద్ద ఎత్తున్న పోస్టులు వెల్లువెత్తటంతో చివరకు మస్క్ ఆయా ట్వీట్లను డిలేట్ చేశారు. ఇక ఈ విషయంపై అన్స్వోర్త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా కథనాల ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మస్క్పై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా’ అని వెల్లడించారు. భారీ నష్టాలు.. ఇదిలా ఉంటే మస్క్ చేసిన ట్వీట్లు టెస్లా మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం దాదాపు 4 శాతానికిపైగా షేర్లు పడిపోవటంతో 295 మిలియన్ డాలర్ల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆటోమేకర్ రంగంలో దిగ్గజం అయిన టెస్లా.. ఎలోన్ మస్క్ నిర్ణయాలు, ప్రవర్తన మూలంగా ఏడాది కాలంలో 2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఎలోన్.. టెస్లా కొంప ముంచుతున్నాడంటూ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బ్రిటన్ డైవర్స్ సంచలనం
డైవింగ్లో తొలిసారి స్వర్ణం ప్రపంచ చాంపియన్స్పై లాఫర్-మియర్స్ జోడీ గెలుపు రియో డి జనీరో: డైవింగ్ ఈవెంట్లో మూడు స్వర్ణాలు నెగ్గి జోరుమీదున్న చైనాకు బ్రిటన్ డైవర్లు షాక్ ఇచ్చారు. పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్బోర్డు ఫైనల్లో జాక్ లాఫర్-క్రిస్ మియర్స్ (బ్రిటన్) ద్వయం 454.32 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ డైవింగ్ చరిత్రలో బ్రిటన్కు లభించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. లాఫర్-మియర్స్ విన్యాసాల ధాటికి ప్రపంచ చాంపియన్స్ జోడీ కావో యువాన్-కిన్ కాయ్ (చైనా-443.70 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సామ్ డోర్మాన్-మైక్ హిక్సాన్ (అమెరికా-450.21 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని దక్కించుకుంది. మృత్యువు అంచుల నుంచి... ఏడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన పోటీల సందర్భంగా 23 ఏళ్ల క్రిస్ మియర్స్కు పొత్తి కడుపులో తీవ్ర గాయమైంది. అత్యవసర శస్త్రచికిత్స చేసినా అతను కోలుకోవడం కష్టమేనని వైద్యులు తేల్చారు. మూడు రోజులు కోమాలో ఉన్నాక మియర్స్ స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి నమ్మశక్యంకాని రీతిలో రియోలో స్వర్ణం సాధించి ఔరా అనిపించాడు. 108 ఏళ్ల తర్వాత... పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్రౌండ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కొహి ఉచిమురా మళ్లీ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫ్లోర్ ఎక్సర్సైజ్, పామెల్ హార్స్, రింగ్స్, వాల్ట్, పారలల్ బార్స్, హరిజాంటల్ బార్ ఈవెంట్స్లో నిలకడగా రాణించిన ఉచిమురా ఓవరాల్గా 92.365 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఒలెగ్ వెర్నియెవ్ (ఉక్రెయిన్-92.266 పాయింట్లు) రజతం, మాక్స్ విట్లాక్ (బ్రిటన్-90.461 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఆల్రౌండ్ విభాగంలో 108 ఏళ్ల తర్వాత బ్రిటన్కు పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. రోయింగ్లో జర్మనీ జోరు... గురువారం రోయింగ్లో ఆరు స్వర్ణాల కోసం పోటీలు జరిగాయి. ఇందులో పురుషుల, మహిళల క్వాడ్రాపుల్ స్కల్స్ విభాగంలో జర్మనీ జట్టు స్వర్ణాలు సొంతం చేసుకుంది. రెండు కిలోమీటర్ల దూరాన్ని జర్మనీ పురుషుల జట్టు 6 నిమిషాల 06.81 సెకన్లలో... జర్మనీ మహిళల జట్టు 6 నిమిషాల 49.39 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాయి. పురుషుల పెయిర్స్ విభాగంలో న్యూజిలాండ్కు... డబుల్ స్కల్స్ విభాగంలో క్రొయేషియాకు... మహిళల డబుల్ స్కల్స్ విభాగంలో పోలాండ్కు... లైట్వెయిట్ పురుషుల ఫోర్స్ విభాగంలో స్విట్జర్లాండ్కు స్వర్ణాలు లభించాయి. క్వార్టర్స్లో నాదల్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), డెల్ పొట్రో (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో నాదల్ 7-6 (7/5), 6-3తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, డెల్ పొట్రో 6-7 (4/7), 6-1, 6-2తో తారో డానియల్ (జపాన్)పై గెలిచారు. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో డింగ్ నింగ్ (చైనా) స్వర్ణం సాధించింది. ఫైనల్లో డింగ్ నింగ్ 4-3తో లి జియాజియా (చైనా)పై గెలిచింది. కాంస్య పతక పోరులో కిమ్ సాంగ్ (ఉత్తర కొరియా) 4-1తో ఫకుహరా (జపాన్)ను ఓడించింది.