breaking news
Bangladesh ODI series
-
సన్రైజర్స్కు షాక్.. కీలక ఆటగాడికి గాయం..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతూ, బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించడంతో సన్రైజర్స్ యాజమాన్యంలో గుబులు మొదలైంది. గడిచిన కొన్ని సీజన్లుగా సన్రైజర్స్ తరఫున కీలక ఆటగాడిగా రాణిస్తున్న విలియమ్సన్ గాయం కారణంగా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని యాజమాన్యం భావిస్తోంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్ల నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్గా ఉండటం తమకెంతో ముఖ్యమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కివీస్ హెడ్ కోచ్ ప్రకటన నేపథ్యంలో విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీలక ఆటగాడు బెయిర్ స్టోలపై అదనపు భారం పడనుంది. -
ధోనిసేన ప్రాక్టీస్
కోహ్లి షాట్తో బంగర్ మోకాలికి దెబ్బ ఢాకా : బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా బంగ్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా.. మంగళవారం మధ్యాహ్నం ఎండ కాయడంతో టీమిండియా నాలుగు గంటల పాటు నెట్స్లో చెమటోడ్చింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు స్టేడియానికి వచ్చిన భారత్ జట్టు కాసేపు స్ట్రెచింగ్ చేసింది. తర్వాత నెట్ ప్రాక్టీస్తో పాటు ఫుట్బాల్ ఆడింది. ముందుగా స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్, జడేజాలు నెట్లో బ్యాటింగ్కు పదును పెట్టుకున్నారు. ఉమేశ్, మోహిత్, ధోని, కోహ్లిలు పేసర్ల నెట్స్ను ఉపయోగించుకున్నారు. ఓ 20 నిమిషాల ప్రాక్టీస్ తర్వాత బ్యాట్స్మెన్ అందరూ భారీ షాట్లకు ప్రయత్నించారు. కోహ్లి, రోహిత్, రహానే, ధావన్, ధోనిలు పేస్, స్పిన్ ఎదుర్కోవడంతో పాటు త్రోడౌన్స్నూ ప్రాక్టీస్ చేశారు. అయితే కోహ్లి కొట్టిన ఓ స్ట్రయిట్ డ్రైవ్.. త్రోడౌన్స్ చేస్తున్న సహాయక కోచ్ బంగర్ కుడి మోకాలిని బలంగా తాకింది. దీంతో ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ ఆపేసి బంగర్ దగ్గరకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బౌలింగ్ కోచ్ భరత్ త్రో డౌన్ బాధ్యతలు తీసుకున్నారు. కోహ్లి, ఉమేశ్, ధావన్, రైనాలు ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. బంగ్లాను తేలిగ్గా తీసుకోవడం లేదు: రైనా బంగ్లాదేశ్ జట్టును తామెంత మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని డాషింగ్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా స్పష్టం చేశాడు. ఈ కారణంతోనే మూడు వన్డేల సిరీస్కు పూర్తి స్థాయి జట్టుతో వచ్చామని చెప్పాడు. 2014, జూన్లో ఇక్కడ పర్యటించిన భారత జట్టులో ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అయితే అందులో ఏడుగురు ఇప్పుడు జట్టుతో పాటే ఉన్నారు. ‘ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో బంగ్లా అద్భుతంగా ఆడింది. అందుకే మేం దీన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాం. ప్రతీ మ్యాచ్నూ ఆస్వాదిస్తూ విజయం సాధించాలనుకుంటున్నాం’ అని రైనా తెలిపాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ మ్యాచ్కు రిజర్వ్ డేను కేటాయించారు.