breaking news
Bets
-
ఏటా శీతాకాలంలో కపోతాల రేసింగ్స్
♦ ఒకప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లిన సైనికులు సందేశాలను బేస్ క్యాంప్లకు పంపడానికి పావురాలను వినియోగించే వాళ్లు. ప్రస్తుతం పీజియన్ క్లబ్బుల సభ్యులు ఎలాంటి బహుమతులు, నగదు లావాదేవీల వంటివి లేకుండా కేవలం సరదా, పేరు కోసం వీటితో పందేలు నిర్వహిస్తున్నారు. ♦ క్లబ్బులు కనిష్టంగా 50 కి.మీ. (వాయుమార్గం) దూరంతో పోటీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోని క్లబ్బులు గరిష్టంగా 1,000 కి.మీ, చెన్నై కేంద్రంగా పని చేసేవి 1,700 కి.మీ వరకు దూరంతో పందాలు నిర్వహిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కోడి, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కార్ రేసింగ్, బైక్ రేసింగ్లూ అందరికీ తెలిసినవే. కానీ పావురాలతో కూడా పెద్దయెత్తున దేశ, విదేశాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రంగా ఏర్పడిన అనేక క్లబ్బులు, సొసైటీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్తో పాటు చెన్నై, కర్నూలు, దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా పీజియన్ క్లబ్బులు ఉన్నాయి. యంగర్స్, ఓపెన్, డర్బీ కేటగిరీల్లో పోటీలు జరుగుతుండటం గమనార్హం. ఎక్కడో వెయ్యి, అంతకు మించిన దూరంలో వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఎంత సమయంలో అవి వాటి యజమానుల ఇళ్లకు చేరుకున్నాయన్నది నిర్దిష్ట పద్దతిలో లెక్కించి నిర్వాహకులు విజేతను ప్రకటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 250 క్లబ్బులు కోడి పందాలు, ఇతర పోటీల స్థాయిలో ప్రాచుర్యం లేకపోయినా పావురాల పందాలు ఏటా జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా పోటీలు జరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో చైనా భాషతో కూడిన స్క్రాచ్ కార్డ్స్తో దొరికినవి ఇలాంటి పోటీల్లో పాల్గొన్న పావురాలే. ఇలాంటి పందాలు నిర్వహించడానికి దేశ వ్యాప్తంగా 250 వరకు గుర్తింపు పొందిన క్లబ్బులు ఉండటం గమనార్హం. ఒక్క చెన్నైలోనే 60 నుంచి 70 రిజిస్టర్డ్ సొసైటీలు ఉన్నాయి. హైదరాబాద్లో హైదరాబాద్ హోమర్ పీజియన్స్ క్లబ్ (హెచ్ఎస్పీసీ), డెక్కన్ పీజియన్స్ స్పోర్ట్స్ క్లబ్ (డీపీఎస్సీ), హైదరాబాద్ హోమ్ పీజియన్ క్లబ్ (హెచ్హెచ్పీసీ) కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అధికారికంగా రిజిస్టర్ చేసుకుని.. పోలీస్, అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే పోటీలు నిర్వహిస్తారు. వీటి నిర్వాహకులను పలకరిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ బ్రిటిష్ బ్లడ్లైనే.. మనుషుల్లో మాదిరిగానే కపోతాల్లో బ్లడ్ లైన్ (వంశం) ఉంటుంది. దశాబ్దాల క్రితం బ్రిటిషు వాళ్లు తీసుకువచ్చిన నెదర్లాండ్స్, బెల్జియం, యూరప్లకు చెందిన పావురాల బ్లడ్ లైనే (ఉమర్స్) ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోని చాలా క్లబ్బులు ఉమర్స్ జాతికి చెందిన పావురాలనే ఎక్కువగా పందాల కోసం వాడుతున్నాయి. ప్రత్యేకంగా వెబ్సైట్స్, సహకరించే యాప్స్తో పాటు వాట్సాప్ గ్రూపుల సాయంతో పక్కా మాన్యువల్స్తో పని చేస్తుంటాయి. పందెం నిర్వహించే ఏడాది పుట్టిన వాటికి యంగర్స్ శ్రేణిలో, మిగిలిన వాటిని ఓపెన్ శ్రేణిలో రేసులు జరుగుతాయి. గతంలో జరిగిన పందాల్లో గెలిచిన వాటికి ప్రత్యేకంగా డర్బీ కేటగిరీ ఉంటుంది. ప్రత్యేక శిక్షణతో శీతాకాలంలోనే పందాలు వాతావరణ అనుకూలత దృష్ట్యా ప్రతి ఏడాదీ శీతాకాలంలో మాత్రమే ఈ పందాలు జరుగుతాయి. ఈ క్లబ్లలో సభ్యులుగా> ఉన్న వాళ్లు పదులు, వందల సంఖ్యలో పావురాలను పెంచుకుంటున్నారు. వీటికి ప్రతి రోజూ అరగంట, పందాల సీజన్లో దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా తాగునీరు, ఆహారం అందజేస్తారు. వీటికి తమను పెంచే యజమాని ఇల్లు బాగా గుర్తుండిపోతుంది. ఒక్కో యజమాని గరిష్టంగా 32 పావురాలను పందెంలోకి దింపవచ్చు. ఈ పావురాలు పుట్టిన ఏడెనిమిది రోజుల్లోనే వాటి కాలుకు క్లబ్కు చెందిన రింగు తొడుగుతారు. ఇంటికి దూరంగా మరెక్కడో పందెంలో దించేప్పుడు ఈ రింగులపై స్క్రాచ్ కార్డ్తో కూడిన ట్యాగ్ అతికిస్తారు. ప్రస్తుతం ఇవి చైనాలో తయారై భారత్కు వస్తున్నాయి. పావురం వదిలిన ప్రాంతం నుంచి పావురం యజమాని ఇంటికి చేరిన వెంటనే ట్యాగ్ను స్క్రాచ్ చేసి, అక్కడ ఉన్న సంఖ్యను ప్రత్యేక యాప్ ద్వారా ఫొటో తీసి తమ క్లబ్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తుంటారు. వీటిలోని సమాచారం ఆధారంగా పావురం ప్రయాణించి సమయం, ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకుని నిర్వాహకులు గెలిచిన పావురాన్ని ప్రకటిస్తారు. ఈ వివరాలు ప్రపంచంలోని అన్ని క్లబ్బులకూ చేరవేస్తారు. తద్వారా క్లబ్బుల వివరాలు, పావురాల విశిష్టత తదితరాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతాయన్న మాట. రాష్ట్రంలోని షాద్నగర్, మెదక్ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పీజియన్ రేసింగ్ క్లబ్లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. దాడులు తప్పించుకునేందుకు దారి తప్పి పావురాలను నిర్ణీత ప్రాంతానికి తీసుకువెళ్లే నిర్వాహకులు అక్కడ ఒకేసారి విడిచిపెడతారు. అవన్నీ గుంపులుగానే ప్రయాణిస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ పావురాలు ఎగురుతాయి. మధ్యలో ఏదో ఒక చోట సేదతీరి, ఆహారం సేకరించి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తాయి. రోజుకు 100 నుంచి 110 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని అంచనా. కొన్ని సందర్భాల్లో పావురాలు గుంపును వదిలి పక్కకు వస్తుంటాయి. అలాంటి వాటిపై గద్దలు వంటి పక్షులు దాడులకు దిగుతాయి. అలాంటప్పుడు పావురాలు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయాణించాల్సిన మార్గం వదిలి వేరే మార్గంలో ప్రయాణిస్తాయి. ఇలాంటివే ఇటీవల ఖమ్మం తదితర ప్రాంతాల్లో కనిపించాయి. వాటి కాళ్లకు ఉన్న స్క్రాచ్ కార్డులపై ఉన్న చైనా అక్షరాలను చూసి అంతా అనుమానించారు. అయితే ఇవి పందెం పావురాలని తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ పావురాలు ప్రాణాలతో ఉంటే మాత్రం కాస్త ఆలస్యమైనా తమ యజమాని ఇంటికి వచ్చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ఈ పందాల్లో ఎక్కడా నగదు లావాదేవీలు, బహుమతులు ఉండవు. కేవలం గెలిచిన వాటికి ఓ ట్రోఫీ లభిస్తుంది. ఆ పేరుతో పాటు గెలుపొందిన పావురానికి పుట్టే పిల్లలకు (బ్రీడ్) మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని కనిష్టంగా రూ.5 వేలు, గరిష్టంగా రూ.80 వేలకు అమ్మొచ్చు. హాబీగానూ, పేరు కోసం, ఇలా అమ్ముకునేందుకే పావురాలను పెంచి, పందాల్లో పాల్గొంటాం’అని ఓ క్లబ్ సభ్యుడు తెలిపారు. కళ్లు, రెక్కలే సామర్థ్యానికి కొలమానం ఈ పావురాల శక్తిసామర్థ్యాలను వాటి కళ్లు, రెక్కలను బట్టి నిర్థారిస్తారు. వీటిని పరిశీలించిన నేపథ్యంలో అది ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేవి తెలుసుకుంటారు. రేసుల్లో పాల్గొనే గుర్రాలకు చరిత్ర ఉన్నట్లే... ఈ పావురాలకూ ప్రొఫైల్ ఉంటుంది. వీటికి కాళ్లకు వేసే రింగుకు ఉండే ఐదంకెల నంబర్ ఆధారంగా ‘పెడిగ్రీ’గా పిలిచే ఈ చరిత్రను రికార్డుల్లోకి ఎక్కిస్తారు. అందులో పావురం వయస్సు, దాని పుట్టుక వివరాలు, అవి ఏ రేసుల్లో పాల్గొన్నాయి? ఎన్నింటిలో గెలిచాయి? ఎంతెంత దూరం ఎగిరాయి? తదితర అంశాలు పొందుపరుస్తారు. వీటన్నిటినీ బట్టి ఆయా పావురాల సంతతికి డిమాండ్ ఉంటుంది. -
గెలుపు ట్రంప్దే.. ఇక ట్రేడ్ వారే!
ముంబై: హోరా హోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో అంచనాలు మరింత ఉత్కంఠను రాజేస్తున్నాయి. రేపు(నవంబర్ 8న) పోలింగ్ జరగనుండగా ఫలితాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అంతేకాదు ఎవరు గెలిస్తే ఏంటి అనే చర్చ కూడా భారీగానే నడుస్తోంది. ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు, ట్రేడ్ పండితుల విశ్లేషణలు పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి. తాజాగా ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ సంచలన విశ్లేషణ చేశారు. ఒకవైపు హిల్లరీ ఫౌండేషన్ ప్రయివేట్ ఈమెయిళ్లను వినియోగించారన్న అభియోగంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) క్లీన్ చిట్ ఇవ్వడంతో ట్రంప్ను వెనక్కి నెట్టి హిల్లరీ రేసులో ముందంజలోకి వచ్చేశారు. అయితే తాను మాత్రం ట్రంప్ గెలుస్తారనే భావిస్తున్నానని, అందువల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నానని ఆయన తెలిపారు. హిల్లరీ, ట్రంప్లలో ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒరిగేదేమీ ఉండదంటూ వ్యాఖ్యానించినప్పటికీ, ట్రంప్ గెలిస్తేమాత్రం ముప్పు తప్పదన్న సంకేతాలందించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందనీ, ఇందులో చైనాకు కూడా మినహాయింపులేదన్నారు. భారత్ కూడా ఆర్థిక మందగమనం నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. అయితే భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు బావున్నాయని కితిబిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే, అమెరికా రుణభారం మరింత పెరిగి దివాలా పరిస్థితికి చేరుతుందన్నారు. వాణిజ్యపరమైన వివాదాలకు తెరలేస్తుందని విశ్లేషించారు. తన అంచనా కరెక్టయితే స్వల్పకాలంలో ముడిచమురు, బంగారం షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొని ధరలు కుప్పకూలతాయని జోస్యం చెప్పారు. కమోడిటీ ధరలు మాత్రం పుంజుకుంటాయన్నారు. ఈ షేర్లలో మదుపర్లు దీర్ఘకాలిక పొజిషన్లు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. అలాగే వ్యవసాయ సంబంధిత షేర్లు కొనుక్కోవాలని, అయిదు సం.రాల కాలపరిమితిలో అమెరికాలో జంక్ బాండ్స్ లో షాట్ పొజిషన్ తీసుకోవచ్చని సూచించారు. ట్రంప్ విజయంతో ముడిచమురు మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని, బంగారం ధరలు, క్రూడాయిల్ భారీగా పతనమవుతాయని రోజర్స్ అంచనా వేశారు. కొత్త పెట్టుబడులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి దీర్ఘకాల అవకాశాలు లభిస్తాయని అన్నారు. కమోడిటీ మార్కెట్ అందనంత ఎత్తునకు చేరుతుందని, ఇండియాపైనా ఈ ప్రభావం ఉంటుందని, అయితే, ఇండియాలో కాగా, వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ లో హిల్లరీకి అనుకూలంగా60 శాతం మెజార్టీ లభిస్తోంది. అయితే హిల్లరీ గెలిచినా ఈపరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయానా కాస్త ఆలస్యమవుతాయని పేర్కొనడం విశేషం. -
స్టాక్ మార్కెట్లో కూడా ఆయన సూపర్ స్టారే
ముంబై: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, వాటి ద్వారా లాభాలు అంటే కత్తిమీద సామే. అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్టాక్ మార్కెట్లో స్థిరమైన పెట్టుబడుల ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించి మరోసాగి బిగ్ బిగా అవతరించారు. ఎంచుకున్న షేర్లలో పెట్టుబడులపై అయిదురెట్ల లాభాలను సాధించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా ఫినోటెక్స్ కెమికల్స్ షేర్ పెట్టుబడుల ద్వారా 5 రెట్ల లాభాలను గడించారు. న్యూల్యాండ్ ల్యాబ్స్ లో మూడు రెట్ల ఆదాయాన్ని సాధించారు. మరోవైపు 2013 లో ఐపీవో లో పది రూపాయలకు సొంతం చేసుకున్న జస్ట్ డయల్ షేరును బిగ్ బీ ఇటీవల ఈ షేర్ ను రూ 1,150 స్థాయిలో అమ్మడం ద్వారా భారీ లాభాలను సాధించారు. న్యూ లాండ్స్, ఫినోటెక్స్ కెమికల్స్ 3 కోట్ల పెట్టుబడులకు గాను 14.49 కోట్టు, జస్ట్ డయల్ లో రూ.0.06 కోట్లకు గాను 7.22కోట్లను, ఉజాస్ ఎనర్జీ లో సుమారు నాలుగు కోట్ల పెట్టుబడులకు గాను ఎనిమిది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించారు. జస్ట్ డయల్ ప్రస్తుతం రూ.474.80 వద్ద ఉండగా, ఫినోటెక్స్ బీఎస్ సీలో 1.12 శాతం నష్టపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం అమితాబ్ పోర్ట్ ఫోలియో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. స్టాంపీడ్ క్యాపిటల్ లో సుమారు 24.34 కోట్లు, ఫినోటెక్స్ కెమికల్1.75 కోట్ల మార్కెట్ల వాల్యూ వుండగా, బిర్లా పసిఫిక్ మెడ్ స్పాలో దాదాపు వంద కోట్ల నష్టం, నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ లో సుమారు నాలుగుకోట్ల నష్టంతోనూ ఉన్నాయి. కాగా న్యూల్యాండ్ ల్యాబ్స్ , ఫినోటెక్స్ కెమికల్, బిర్లా పసిఫిక్ మెడ్ స్పా తదితర కంపెనీల్లో గత కొన్నాళ్లుగా బిగ్ బి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. -
ప్రాణం తీసిన పందెం
మద్యం ఫుల్బాటిల్ దింపకుండా తాగి ఒకరి మృతి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు సిరిసిల్ల: మద్యంపై ముగ్గురు స్నేహితులు కాసుకున్న పందెం ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. దించకుండా ఫుల్బాటిల్ తాగాలని పందెం కాసుకున్న మిత్రులు ముగ్గురూ మద్యం తాగగా వారిలో ఒకరు వాంతులు చేసుకుని మరణించారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన హమాలీ కరికె రవి(38), తాపీమేస్త్రీ రంగు నర్సయ్య, ఆటో డ్రైవర్ కుమ్మరి దేవయ్య స్నేహితులు. ఈ ముగ్గురు గురువారం ఫుల్బాటిల్ మద్యం దించకుండా తాగాలని, ఎవరు ముందు తాగితే వారు గెలిచినట్టు అని పందెం కాసుకున్నారు. మూడు మద్యం బాటిళ్లు తెప్పించుకుని ఎవరికి వారు గటగటా తాగేశారు. ఘాటు నషాళానికి ఎక్కడంతో తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. కరికె రవి తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రంగు నర్సయ్య, కుమ్మరి దేవయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మద్యంలో విషప్రయోగం జరగడం వల్లే రవి మరణించాడని కుటుంబసభ్యులు, తంగళ్లపల్లికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. రూ.కోటి విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత చింతూరు : రాజస్థాన్, గుజరాత్ నుంచి తెలంగాణ, కర్నాటకకు నాలుగు లారీలలో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాల ప్యాకెట్లను చింతూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసి చింతూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ లారీలలో మొత్తం 32 టన్నుల బరువున్న 490 బ్యాగులు ఉన్నాయి. చింతూరు మండలం చట్టి వద్ద గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. వీటిలోని గుట్కా ప్యాకెట్ల బ్యాగులను స్వాధీనపర్చుకున్నారు. లారీలను సీజ్ చేసి, డ్రైవర్లను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.