breaking news
brexit voting
-
బ్రెగ్జిట్ ఆలస్యానికే ఓటు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం జాప్యం కానుంది. ఈ మేరకు శనివారం జరిగిన చారిత్రక సమావేశం నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్ కోసం ఈయూతో కుదుర్చుకున్న గొప్ప ఒప్పందానికి మద్దతు తెలపాలంటూ ఈ అంశంపై ప్రధాని జాన్సన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రెగ్జిట్ తర్వాత అవసరమయ్యే చట్టాలు రూపొందనందున ఈ గడువును 31వ తేదీ నుంచి పొడిగించాలని శనివారం అర్థరాత్రిలోగా ఈయూను కోరాలంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆలివర్ లెట్విన్ సవరణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానానికి అనుకూలంగా 322 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 306 ఎంపీలు ఓట్లేశారు. ప్రధాని కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందానికి ఎంపీల మద్దతు లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని లేబర్ పార్టీ నేత కార్బైన్ వ్యాఖ్యానించారు. ప్రధాని జాన్సన్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటింగ్ అర్థరహితం. అక్టోబర్ ఆఖరు కల్లా బ్రెగ్జిట్ అమలు చేయాలన్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, తాజా ఓటింగ్ మేరకు ఈయూను గడువు పొడిగించాలని కోరబోను’అని స్పష్టం చేయడం గమనార్హం. బ్రెగ్జిట్తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వచ్చే సోమవారం సభలో ప్రవేశపెట్టి, మంగళవారం ఓటింగ్కు కోరతామన్నారు. కాగా, పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రధాని జాన్సన్ ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం జరిగిన ‘ప్రతినిధుల సభ’ సమావేశాన్ని విశ్లేషకులు ‘సూపర్ సాటర్డే సెషన్’అని అంటున్నారు. ఇలాంటి అసాధారణ సమావేశం 1982లో మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉండగా ఫాక్ల్యాండ్ యుద్ధంపై ఓటింగ్ కోసం ఏర్పాటైంది. -
బ్రెగ్జిట్ ఓటింగ్ వాయిదా
లండన్: బ్రెగ్జిట్పై పార్లమెంట్లో మంగళవా రం చేపట్టే ఓటింగ్ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెలిపారు. బ్రెగ్జిట్పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశా లపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పార్లమెం ట్లో ప్రకటించారు. బ్రెగ్జిట్ తర్వాత కూడా ఈయూ కస్టమ్స్ యూనియన్లోనే బ్రిటన్ కొనసాగనుండడంపై ఎంపీల్లో ఆందోళన వ్యక్త మవుతోందని ఆమె తెలిపారు. ఈ పరిస్థి తుల్లో ఒప్పందంపై ఓటింగ్ పెడితే భారీ తేడాతో ఓడిపోయే ప్రమాదముందని మే అంగీకరిం చారు. సభ్యుల అభ్యంతరాలపై వచ్చే వారం జరగనున్న ఈయూ నేతల భేటీలో చర్చించి, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా హామీ పొందేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
అతి పురాతనం ఐరోపా ఐక్యతా ప్రస్థానం
అవలోకనం షార్లమేన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఐక్య యూరప్ అనే ఈ బృహత్ పథకం, నిరంతరం రూపొందుతూ, తిరిగి మళ్లీ రూపొందుతూ వచ్చింది. అందుకు కారణాలు రకరకాలు... సైనిక విస్తరణ, మతం, వ్యాపారం. జాతీయ సరిహద్దులు చాలా చాలా సార్లే మారాయి, అలాగే భాషలు కూడా. ఈ సుదీర్ఘ చారిత్రక క్రమంలోని తాజా ఘట్టమే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ. ఒక విధంగా చెప్పాలంటే జర్మన్ తెగలు తమ జీన్లతో యూరప్ను శాశ్వతంగానే ఐక్యం చేసేసాయి. యూరోపియన్ యూనియన్ను ఏర్పాటు చేయడమనే పథకం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఎన్నడో పురాతన చారిత్రక కాలం నుంచీ సాగుతున్న ఈ బృహత్ పథకంలోని తాజా ఘట్టం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమించడం. గ్రీకులు తమకు ఉత్తర పొరుగున ఉన్న యూరోపియన్ల గురించి ఏమంత ఘనంగా ఆలోచించలేదు. వారి భాషలు ‘బార్-బార్’మని ధ్వనించేవిగా ఉంటా యని వారిని బర్బరులు అని పిలిచేవారు. మాసిడోనియాకు చెందిన జగజ్జేత అలెగ్జాండర్కు సైతం యూరప్ పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందుకే అతడు గ్రీసును జయించడం కోసం దక్షిణానికి మర లి, అటునుంచి ఆసియాకు వచ్చాడు. కొద్దికాలంపాటూ ఈజిప్ట్కు దారిమళ్లిన తదుపరి పర్షియా (ఇరాన్)ను, మధ్య ఆసియాలో చాలా భాగాన్ని, అఫ్ఘానిస్థాన్ను జయించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ తను చేసిన అన్ని యుద్ధాలలోకీ అతి క్లిష్టమైన పంజాబ్ యుద్ధం తదుపరి ... వెనక్కు మళ్లక గత్యంతరం లేని స్థితిలో తిరుగు ప్రయాణంలో 33 ఏళ్ల వయస్సులో ఇరాన్లో మరణించాడు. మూడు శతాబ్దాల తర్వాత యూరప్ను ఒకే అధికార ఛత్రం కిందకు తేవడానికి గణనీయమైన కృషి చేసిన ఏకైక వ్యక్తి జూలియస్ సీజర్. క్రీస్తు జననానికి ముందు సీజర్ ఇటాలియన్ సేనలను ఫ్రాన్స్, జర్మనీలపైకి నడిపాడు, అక్కడి అనాగరిక తెగలను దారికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇటాలియన్లను సీజర్ ఇంగ్లండుకు కూడా పట్టుకొచ్చాడు. నేడు బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా ఓటు చేసిన అంతర్జాతీయ నగరం లండన్కు సైతం వారిని ఆనాడే తీసుకొచ్చాడు. ఆ కాలంలో యూరప్ను రోమ్ నుంచి పాలించేవారు. సీజర్ వారసుడు అగస్తస్ క్రీస్తు శకం 9లో జర్మనీలోని ట్యుటొబెర్గ్ అటవీ ప్రాంతంలో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఉత్తర దిశగా రోమన్ విస్తరణను నిలిపివేశాడు. యూరప్లోని పట్టణ, నాగరిక జనాభా అంతా ఆ కాలంలో ఆ ఖండపు దక్షిణ భాగంలోనే ఉండేది. నేడు ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఉత్తర భాగంగా ఉన్న ప్రాంతం కోసం అప్పట్లో యుద్ధం చేయడం వ్యర్థమైన అటవీ ప్రాంతంగా ఉండేది. రోమన్ సేనలు ఇక అప్పటి నుంచి తూర్పు దిశకు కదంతొక్కి జెరూసలెం, సిరియాల దిశగా సాగాయి. రోమన్లు తమ సామ్రాజ్యానికి కాన్స్టాంటినోపుల్ను (టర్కీలోని నేటి ఇస్తాంబుల్) కొత్త రాజధానిగా చేసు కున్నారు. లిపిలేని, ప్రధానంగా నిరక్షరాస్యులైన జర్మన్ తెగలవారు 5వ శతాబ్దినాటికి రోమ్ను చాలా వరకు దెబ్బతీశారు. దీంతో చీకటి యుగాలుగా పిలిచే కాలం వచ్చింది. యూరప్లో రాయడం, చదవడం క్షీణించిపోయాయి. ఈజిప్ట్ను ముస్లింలు జయించడం కూడా అందుకు కొంతవరకు కారణం. ఈజిప్ట్ను కోల్పోవ డంతో ఆనాడు అందుబాటులో ఉన్న ఏకైక కాగితం పాపిరస్ ఎగుమతులు నిలిచి పోయాయి, పుస్తకాలు రాయడానికి, సులువుగా ప్రతులను తయారుచేయడానికి అడ్డుకట్ట పడింది. క్రైస్తవం రూపంలో యూరప్ను ఐక్యం చేయాల్సిన నూతన అవసరం ఏర్పడింది. అదే సమయంలో అరబ్బులు స్పెయిన్ను ఆక్రమించారు. అది నేటి సిరియా శరణార్థుల భయ వ్యాధిలాగా అరబ్బుల భయాన్ని రేకెత్తించి ఆ పరి ణామాన్ని త్వరితం చేసింది. రోమ్లోని పోప్ జర్మన్ ఆదివాసి తెగ నాయకుడైన చార్లెస్కు మొట్టమొదటి పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి కిరీటాన్ని తొడిగాడు. షార్లమేన్అనే ఆయన చారిత్రక నామధే యానికి అర్థం అతి గొప్పవాడైన చార్లెస్ (చార్లెస్ ద గ్రేట్) అని. ఆ తదుపరి శతాబ్దాలలో యూరప్లో ఫ్యూడలిజం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత పెద్ద రాచరిక రాజ్యాలు అవతరించాయి. శక్తిమంతులైన రాజులు, ప్రత్యేకించి ఫ్రాన్స్, ఇంగ్లండ్ రాజులు యూరప్ను విభజించి, పాలించారు. ఈ కాలంలోని ఐక్య యూరప్ను పరిపాలించిన చిట్టచివరి వ్యక్తి షార్లమేన్ ముని మనవడు చార్లెస్ ద ఫ్యాట్. ఈ కాలం గడచినాక రోమ్లోని చర్చి సైనిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. జెరూసలెంను తిరిగి జయించడం కోసం సాగించిన క్రూసేడ్లనే విఫల యుద్ధాలకు యూరప్లోని రాజులు తమ రాజ్యాలను విడిచిపోయేలా చేయగలిగింది. మొదట జర్మనీలో, ఆ తదుపరి ఇంగ్లండ్లో తలెత్తిన ప్రొటెస్టేంటిజం యూరప్లోని బలహీనమైన మత బంధాలను చీలికలకు గురిచేసింది. తూర్పున ముస్లింల అధికారం పెంపొందుతుండటంతో చర్చి ప్రాబల్యం క్షీణించింది. యూరప్లో వచ్చిన విజ్ఞానశాస్త్ర విప్లవం ఆ ఖండానికి రోమ్ కాలం నాటి అధిపత్యాన్ని తిరిగి కట్టబెట్టింది. నెపోలియన్, వెయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా యూరప్ను మళ్లీ కొద్ది కాలంపాటూ ఐక్యం చేయడానికి సైనిక సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడింది. 1940ల మొదట్లో హిట్లర్ తిరిగి యూరప్ను సైనికంగా ఐక్యం చేశాడు. అతడు అక్రమించని ప్రాంతాలు (ఇటలీ వంటివి) ఆ తర్వాత ఆక్రమణకు గురి కావడమో లేదా అతనితో చేయికలపడమో చేశాయి. బ్రిటిష్ ద్వీపాలు మాత్రమే హిట్లర్ ఆధిపత్యానికి బయట ఉండేవి. రెండవ ప్రవంచ యుద్ధం ముగిసిపోవడం, రష్యా ప్రబల శక్తిగా పెంపొం దడం కూడా యూరప్ను సైనికంగా ఐక్యం చేశాయి. బ్రసెల్స్ కేంద్రంగా నాటో ఏర్పడినా దాని నిజమైన అధికారం అమెరికా చేతుల్లో ఉంటుంది. ఈ సహకారం యూరోపియన్ యూనియన్కు విస్తరించింది. దానికి కూడా బ్రసెల్స్ కేంద్రం (షార్లమేన్ పేరుపెట్టిన భవనంలో ఉంది). 25 ఏళ్ల క్రితం జరిగిన జర్మనీ ఏకీకరణ తర్వాత ఈయూ నిజ అధికార కేంద్రం బెర్లిన్కు మారింది. షార్లమేన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఐక్య యూరప్ అనే ఈ బృహత్ పథకం, నిరంతరం రూపొందుతూ, తిరిగి మళ్లీ రూపొందుతూ వచ్చింది. అందుకు కారణాలు రకరకాలు... సైనిక విస్తరణ, మతం, వ్యాపారం, జాతీయ సరిహద్దులు చాలా చాలా సార్లే మారాయి, అలాగే భాషలు కూడా. ఈ సుదీర్ఘ చారిత్రక క్రమంలోని తాజా ఘట్టమే బ్రిటన్ నిష్ర్కమణ. ఒక ఆసక్తికర అంశంతో దీన్ని ముగిద్దాం. ఫ్రాన్స్ అనే పదానికి మూలం ఫ్రాంక్లు అనే ఒక జర్మన్ తెగ. ఫ్రాంక్లు ఆ ప్రాంతాన్ని జయించి, అక్కడ తమ జనాభాను విస్తరింపజేశారు, నేటి ‘ఫ్రెంచివారి’లో కలగలిసిపోయారు. అదే తెగ జర్మన్ నగరం ఫ్రాంక్ఫర్ట్ పేరుగానూ మారింది. ఇంగ్లండ్ అనే పదానికి అర్థం ల్యాండ్ ఆఫ్ ఏంజెల్స్ (దేవ తల గడ్డ). అది ఒక ఉత్తర జర్మన్ తెగ. ఉత్తర ఇటలీని లొంబర్డీగా పిలుస్తారు. అది మరో జర్మన్ తెగ. ఈ అర్థంలో చూస్తే జర్మన్లు తమ జీన్లతో యూరప్ను శాశ్వతంగానే ఐక్యం చేసేశారు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com