breaking news
Based inflation rate
-
టోకు ద్రవ్యోల్బణం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన, ఆహారోత్పత్తుల రేట్లు కొంత నెమ్మదించడంతో తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) స్వల్పంగా తగ్గింది. 9.78 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 9.87 శాతంగా ఉంది. 2025 అక్టోబర్ తర్వాత నెలవారీగా చూసినప్పుడు డబ్ల్యూపీఐ తగ్గడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగినప్పటికీ ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల నెమ్మదించడం ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఇంధన ద్రవ్యోల్బణం జూన్లో 27.41 శాతంగా ఉండగా జూలైలో 20.05 శాతానికి దిగి వచి్చంది. అలాగే, ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.49 శాతం నుంచి స్వల్పంగా 5.44 శాతానికి తగ్గింది. అయితే, తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 7.48 శాతం నుంచి 8.29 శాతానికి పెరిగాయి. అంతర్జాతీయంగా రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరినందున రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఇకపై క్రమంగా తగ్గు ముఖం పట్టొచ్చని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టులో ఇది 9.5 శాతానికి దిగి రావొచ్చని, అయితే, 2027 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద డబ్ల్యూపీఐ సగటున 8.5 శాతంగా ఉండొచ్చని ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ రాహుల్ అగ్రవాల్ పేర్కొన్నారు.రిటైల్ ధరలు అక్కడక్కడే వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గత నెల(జూలై)లో స్వల్పంగా పెరిగి 4.45 శాతానికి చేరింది. ఉల్లిపాయలు, అల్లం తదితరాల ధరలు పెరిగినప్పటికీ జూన్లో నమోదైన 4.38 శాతంతో పోలిస్తే నామమాత్రంగా బలపడింది. దీంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెలలోనూ ఆర్బీఐ పరపతి విధానాల లక్ష్యానికి ఎగువన నిలిచింది. 2024 ఏడాది(బేస్ ఇయర్) ఆధారం చేసుకుని జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సిరీస్లో జూలై గణాంకాలే అత్యధికంకావడం గమనార్హం! గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతం నుంచి 5.52 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఉల్లి ధరల పెరుగుదల జూన్లో నమోదైన 4.73 శాతం నుంచి జూలైలో 22.54 శాతానికి, అల్లం ధర దాదాపు 84 శాతానికి ఎగసింది. అయితే మరోపక్క బంగళా దుంపలు, బెండకాయలు, టొమాటోలు, బఠాణీల ధరలు వెనకడుగు వేయడంతో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. -
ఇక ధరల లెక్క కొత్తగా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్)కు ఇప్పటివరకు 2012 బేస్ ఇయర్గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్ సంవత్సరం ప్రకారం డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. సీక్వెన్షియల్గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. → కొత్త సిరీస్ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. → జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది. → వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. → వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. → కొత్త సిరీస్లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి. → సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్లో 36.75 శాతానికి తగ్గింది. సీపీఐలో చేరినవి → గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) → ఆన్లైన్ మీడియా సర్వీస్ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్ సేవలు → విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు → బార్లీ, సంబంధిత ఉత్పత్తులు → పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ → వ్యాయామ పరికరాలు → అటెండెంట్, బేబీ సిట్టర్ (ఇళ్లలో సహాయకులు)సీపీఐ నుంచి తొలగించినవి → వీసీఆర్/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు → రేడియో, టేప్రికార్డర్ → వినియోగించిన వ్రస్తాలు → సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు → కాయిర్/రోప్ → హైరింగ్ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి) -
టోకు ధరలు మరింత తగ్గాయ్
ఏప్రిల్లో ద్రవ్యోల్బణం -2.65 శాతం క్షీణత - వరుసగా 4 నెలలుగా ఇదే ధోరణి - ఆహారోత్పత్తుల ధరలు మాత్రం పెరిగాయ్... న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్లో అసలు పెరక్కపోగా 2.65 శాతం (మైనస్) క్షీణించింది. అంటే 2014 ఏప్రిల్తో పోల్చితే మొత్తం టోకు వస్తువుల బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా, అప్పటి నెలతో పోల్చితే 2015 ఏప్రిల్లో -2.65 శాతం తగ్గాయన్నమాట. 2014 నవంబర్ నుంచీ ‘జీరో’ స్థాయిలో కదులుతున్న ద్రవ్యోల్బణం రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్లోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూడు విభాగాలూ చూస్తే... 2014 ఏప్రిల్ ధరలతో పోల్చి 2015 ఏప్రిల్లో ధర ల స్పీడ్కు సంబంధించి టోకు ధరల సూచీలోని ప్రధాన మూడు విభాగాల తీరునూ పరిశీలిస్తే.. ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్కు సంబంధించి ప్రాథమిక వస్తువుల (దాదాపు 20% వెయిటేజ్) తీరు- ఈ బాస్కెట్ వార్షిక ధరల పెరుగుదల రేటు కేవలం 0.25%గా నమోదయ్యింది. ఫుడ్ ఆర్టికల్స్ (14% వెయిటేజ్) ధరలు మాత్రం 5.73% ఎగశాయి. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు (వెయిటేజ్ 4%) అసలు పెరక్కపోగా -6.18% క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఇక దాదాపు 15% వాటావున్న ఇంధనం- విద్యుత్ విభాగంలో ధరలు సైతం వార్షికంగా అసలు పెరక్కపోగా -13.03% క్షీణించాయి. సూచీలో 65 % వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు (కోర్ విభాగం) సైతం అసలు పెరక్కపోగా క్షీణతలో -0.52 శాతంగా ఉన్నాయి. ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరలు.. వార్షికంగా చూస్తే... 2015 ఏప్రిల్లో బంగాళ దుంప ధరలు 41.14% తగ్గాయి. కూరగాయల టోకు బాస్కెట్ ధరలు అసలు పెరక్కపోగా స్వల్పంగా 1.32% తగ్గాయి. బియ్యం ధరలు స్వల్పంగా 0.04% ఎగశాయి. ఉల్లి ధర 29.97% పెరిగింది. పప్పు దినుసులు (15.38%), పండ్లు (14.22%), పాలు (7.42%) వంటి ఆహార ఉత్పత్తుల సైతం ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి. వ్యవస్థలో డిమాండ్ వృద్ధికి బ్యాంకింగ్ రుణ రేటు కోత మరింత తప్పదని పరిశ్రమ చాంబర్లు డిమాం డ్ చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రానున్న సమీక్షలో(జూన్ 2న) మరోదఫా రెపో రేటును తగ్గించాలని కోరాయి. -
‘మైనస్’లోనే టోకు ధరలు
- 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో ధరలు డౌన్ - మైనస్ 2.06 శాతంగా నమోదు - తదుపరి రేట్ల కోతపై పరిశ్రమల ఆశలు న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014 ఫిబ్రవరితో పోల్చితే, 2015 ఫిబ్రవరిలో (వార్షికంగా) టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అసలు పెరక్కపోగా క్షీణతలోకి జారింది. మైనస్ (-)2.06 శాతంగా నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయిలో ఈ రేటు నమోదుకావడం 40 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా నాలుగు నెలల నుంచీ ఇదే ధోరణి కొనసాగుతున్నట్లయ్యింది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. నవంబర్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం -0.17%. డిసెంబర్లో ఈ రేటు -0.50%. జనవరిలో -0.39%. 2014 ఫిబ్రవరిలో ఈ రేటు 5.03 %. సామాన్యునికి భారమే..: ముఖ్యంగా సామాన్యునికి సంబంధించినంతవరకూ ఆహార ఉత్పత్తుల ధరల బాస్కెట్ వార్షిక సూచీ పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఈ రేటు వార్షికంగా 7.74 శాతంగా ఉంది. ఈ బాస్కెట్లో ప్రధాన ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే... కూరగాయల ధరలు వార్షికంగా 15.54%పెరిగాయి. జనవరిలో ఈ పెరుగుదల రేటు 19.74%. తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు మళ్లీ ఆశగా ఆర్బీఐ వైపు దృష్టి సారించడం ప్రారంభించాయి. కీలక రెపో రేటును మరో దఫా తగ్గించాలని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.


