-
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్ఫ్లెక్స్లో చూడొచ్చు. స్కంద- హాట్స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
క్లైమాక్స్ కాదు.. క్లై‘మ్యాక్స్’
భారీ యాక్షన్ సీక్వెన్స్ను హీరో రామ్ కంప్లీట్ చేశారు. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్. ఇటీవల మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘24 రోజుల చిత్రీకరణతో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయింది. ఇది క్లైమాక్స్ కాదు.. క్లైమ్యాక్స్’’ అని ట్వీట్ చేశారు రామ్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే. -
మళ్లీ ప్రారంభంకానున్న అఖండ జాతర..
నందమూరి నటసింహం బాలకృష్ణ మాసీవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రం 'అఖండ'. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది విడుదలై అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఒకరకంగా చెప్పాలంటే థియేటర్లలో అఖండ జాతర జరిగింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో రిలీజై అక్కడ కూడా 'బోత్ ఆర్ సేమ్' అన్న రేంజ్లో వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ జోరును కోలీవుడ్లో చూపెట్టనుంది అఖండ. ఈ యాక్షన్ డ్రామా చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. జనవరి 28న ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం కోలీవుడ్లో పెద్దగా ఏ సినిమా రిలీజ్లు లేకపోవడంతో ఈ సూపర్ హిట్ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనుందని టాక్. -
‘చిట్టిబాబు’ ఎక్కడున్నాడు?
చిట్టిబాబు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత త్వరగా ఆ పాత్రను మరిచిపోలేము. ఆ పాత్రకు ప్రాణం పోసిన రామ్చరణ్ను మరిచిపోలేము. చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విదేశాల్లో, హైదరాబాద్లో రెండు షెడ్యుల్స్ కంప్లీట్ చేసిన చెర్రీ.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. రామ్చరణ్కు సంబంధించిన విషయాలను ఆయన సతీమణి ఉపాసన అప్డేట్స్ ఇస్తుంటారు. ఎయిర్పోర్ట్లో ఉన్న చెర్రీ ఫోటోను షేర్ చేశారు ఉపాసన. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో మాత్రం చెప్పలేదు. -
క్లా..క్లా.. క్లాస్ మ..మ..మాస్
మాస్ ప్రేక్షకులను ఎలా అలరించాలో.. క్లాస్ హీరోలను మాస్కు ఏ విధంగా దగ్గర చేయాలో తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ‘భద్ర‘ నుంచి ‘సరైనోడు‘ వరకూ హీరోలతో పాటు వాళ్ల పాత్రలను బోయపాటి చూపించిన విధానమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకూ చేసిన రెండు చిత్రాల్లో దాదాపు క్లాస్గానే కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ను తాజా చిత్రంలో అందుకు భిన్నంగా చూపించనున్నారు బోయపాటి. ద్వారకా క్రియేషన్స్పై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా లుక్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హీరో పాత్ర క్లాస్ ఆడియన్స్కి, మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఇది ఫీల్ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. హైదరాబాద్, వైజాగ్లలో జరిపిన షెడ్యూల్తో 20 శాతం పూర్తయింది. ఈ షెడ్యూల్లో శ్రీనివాస్, రకుల్ ప్రీత్సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, ధన్యా బాలకృష్ణ పాల్గొన్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత మేం నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement