breaking news
Behaves rudely
-
గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?
గంజాయిపై భారత్తో సహా చాలా దేశాల్లో నిషేధం విధించారు. అక్రమంగా వినియోగిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. గంజాయిని తాగిన తర్వాత మనుషుల్లో అసాధారణ చేష్టలు కనిపిస్తాయి. కొందరు బిగ్గరగా నవ్వుతారు. మరికొందరు బిగ్గరగా ఏడుస్తుంటారు. అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి? గంజాయిలో ఏముంది..? అది ఏ విధంగా హానికరం..? గంజాయిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గంజాయి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అసాధారణ స్వభావంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో అబద్ధాలను అలవోకగా చెబుతుంటారు. గంజాయి తాగిన తర్వాత ఎందుకు మితిమీరిన ఆనందాన్ని పొందుతుంటారు. దీనికి కారణం డొపమైన్ అనే హార్మోన్. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు అయ్యే కొద్ది మనంలో ప్రవర్తన తీరు మారుతుంది. గంజాయి సేవించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మితిమీరిన సంతోషం లేదా దుఖాన్ని ప్రదర్శిస్తారు. నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండటం వల్ల మెదడు మన ఆధీనంలో ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి సేవిస్తే గుండెపోటుతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే అన్ని పదార్థాలతోనూ ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్గా మారింది!..ఆ విధంబెట్టిదనినా.. -
పిల్లలతో కఠినంగా మాట్లాడొద్దు.. కారణం ఏంటంటే!
లాలయేత్ పంచ వర్షాణి దశవర్షాణి తాడయేత్ ‘ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్’ పిల్లలను ఐదు సంవత్సరాల పాటు లాలించాలి. పది సంవత్సరాల పాటు దండించాలి. పదహారో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పిల్లలను స్నేహితుల్లాగ చూడాలి అంటాడు చాణుక్యుడు. మనం కన్న బిడ్డలే కదా, వారి మీద మనకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, వారిని ఏమన్నా చెల్లిపోతుంది అనుకోవటం తప్పు అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల్ని చిన్నతనంలో అనవసరంగా తిడుతూ, కఠినంగా మాట్లాడుతూ వారిని అవమానించినట్లుగా మాట్లాడుతుంటే వారిలో బుద్ధి వికాసం తగ్గిపోతుందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తెలిసింది. పిల్లల్ని ప్రేమగా మందలించాలే కానీ, కఠిన శిక్షలు విధిస్తూ, మనసు గాయపడేలాంటి ములుకుల్లాంటి మాటలతో బాధించటం వల్ల వారు మానసికంగా ఎదగలేకపోతారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి అనురాగం, అభిమానం ఆశిస్తారు. అందుకు బదులుగా తిట్లు శాపనార్థాలు వస్తుంటే, ఆ పసి మనసు తట్టుకోలేకపోతుంది. పసి హృదయాలను గాజు బొమ్మల్లా పదిలంగా కాపాడుకోవాలంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అందుకే వారు ఏది చెప్పినా జాగ్రత్తగా వింటూ, వారి ఆలోచనలను స్వాగతిస్తూ, వారు సక్రమమార్గంలో ఎదిగేలా తల్లిదండ్రులు సహకరించాలి. పదే పదే కోపం తెచ్చుకోవటం, కొట్టడం, భయపెట్టడం, వేధించటం... వంటి అస్త్రాలను పిల్లల మీదకు సంధిస్తుంటే, వారి మెదడు ఎదుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా కౌమార దశలో అంటే టీనేజ్లో ఉన్న వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ‘డెవలప్మెంట్ అండ్ సైకాలజీ’ వారు ప్రచురించారు. డా. సబ్రీనా సఫ్రెన్.. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. పిల్లల పట్ల కటువుగా ఉండటం తప్పేమీ కాదనుకుంటారు పెద్దలు. సమాజం కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తుంది. ఏదో ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు ఇదే ఆలోచనతో ఉంటారని ఈ పరిశోధన చెబుతోంది. ‘మాట్లాడే మాటలు పిల్లల ఎదుగుదలలో మార్పులు తీసుకువస్తాయి. తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే... మాటిమాటికీ పిల్లల్ని దండించటం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుందని’ అంటారు సఫ్రెన్. పిల్లల్ని లైంగికంగా, శారీరకంగా, మానసికంగా బాధకు గురి చేస్తుంటే, వారిలో ఏదో తెలియని ఆరాటం, విచారం పెరుగుతాయి. వారు ఎదుగుతున్న కొద్దీ ఈ విచారం ఒత్తిడిగా మారుతుంది. అందుకే పిల్లల్ని బాల్యం నుంచి మంచి మాటలు, మంచి కథలు చెబుతూ పెంచాలి. ఎటువంటి సమయంలోనైనా తల్లిదండ్రుల అండదండలు ఉంటాయనే భరోసా కల్పించాలి. కొట్టడం, తిట్టడం, నిందించం, అసభ్య పదాలు ఉపయోగించటం వల్ల... పిల్లలలో తెలివితేటలు తగ్గిపోతాయని ఈ సర్వే చెబుతోంది. -
కాళహస్తిలో అల్లు శిరీష్ రాహుకేతు పూజలు
చిత్తూరు : సినీ హీరో అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం ఉదయం శిరీష్, తన స్నేహితుడితో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. కాగా స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన శిరీష్... మీడియా ప్రతినిధులకు సారీ చెప్పాడు. తెలియక అలా జరిగిందని వివరణ ఇచ్చాడు.