-
అప్స్టాక్స్ బ్రేక్–ఈవెన్ ..
ముంబై: డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ అప్స్టాక్స్ గత ఆర్థిక సంవత్సరంలో బ్రేక్–ఈవెన్ (లాభ నష్ట రహిత స్థితి) సాధించింది. 2022–23లో మొత్తం ఆదాయం 40 శాతం ఎగిసి రూ. 1,000 కోట్లు దాటినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం రూ. 1,000 కోట్ల పైచిలుకు నగదు నిల్వలు ఉన్నాయని చెప్పారు. సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం, ఇతర వ్యాపారాలను కొనుగోలు చేయడం తదితర మార్గాల్లో వృద్ధి సాధనపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అయిదారేళ్లలో తమ కస్టమర్ల సంఖ్యను పది రెట్లు పెంచుకుని 10 కోట్లకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. 2009లో ప్రారంభమైన అప్స్టాక్స్కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో పాటు టైగర్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. -
గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భిన్న రంగాల్లో ఉన్న గోద్రెజ్ గ్రూప్ కంపెనీ గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ ఔట్లెట్లను విస్తరిస్తోంది. హైదరాబాద్లోతోసహా ఏడు ప్రధాన నగరాల్లో సంస్థ 33 స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో స్టోర్కు రూ.1.5 కోట్ల దాకా వ్యయం చేస్తోంది. విదేశాల్లో లభించే అరుదైన, ఖరీదైన పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, మాంసం, వైన్, కోల్డ్ కట్స్, పాస్తా, చీజ్, బెవరేజెస్ నేచర్స్ బాస్కెట్లో లభిస్తాయి. మార్చికల్లా కొత్తగా 3 ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు గోద్రెజ్ గ్రూప్ ఈడీ, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు. మరో 6-7 స్టోర్లకై ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాదే బ్రేక్ ఈవెన్.. నేచర్స్ బాస్కెట్ ఈ ఏడాదే బ్రేక్ ఈవెన్కు చేరుకుంటుందని తాన్యా దుబాష్ వెల్లడించారు. ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ పోర్టల్స్ అయిన అమెజాన్, స్నాప్డీల్తో చేతులు కలుపుతామని చెప్పారు. ప్రథమస్థాయి నగరాల్లో అరుదైన, ఖరీదైన ఆహోరోత్పత్తులకు విపరీత డిమాండ్ ఉందని తెలిపారు. దీపావళికి గోద్రెజ్ గ్రూప్ నుంచి నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో నేచర్స్ బాస్కెట్ స్టోర్లున్నాయి. కాగా, గోద్రెజ్ గ్రూప్ వచ్చే 10 ఏళ్లకుగాను ఏటా 26 శాతం వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement