ఈనెల 10 నుంచి బ్రిలియంట్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ ఈనెల 10 నుంచి దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో ఓపెన్ ఈవెంట్తో పాటు అండర్-6 నుంచి అండర్-14 బాలబాలికల విభాగాల్లో జరిగే పోటీల్లో విజేతలకు ప్రత్యేక బహుమతులను ఇవ్వనున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే వారు ఇతర వివరాలకు టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి జె.సుబ్రహణ్యంను 9247399717 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.