breaking news
Bhagavad-gita
-
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
భగవద్గీత సాక్షిగా ఆస్ట్రేలియా ఎంపీ ప్రమాణం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఎంపీ డానియల్ మూకీ (32) హిందూ మత పవిత్ర గ్రంధం భగవద్గీత సాక్షిగా మంగళవారం ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఆయనే. డానియల్ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. డానియల్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు తానేనని, దీన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని డానియల్ చెప్పారు.