-
కరోనాతో తల్లీకొడుకు మృతి
బీర్కూర్ (బాన్సువాడ): కరోనా కారణంగా తల్లీకొడుకు గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీన, ఆమె భర్త హన్మంత్ (42), అత్త గంగామణి (65) వారం క్రితం అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్కు వెళ్లి పరీక్ష చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముగ్గురు ఇంటికి వచ్చి హోం ఐసోలేషన్లో ఉన్నారు. రెండ్రోజుల తర్వాత హన్మంత్ దంపతుల ఆరోగ్యం క్షీణించడంతో నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఇంట్లో ఉన్న గంగామణికి ఆదివారం రాత్రి శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఊపిరి ఆడక కన్ను మూసింది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోవిడ్ నిబంధనల ప్రకారం రాత్రి సమయంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు, ఆదివారం రాత్రి హన్మంత్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, సోమవారం ఉదయం మృతి చెందారు. 12 గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందడంతో బీర్కూర్లో విషాద చాయలు నెలకొన్నాయి. 5 రోజుల వ్యవధిలో దంపతులు మృతి బెల్లంపల్లి: మాయదారి కరోనా ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఐదు రోజుల వ్యవ ధిలో భార్యాభర్తల ఉసురుతీసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్బస్తీకి చెందిన దంపతులకు వారం క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. భర్తకు తీవ్ర అస్వస్థత ఉండటంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. భార్య హోం ఐసోలేషన్లో ఉండి తీవ్ర మనోవేదనకు గురైంది. తన భర్తకు నయం అవుతుందో లేదోనని ఆందోళన చెందింది. సంతానం లేని సదరు గృహిణి.. ఈనెల 14న ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. తాజాగా ఆమె భర్త కరోనాతో పోరాడుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. -
ఎమ్మెల్యేలకు ‘అవిశ్వాస’ టెన్షన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శాసనసభ్యులకు ‘అవిశ్వాసం’ తలనొప్పి తీవ్రమైంది. పూర్వ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగింట ఇదే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీలో ఎమ్మెల్యేలకు అనుయాయులుగా వ్యవహరించినవారే అదను చూసి అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో శాసనసభ్యులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో సొంత పార్టీలోనే అసమ్మతి పెరిగిపోతుందనడానికి ఈ పరిణామాలను ఉదాహరణగా చెప్పుకునే పరిస్థితి తలెత్తింది. అవిశ్వాసం పెట్టినవారు, అవిశ్వాసాన్ని ఎదుర్కోబోయే వారు ఇద్దరూ టీఆర్ఎస్ వాళ్లే అవుతుండడం ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ‘నా కనుసన్నల్లో ఉండే నాయకులు ఎదురు తిరుగుతారా?’ అనే అతి విశ్వాసం పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ రాహుల్రాజ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఓటింగ్ నిర్వహిస్తారు. అలాగే మండలాల్లో ఎంపీపీలపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులకు కూడా ఆదిలాబాద్ జెడ్పీ సీఈవో నుంచి స్పందన వచ్చింది. నోటీసులు ఇచ్చిన తేదీల ఆధారంగా జెడ్పీ సీఈవో ప్రత్యేక సమావేశాలకు ఆదేశాలు జారీ చేశారు. కాసిపేట ఎంపీపీ శంకరమ్మపై ఇచ్చిన అవిశ్వాసం నోటీస్పై ఆగస్టు 7న సమావేశం ఏర్పాటు చేయగా, రెబ్బెన ఎంపీపీ సంజీవ్కుమార్ అవిశ్వాసంపై ఆగస్టు 9న ప్రత్యేక సమావేశం జరుగనుంది. అలాగే కుంటాల ఎంపీపీ కొత్తపల్లి గంగామణి అవిశ్వాసాన్ని ఆగస్టు 14న జరిగే సమావేశంలో ఎదుర్కోనున్నారు. ఖానాపూర్ ఎంపీపీ శోభారాణిపై అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఆగస్టు 16న జరుగుతుంది. జన్నారం ఎంపీపీపై ఇచ్చిన అవిశ్వాసంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. రాష్ట్రంలో చర్చనీయాంశమైన బెల్లంపల్లి బెల్లంపల్లి మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లకు ఏకంగా 29 మంది అవిశ్వాసం ప్రకటించారు. వైస్ చైర్మన్తో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ సభ్యులంతా ఈ అవిశ్వాసంలో పాలు పంచుకున్నారు. నెలరోజులుగా క్యాంపు రాజకీయాలు చేస్తుండగా, నేరుగా ఎమ్మెల్యే రంగంలోకి దిగి అసమ్మతిని అణచివేయాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ కౌన్సిలర్ కూతురుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన హెచ్చరికలు వైరల్గా మారడంతో టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఉలిక్కిపడింది. ఈ క్రమంలోనే ఖైరిగూడ ఓసీపీలో పనిచేసే ఇద్దరు కౌన్సిలర్ల భర్తలను ఏకంగా మణుగూరుకు బదిలీ చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించినా, కౌన్సిలర్లు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 2న జరిగే అవిశ్వాస సమావేశం కోసం అందరితో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఎదురుచూస్తున్నారు. నెలరోజులకు పైగా క్యాంపులో ఉన్న అసమ్మతి కౌన్సిలర్లు ఆగస్టు 2వ తేదీన నేరుగా సమావేశానికే హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సబ్ కలెక్టర్ రాహుల్రాజ్ అధ్యక్షతన బెల్లంపల్లిలో జరిగే ఈ సమావేశంపైనే ఉమ్మడి జిల్లా రాజకీయ నాయకులు దృష్టి సారించారు. కాసిపేటలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే కాసిపేట ఎంపీపీ శంకరమ్మ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వైఖరిని తప్పుపడుతూ రెండు నెలల క్రితం కోదండరాం టీజేఎస్ పార్టీలో చేరగా, ఆమెపై ఐదుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గడం లాంఛనమే. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ ముందు కాసిపేట ఎంపీపీ అతి చిన్న అంశంగా మారింది. ఎత్తుకు పైఎత్తుల్లో రేఖానాయక్–రమేష్రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా నాయక్కు మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ ద్వారా సుధీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు పొందిన రమేష్ రాథోడ్ గత సంవత్సరం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసిన రమేష్ రాథోడ్ ఆ దిశగా పావులు కదుపుతూ నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాథోడ్ ఎత్తులను చిత్తు చేసేందుకు రేఖా నాయక్ సైతం తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జన్నారంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ వర్గీయులైన ఎంపీపీ చెట్టుపల్లి రాజేశ్వరిపై రమేష్ రాథోడ్ మద్దతుతో తొమ్మిది మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు. వీరిలో ఏడుగురు టీఆర్ఎస్కు చెందిన వారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ చక్రం తిప్పి ఒకరిద్దరు ఎంపీటీసీలను తనవైపు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు గ్రూపులు క్యాంపులోనే ఉన్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ మండలంలో రమేష్ రాథోడ్ వర్గానికి చెందిన శోభారాణిపై అవిశ్వాసం పెట్టించారు. ఇక్కడ ఎంపీపీకి వ్యతిరేకంగా 13 మంది క్యాంపులో ఉండడం విశేషం. ఒప్పందాల ఉల్లంఘనతో కుంటాల, రెబ్బెన అవిశ్వాసాలు రెబ్బెన ఎంపీపీ సంజీవ్కుమార్పై వైఎస్ ఎంపీపీతో పాటు ఏడుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించగా, ఆగస్టు 9న సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఇక్కడ ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలకు మధ్య రెండున్నరేళ్ల పదవీకాలం ఒప్పందం ఉండగా, దాన్ని ఎంపీపీ ఉల్లంఘించారు. కుంటాలలో కూడా ఎంపీపీ గంగామణి, గొల్లమాడ ఎంపీటీసీకి మధ్య రెండున్నరేళ్ల ఒప్పందం ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా పదవిలో కొనసాగడంతో అవిశ్వాసం అనివార్యమైంది. ఈ పరిణామాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ జోక్యం చేసుకున్నా రెబ్బెనలో ఫలితం లేకుండా పోయింది. కుంటాలలో టీఆర్ఎస్కే చెందిన ఎంపీటీసీల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే విఠల్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరికి మద్ధతు ఇవ్వలేక మిన్నకుండిపోతున్నారు. -
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా
♦ అక్రమార్కులతో కుమ్మక్కైన ఓ ప్రజాప్రతినిధి? ♦ పక్షం రోజులుగా సాగుతున్న పనులు బెల్లంపల్లి : బెల్లంపల్లి మునిసిపాలిటీ శివార్లలోని విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. కొందరు వ్యాపారులు ఈ పనికి పాల్పడుతూ ఓ ప్రజాప్రతినిధిని తమతో కలుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్లంపల్లి శివారులోని బుధాకలాన్ గ్రామ సర్వే నంబర్ 170లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల వెనకాల ఉన్న విలువైన ఖాళీ భూమిని ఆక్రమించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ భూమిని ఇప్పటికే కొందరు నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద కేటాయించగా పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే, మరోపక్క గురి జాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఐటీడీఏ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మించారు. దీని పక్కనే తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు సాగుతుండగా, ఇంకోపక్క ఏఆర్ పోలీసు హెడ్క్వార్టర్స్ ఉన్నాయి. ఇలా ప్రభు త్వ కార్యాలయాల నడుమ ఉన్న విలువైన ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు కబ్జాదారులు సిద్ధం కాగా.. పక్షం రోజులుగా ట్రాక్టర్లతో భూమి చదును చేయిస్తున్నాయి. అంతేకాకుండా గుంటన్నర చొప్పున ప్లాట్లు వేసి రూ. 20వేల చొప్పున వసూలు చేసి విక్రయాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. మంజూరు కాకముందే ఆక్రమణ? బెల్లంపల్లిలోని ఓ సామాజికవర్గం ఇళ్ల స్థలాల కోసం కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న సదరు సామాజికవర్గం నాయకులు ఎలాగూ మంజూరు చేస్తారనే ధీమాతో ప్రస్తుతం ఆక్రమణకు గురైన సర్వే నం.170లోని మి గతా ఖాళీ భూమిని కబ్జా చేశారు. ఆ భూమి చుట్టూరా ఫెన్సింగ్ కూడా వేశారు. అంతేకాకుండా 40మంది కుల స్తులకు ప్లాట్లు కేటాయించి కందకాలు తవ్వడం గమ నార్హం. ఇది పోను పునాది నిర్మాణానికి ఇసుక, బండరాయి తెప్పించడం గమనార్హం. ఈ విషయమై రెవెన్యూ యంత్రాంగం మేల్కొని ప్రభుత్వ భూమి ఆక్రమణలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. స్థలం మంజూరు కాలేదు ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఓ సామాజిక వర్గం నాయకులు కలెక్టర్కు వినతిపత్రం పంపించారు. అయితే, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాకముందే భూమి ఆక్రమించుకున్నారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపించి పనులు నిలుపుదల చేయిస్తాం. - కె.శ్యామలదేవి, తహశీల్దార్, బెల్లంపల్లి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నానిని మళ్లీ గెలిపించాలని..
7న మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్!
షా డీప్ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సరిహద్దు చెక్ పోస్ట్లలో ప్రత్యేక నిఘా
క్రిమినల్స్కు ఓటేస్తే అంతా దోపిడీ
No Headline
వైఎస్సార్సీపీతోనే ప్రజలకు మేలు
అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే
No Headline
No Headline
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement