Bharti Cements
-
‘ఖేలో ఇండియా జీతో ఇండియా’ గీతం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ నిర్మాణంలో ప్రముఖ ఆల్బమ్ తయారీ సంస్థ సెవెన్ నోట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఖేలో ఇండియా జీతో ఇండియా’అనే గీతాన్ని ఆదివారం రెడ్ ఎఫ్ఎం వేదికగా ఆవిష్కరించారు. టీ 20 వరల్డ్కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పాటను రూపొందించామని భారతి సిమెంట్స్ యాడ్స్ మేనేజర్ విజయ్ తెలిపారు. రచయిత సిరాశ్రీ రాసిన పాటకు తాళ్లూరి నాగరాజు సంగీతాన్ని సమకూర్చారు. ప్రముఖ గాయకుడు కార్తిక్ గాత్రం అందింగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టీ 20 వరల్డ్కప్ సాధించడానికి టీమిండియాకు అన్ని అర్హతలున్నాయని, ఈసారి కప్తో వస్తారని సెవెన్ నోట్స్ క్యూరేటర్ మణి ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ పాటతో టీమిండియాకు అభినందనలు తెలుపుదామని పిలుపునిచ్చారు. -
ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ
భారతి సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి కడప: భారతి సిమెంట్స్ నాణ్యత విషయంలో అగ్రగామిగా నిలిచిందని కంపెనీ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం కడపలోని మానస హోటల్లో నిర్వహించిన సబ్ డీలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతి సిమెంట్స్ ఉన్నత స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తోందని, సరైన సర్వీసులు అందిస్తోందని అందుకే నమ్మకమైన సిమెంటుగా తక్కువ కాలంలోనే వినియోగదారుల నమ్మకాన్ని సాధించిందని చెప్పారాయన. కార్యక్రమంలో కంపెనీ సీనియర్ టెక్నికల్ మేనేజర్ సి.ఓబుల్రెడ్డి, కడప జిల్లాకు చెందిన పలువురు సబ్ డీలర్లు, కంపెనీ మార్కెటింగ్ ఏజీఎం ఎం.నరసింహారెడ్డి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ఎ.ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.