breaking news
bakeries
-
తీవ్ర వాయుకాలుష్యం : 1,200 బేకరీలకు బీఎంసీ నోటీసులు
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక... ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు. నోటీసులకు మాత్రమే పరిమితం... బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. -
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
లాక్డౌన్: బేకరీలకు మినహాయింపు
బెంగళూరు : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిత్యావసర, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మినహాయింపును ఇచ్చారు. ఇక లాక్డౌన్తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆహార ప్రియులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ రాష్ట్రంలోని ఆహార ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. లాక్డౌన్ నుంచి బేకరీలకు మినహాయింపు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. బిస్కెట్లు, బ్రెడ్, స్వీట్లు తయారు చేసి సప్లయి చేస్తున్న బేకరీలు కొద్ది మంది సిబ్బందితో నాణ్యత ప్రమాణాలతో నడపాలని ఆదేశించినట్లు ప్రభుత్వ అధికారి రాజేంద్రకుమార్ కటారియా పేర్కొన్నారు. అదేవిధంగా బేకరీల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అయితే బేకరీల్లో డైనింగ్కు అనుమతి లేదని కేవలం పార్శిళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తయారీ మొత్తం పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించకపోతే ఆ బేకరీని వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇక ప్రజలకు ఆహార పదార్థాలు అందించే బేకరీలకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. అయితే వీటిపై పూర్తి నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. చదవండి: డాక్టర్లపై లాఠీఛార్జ్.. అరెస్ట్ లాక్డౌన్: ‘ఖైదీననే భావన కలుగుతోంది’ దేశం కోసం ఓ మంచి పని చేద్దాం -
మీల్స్ ఖాబో!
బెంగాలీ వంటకాలపై పలు సంస్కృతుల ప్రభావం కనిపిస్తుంది. పదమూడో శతాబ్దిలో టర్కీ రాజులు,ఆ తర్వాత బ్రిటిషర్ల పాలన, యూదుల ప్రభావంతో వెలసిన బేకరీలు, మార్వాడీ వర్తకుల మిఠాయి దుకాణాలు, టిప్పుసుల్తాన్ హయాంలో పరిచయమైన మొఘలాయి రుచులు... ఇవన్నీ బెంగాలీ వంటకాల వైవిధ్యానికి కారణమే. వెరసి ఉప్పుకారాలు తక్కువ. మృదువైన తీపి ఘుమఘుమలే ఎక్కువ. ఇంటికొచ్చిన అతిథులను ‘మీల్స్ ఖాబో’ అంటూ ఆప్యాయంగా ఆదరించే సంస్కారం బెంగాలీ ‘భద్రలోక్’ది. మిష్టి దోయి దీనిని స్వీట్ కర్డ్ అని కూడా అంటారు. బెంగాలీయుల ఇంటికి వెళితే ముందుగా మిష్టిదోయ్తో ఆతిథ్యం ఇస్తారు. కావల్సినవి: వెన్నతీయని పాలు - లీటరు పంచదార - 250 గ్రాములు యాలకుల పొడి - 20 గ్రాములు పెరుగు - 50 గ్రాములు తయారీ: పాలను బాగా మరగకాచి, అందులో పంచదార వేసి కలపాలి. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు (వీలైతే మట్టి కుండను వాడుకోవచ్చు) అందులో పెరుగు వేసి కలిపి, మూతపెట్టి, రాత్రంతా కదపకుండా అలాగే ఉంచాలి. ఈ పెరుగును ఫ్రిజ్లో పెట్టి, అతిథులు వచ్చినప్పుడు చల్లగా అందించాలి. బెయింజా భొజ్జా వంకాయలతో చేసే ఈ స్నాక్ను బెంగాలీయులు బాగా ఇష్టపడతారు. కావల్సినవి: వంకాయ ముక్కలు (చక్రాల్లా తరగాలి) - 200 గ్రాములు నల్లజీలకర్ర(కలోంజి) - టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ ఉప్పు - తగినంత పసుపు - పావు టీ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత తయారీ:నల్లజీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వంకాయ ముక్కలను కలిపి, కాసేపు పక్కన ఉంచాలి. కడాయిలో నూనె వేసి, కాగాక వంకాయ ముక్కలను వేసి రెండు వైపులా వేయించుకోవాలి. వేడి వేడిగా వడ్డించాలి. మాఛెర్ ఝోల్ బెంగాలీలు వంటకాలలో చేపలను విరివిగా వాడుతుంటారు. చేపల వంట తయారీలో ఎన్నో వెరైటీలను మనం చూడొచ్చు. ఆవనూనెతో వండే చేపల కూర ఇది. కావల్సినవి: ఆవనూనె - 100 గ్రాములు; ఆవ ముద్ద - 3 టీ స్పూన్లు బంగాళదుంప ముక్కలు - 250 గ్రాములు; కారం - 4 టీ స్పూన్లు వేయించిన జీలకర్ర (పొడి చేసినది) - 2 టీ స్పూన్లు చేప ముక్కలు (బొచ్చెలు) - 250 గ్రాములు; ఉప్పు - రుచికి తగినంత ఉల్లిపాయ తరుగు - 100 గ్రాములు; టొమాటో తరుగు - 100 గ్రాములు అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ నోట్: రుచిని బట్టి పదార్థాలలో కొద్దిపాటి మార్పులు చేసుకోవచ్చు. తయారీ: శుభ్రపరచిన చేపముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటికి ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆవ ముద్ద వేసి రెండు వైపులా ముక్కలకు బాగా పట్టేలా కలిపి పక్కనుంచాలి.గిన్నెలో నూనె వేసి వేడయ్యాక, ముందుగా ఉల్లిపాయ ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి 2 -3 నిమిషాలు వేయించాలి. వేగిన ఉల్లిపాయ, టొమాటోలో బంగాళదుంప ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, అర కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల సేపు ఉడికించాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. {Vేవీ చిక్కగా అయ్యాక అందులో చేప ముక్కలను వేసి, 10 నిమిషాలు ఉడికించాలి. మసాలా కూడా గ్రేవీలో కలిసిపోయి కూర మంచి వాసన వస్తోండగా మంట తీసేయాలి వేడి వేడిగా అన్నం లేదా రోటీతో ఈ చేపల కూర తింటే ఎంతో రుచిగా ఉంటుంది. చోలార్ దాల్ ఇది శనగపప్పు కూర. బెంగాలీలు తీపిని బాగా ఇష్టపడతారు. అందుకే అన్ని వంటకాలలోనూ పంచదారను విరివిగా వాడుతారు. పప్పులో పంచదార నచ్చనివారు దానిని మినహాయించుకోవచ్చు. కావల్సినవి: శనగపప్పు (నీళ్లలో నానబెట్టాలి) - 100 గ్రాములు పంచదార - 3 టీ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూన్ గరం మసాలా దినుసులు (లవంగాలు-4, యాలకులు-2, మిరియాలు-6, జాజికాయ-చిన్నముక్క, బిర్యానీ ఆకులు -2) - టీ స్పూన్; ఇంగువ - చిటికెడు; పచ్చికొబ్బరి తురుము - 100 గ్రాములు; నెయ్యి - 50 గ్రాములు అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత పచ్చిమిర్చి - 5 (పెద్దవి); ఎండుమిర్చి - 2 (పెద్దవి) తయారీ: {పెషర్ కుకర్లో నూనె వేసి, మసాలా దినుసులను వేసి వేగనివ్వాలి.నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి కుకర్లో వేసి, కలిపి, సన్నని మంట మీద ఉడకనివ్వాలి.విడిగా చిన్న కడాయి పెట్టి, నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలపాలి.ఈ పోపు మిశ్రమాన్ని ఉడుకుతున్న శనగపప్పులో కలిపి అందులోనే పంచదార, మరికాస్త కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. శనగపప్పు త్వరగా ఉడకాలంటే మూత పెట్టి మూడు విజిల్స్వరకు ఉంచవచ్చు. పప్పు ఉడికాక మంట తీసేసి, కిందకు దించుకోవాలి.ఈ శనగపప్పు కూరను వేడి వేడిగా అన్నంలోకి, రోటీలోకి బాగుంటుంది. మాల్పువా ఇది వెస్ట్ బెంగాల్, రాజస్థానీయులు ఈ వంటకాన్ని విరివిగా చేసుకుంటారు. కావల్సినవి: మైదా - ఒక కప్పు పాలు - అర కప్పు పచ్చి కోవా - పావు కప్పు యాలకుల పొడి - టీ స్పూన్ తరిగిన బాదం - కొద్దిగా వంటసోడా - చిటికెడు పంచదార - అర కప్పు నీళ్లు -కప్పు; నెయ్యి లేదా నూనె - వేయించడానికి తగినంత బాదం, పిస్తాపప్పు తరుగు - టీ స్పూన్ తయారీ:ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి చిక్కటి మిశ్రమం (గులాబ్జామూన్ పాకంలా) అయ్యేంతవరకు మరిగించాలి. దీంట్లో యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని పక్కన ఉంచుకోవాలి. కావాలనుకుంటే ఇందులో చిటికెడు కుంకుమపువ్వు కూడా కలుపుకోవచ్చు.మరొక పాత్రలో మైదా, వంటసోడా, కోవా, పాలు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి.కడాయిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి.మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా (మందంగా) వత్తుకుని కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి. (పెనం మీద నెయ్యి వేసుకొని కూడా ఎర్రగా కాల్చుకోవచ్చు.)ఇలా తయారుచేసుకున్నవాటిని పంచదార పాకంలో ముంచి, ప్లేటులోకి తీసుకోవాలి.వీటి మీద సన్నగా తరిగిన బాదం, పిస్తాపప్పును అలంకరించి, వడ్డించాలి. ఆలూ పోస్తో కావల్సినవి: తొక్కతీసిన బంగాళదుంప ముక్కలు - 250 గ్రాములు ఆవాలు - టీ స్పూన్; గసగసాలు - టీ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; ధనియాలు - 2 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు - 50 గ్రాములు; నూనె - 2 టేబుల్ స్పూన్ పసుపు - చిటికెడు; ఎండుమిర్చి - 2 పెద్దవి; ఉప్పు - తగినంత తయారీ: కడాయిలో ఆవాలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి, పొడిగొట్టి, ముద్ద చేసి పక్కన ఉంచుకోవాలి.అదే కడాయిలో నూనె వేసి, ఎండుమిర్చి, గసగసాల ముద్ద, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసి, కప్పు నీళ్లు పోసి గ్రేవీ చిక్కగా అయ్యేంతవరకు ఉడికించాలి.దించేముందు అన్నీ సరిపడా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. దీనిని అన్నం, రోటీలోకి వడ్డించాలి. సందేశ్ బెంగాలీలు పాలతో తయారుచేసిన తీపి పదార్థాలను అమితంగా ఇష్టపడతారు. వాటిలో ముఖ్యమైనది సందేశ్. కావల్సినవి: వెన్నతీయని పాలు - లీటరు; పిస్తాపప్పు - 20గ్రాములు నిమ్మరసం - టేబుల్ స్పూన్; పంచదార - 100 గ్రాములు నెయ్యి - 10 గ్రాములు; యాలకుల పొడి - 20 గ్రాములు తయారి: పాలు బాగా మరుగుతుండగా అందులో నిమ్మరసం కలపాలి. దీంతో పాలు విరిగిపోతాయి.విరిగిన పాలను టీ జల్లిలో లేదా పలచటి వస్త్రంలో పోస్తూ వడకట్టుకోవాలి. గడ్డకట్టిన మిశ్రమాన్ని తీసి, పక్కన పెట్టుకోవాలి.కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో గడ్డకట్టిన పాల మిశ్రమాన్ని, పంచదారను వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. పంచదార అంతా కరిగి, మిశ్రమం మరికాస్త గట్టిపడ్డాక దించుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా మిశ్రమాన్ని తీసుకొని బిళ్లలుగా వత్తుకోవాలి. ఇలా తయారుచేసుకున్నవాటిపై పిస్తాపప్పుతో అలంకరించి, అందించాలి. -
అరె కరెంటు రాదే !
సాక్షి,సిటీబ్యూరో: ఓ వైపు ఉక్కపోత..మరోవైపు ఇష్టానుసారం కరెంటు తీస్తుండడంతో గత కొద్దిరోజులుగా నగరవాసులు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో అధికారిక విద్యుత్తు కోతలు లేనప్పటికీ...ఎమర్జెన్సీ లోడ్రిలీఫ్ పేరుతో పగలు,రాత్రి తేడాలేకుండా కరెంటు తీస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా కోర్సిటీలో మూడుగంటలు, శివారులో నాలుగు నుంచి ఐదుగంటలపాటు సరఫరా నిలిపివేస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సలు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఉందని వాపోతున్నారు. కోతలతో గృహాలు..వాణిజ్య సముదాయాలు..పరిశ్రమలే కాదు...ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, సినిమాహాళ్లు, పెట్రోలుబంకులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఐస్క్రీమ్పార్లర్లు, బేకరీలు, చివరకు సెలూన్లు కూడా ఢ‘మాల్’అంటున్నాయి. కోతల వల్ల మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్ల ఆదాయానికి గండిపడుతోంది. ఈసేవా కేంద్రాల్లో కరెంట్ లేకపోవడంతో సర్కారుకు వచ్చే ఆదాయం ఆలస్యమవుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతుండగా, బ్యాంకుల్లో సేవలు స్తంభించిపోతున్నాయి. కోతల వల్ల డీజిల్, పెట్రోలు అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. డిమాండ్కు సరఫరాకు మధ్య భారీ వత్యాసం ఉంటుండడంతో కరెంటు కోతలు అనివార్యమవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటంతో సబ్స్టేషన్లపై భారం పడకుండా ఉండేందుకు ఎమర్జెన్సీలోడ్ రిలీఫ్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు కరెంటు తీసేస్తున్నారు. పరిశ్రమలకు వాత: ప్రస్తుతం గ్రేటర్లోని పరిశ్రమలకు పవర్హాలీడే అమల్లో లేకున్నా కాటేదాన్, గగన్పహాడ్ పారిశ్రామికవాడల్లో 12 గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఉత్పత్తి నిలిచి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.