breaking news
Bata singaram
-
Ranga Reddy District: భూదాన్ భూముల్లో వాలిన గద్దలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూదాన్ భూములకు రక్షణ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వందల ఎకరాలు అన్యాక్రాంతమవగా తాజాగా మరికొంత భూమిని మాయం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గతంలో భూదాన్ బోర్డు సభ్యులుగా చెలామణి అయిన కొందరు పెద్ద మనుషులు ఈ భూములను కొల్లగొట్టి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొనేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో సొంత గూడు సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్న పేదల బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారు. వీకర్ సెక్షన్ కింద పేద, మధ్య తరగతి ప్రజలకు నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములకు రక్షణ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాల బారి నుంచి కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఖాళీ భూములపై ‘పెద్ద’ల కన్ను.. భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించి మిగులు భూములు ఉన్న రైతుల నుంచి సుమారు 22,000 ఎకరాలు సేకరించి భూదాన్ బోర్డుకు అప్పగించారు. దీనిలో కొంత భూమి పేదలకు పంచారు. మరికొంత భూమిని రైతులు, రియల్టర్లు పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలిపేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బోర్డు పరిధిలో 7000 ఎకరాల వరకు ఖాళీ భూములు ఉన్నట్లు అంచనా. అబ్దుల్లాపూర్మెట్లో 215 నుంచి 227 వరకు ఉన్న సర్వే నంబర్లతోపాటు జాఫర్గూడ సర్వే నంబర్ 317, 319లలో 20 ఎకరాలకుపైగా, బాటసింగారం రెవెన్యూ పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో 75 ఎకరాలకుపైగా, కుంట్లూరులో 216 నుంచి 220 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాలకుపైగా భూదాన్ భూమి ఉంది. అదేవిధంగా తారామతిపేట్ సర్వే నంబర్ 235, 236లలో 48 ఎకరాలు ఉండగా గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 187, 188, 189లలో పెద్ద సంఖ్యలోనే భూదాన్ భూములున్నాయి. బాలాపూర్లోని సర్వే నంబర్ 88లో 27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఇక యాచారం, ఇబ్రహీపట్నం, మంఖాల్, మహేశ్వరంలోనూ ఈ బోర్డుకు భూములు ఉన్నాయి. ఈ భూములు అమ్మడం, కొనడం నేరమైనప్పటికీ జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు, అమ్మకాలు కొనసాగు తున్నాయి. లీజు పేరుతో గలీజు వ్యవహారాలు... ఇప్పటికే మెజారిటీ భూములను రియల్టర్లు కొల్లగొట్టగా మరికొంత భూమిని గతంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన కొందరు మాయం చేస్తున్నారు. వీకర్ సెక్షన్లకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద మొత్తంలో భూములు కొల్లగొట్టారు. ఒకే ప్లాటుకు 2, 3 నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఒక్కో ప్లాటును రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది విద్యాసంస్థలు, గోశాలలు, అనాథాశ్రమాలు, ఇతర సామాజిక సేవల పేరుతో ఈ భూములను వందేళ్లకు లీజుకు తీసుకొని స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. (క్లిక్ చేయండి: డీజీపీ రేసులో పోటాపోటీ!) బోర్డును పునరుద్ధరించాలి... నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల ద్వారా సుమారు రూ. 19 కోట్లు అక్రమంగా వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. భూదాన్ భూములను కాపాడాలంటే బోర్డును పునరుద్ధరించడం ఒక్కటే పరిష్కారం. – వెదిర అరవింద్రెడ్డి, అధ్యక్షుడు, సర్వసేవాసంఘ్ (అఖిల భారత సర్వోదయ మండల్) మేమే పంచుతాం.. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ భూములు మాయమయ్యాయి. కబ్జాదారుల చెరలోని భూములను విడిపించాలి. కనీసం మిగిలిన భూములైనా ప్రభుత్వం పేదలకు పంచాలి. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలోనే భూపంపిణీ చేపడతాం. – రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
రంగారెడ్డి: ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాజేష్ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. -
పెదనాన్న కొడుకే దారుణానికి పాల్పడ్డాడు
* బంధువులే యమపాశాలుగా మారుతున్నారు *మొన్న ఆరాధ్య.... తాజాగా ఉదయ్ కిరణ్ హైదరాబాద్: అయినవారే వారి.. పాలిట మృత్యువుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్య ఉదంతం మరవక ముందే ...అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. ఒకరేమో భార్యతో సన్నిహితంగా ఉండేందుకు చిన్నారి అడ్డు వస్తుందని బాబాయి పాశవికంగా చంపి పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే...మరొకరు డబ్బు కోసం సోదరుడినే స్నేహితులతో కలిసి హతమార్చారు. బాటసింగారంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ను హతమార్చింది కూడా స్వయానా పెదనాన్న కొడుకే. వివరాల్లోకి వెళితే బాటసింగారం బిల్కలెక్టర్ పెంటయ్య కుమారుడు ఉదయ్కిరణ్. పెద్దఅంబర్పేట్లోని రాజాశ్రీ విద్యామందిర్లో ఏడో తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్కు వెళ్లిన ఉదయ్ కిడ్నాప్కు గురయ్యాడు. పెంటయ్య అన్న కొడుకు, మాజీ హోం గార్డు నవీన్తో పాటు మరో నలుగురు డబ్బు కోసం కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వనస్థలిపురం చెరువుకట్ట వద్ద విద్యార్థి మృతదేహం బయటపడింది. నిందితులు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఉదయ్కిరణ్ తమను గుర్తు పట్టేయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందని భయపడి అతడిని గొంతు నులిమి, హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే ఉదయకిరణ్ దారుణహత్య
-
కిడ్నాపైన ఉదయకిరణ్ దారుణహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బాటసింగారంలో ఓ దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. కిడ్నిప్ చేసిన దుండగులు విద్యార్థిని గొంతు నులుమి హత్య చేశారు. బుధవారం నుంచి కనిపించకుండా పోయిన ఉదయ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలాడు. రంగంలోకి దిగిన సరూర్ నగర్ పోలీసులు మాజీ హోంగార్డుతోపాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ తగదాలే కారణమని పోలీసులు తెలిపారు. విద్యార్థి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్నేహితులను, బంధవులను ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కిడ్నాప్కు గురైన ఉదయకిరణ్ దారుణహత్య