breaking news
autorickshaw driver
-
హీరోయిన్తో ఆటోడ్రైవర్ దురుసు ప్రవర్తన!
ఓ ఆటోడ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించాడంటూ బాలీవుడ్ హీరోయిన్ షమీమ్ అక్బర్(Shamim Akbar Alli) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు ముందే తనను అసభ్యపదజాలంతో దూషించాడని..అంతేకాకుండా నా చేయిపట్టుకొని గట్టిగా లాగాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. విచారణ చేపట్టారుఅసలేం జరిగింది?ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం..‘ఇన్ ది మంత్ ఆఫ్ జూలై’ ఫేం షమీమ్ అక్బర్ అల్లీ(32)కి ఐదేళ్ల కూతురు ఉంది. ఈ నెల 1న తన కూతురుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ముంబైలోని మైరా రోడ్లో ఉన్న తన నివాసం ముందు ఆటోని ఆపింది. మధ్యాహ్నం 2.45 గంటల సమీపంలో ఆమె ఆటో ఎక్కి స్కూల్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆటో ఆపమని చెప్పగానే..అప్పటికే చిరాకుగా ఉన్న డ్రైవర్..ఇక్కడ ఎందుకు ఆపావని ఆమెపై ఫైర్ అయ్యాడు. తనకు అర్జెంట్ పని ఉందని.. వెంటనే కిరాయి ఇవ్వమని డిమాండ్ చేశాడు. ఆమె మాత్రం డబ్బులు ఇవ్వకుండా..స్కూల్లో ఉన్న తన కూతురుని తీసుకొని మళ్లీ అదే ఆటో ఎక్కి ఇంటివద్ద డ్రాప్ చేయమని చెప్పింది. ఇంటి గేట్ వద్దకు చేరుకోగానే..ఆమె కూతురు ఫౌంటేన్ ఏరియా చుట్టు ఒక రౌండ్ తిరగమని కోరింది. అయితే అప్పటికే డ్రైవర్ కోపంగా ఉండడంతో.. ‘మనం వేరే ఆటోలో వెళదాం లే’ అంటూ చిన్నారిని తీసుకొని హీరోయిన్ దిగబోయింది. డ్రైవర్ ఒక్కసారిగా ఆమెపై గట్టిగా అరిచాడు. వెనక్కి తిరిగి దిగబోతున్న హీరోయిన్ చేయిని పట్టుకొని గట్టిగా లాగాడు. కూతురు ముందే తనపై దుర్భాషలాడాడు.డ్రైవర్ కోసం గాలింపు!సదరు డ్రైవర్పై నటి సీరియస్ అవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం ఆమె కాశీమీరా పోలీసు స్టేషన్లో ఆ డ్రైవర్పై ఫిర్యాదు చేసింది. తన కూతురు ముందే తనతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా డ్రైవర్ వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని..త్వరలోనే డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులువెల్లడించారు. నటి షమీమ్ అక్బర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు. View this post on Instagram A post shared by Shamim Akbarali (@officialshamimakbarali) -
శతమారథానుడు
మంగళూరుకు చెందిన మాధవ్ సరిపెల్ల ఆటోరిక్షా డ్రైవర్. 68 సంవత్సరాల మాధవ్ ఇప్పటికీ మారథాన్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు 100 మారథాన్లు పూర్తి చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాధవ్ కుమారుడు ధనరాజ్ ప్రతిభావంతుడైన స్కేటర్. ఎన్నో పతకాలు గెల్చుకున్నాడు. చైనాలో జరిగిన పోటీలో పాల్గొన్న మాధవ్ తీవ్రంగా గాయపడి ఆటలకు దూరం అయ్యాడు.‘నాన్నా, నేను ఆటలకు దూరం అయ్యాను. నువ్వు దగ్గర కావాలి’ అని ధనరాజ్ అడిగాడో లేదో కానీ కేవలం కుమారుడి కళ్లలో వెలుగు చూడడానికే మారథాన్లలో పాల్గొనేవాడు మాధవ్. తండ్రి పతకం గెల్చుకున్నప్పుడల్లా తానే గెలిచినంతగా సంతోషించేవాడు కుమారుడు.తాజా విషయానికి వస్తే... ఈ నెల 9న జరిగే ‘మంగళూరు మారథాన్ 2025’ కోసం సాధన చేస్తున్నాడు మాధవ్. ‘ఆటో నడపడం తప్పనిసరి కాబట్టి ప్రాక్టీసింగ్ కు నాకు పెద్దగా సమయం దొరకదు. అయినప్పటికీ వారానికి మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను. 2.45 గంటల్లో 20 కిలోమీటర్లకు పైగా పరుగెత్తాను’ అంటున్నాడు మాధవ్. మాధవ్ బతుకు బండి భారంగానే కదులుతోంది. కుమార్తె నందిని దివ్యాంగురాలు. తన ఇంట్లో కొంత భాగం కూలిపోయింది... కష్టాల సంగతి ఎలా ఉన్నా మారథాన్లో పాల్గొనడం అంటే తనకు ఇష్టం. ఎందుకంటే తనను పోటీల్లో చూడడం, విజేతగా చూడడం కుమారుడికి ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి! -
ఆటోడ్రైవర్ సాహసం
వడోదర: మృత్యుకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న యువకుడిని గుజరాత్ లో ఓ ఆటోడ్రైవర్ అత్యంత సాహసంతో రక్షించాడు. వడోదరాకు చెందిన ఆటోడ్రైవర్ గనిభాయ్ మహమ్మద్ షేక్ (52) మొసలి నోట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ముఖేష్ శుక్లాను సమయస్ఫూర్తిగా రక్షించి రియల్ హీరోగా నిలిచాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ముఖేష్ (17) స్థానిక విశ్వామిత్ర నదిలో పడిపోయాడు. నదిలో ఉన్న మొసలి అతగాణ్ని దొరకబుచ్చుకుంది. యువకుడి ఎడమ చేయి దాని కోరల్లో చిక్కుకుని నలిగిపోతోంది.. ముఖేష్ బాధతో విలవిల్లాడుతూ సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. చుట్టు గుమిగూడిన జనం రాళ్లు, కర్రలతో మొసలిని కొడుతూ ఆ యువకుడిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దారిన పోతున్న మహమ్మద్ షేక్... అరుపులు, కేకలు విని ఆక్కడకు చేరాడు. మృత్యువుతో పోరాడుతున్న యువకుడ్ని చూశాడు. అంతే పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర నుంచి ఒక ఇనుప రాడ్ తెచ్చి మొసలిని కొట్టడం మొదలు పెట్టాడు. మొసలి తోక ముడిచేదాకా తన ప్రయత్నాన్ని ఆపలేదు. దాదాపు 15-20 నిమిషాల తరువాత యువకుడి చేతిని వదిలి పెట్టి మొసలి నీళ్లలోకి జారుకుంది. బాధితుడిని ఒడ్డుకు చేర్చిన జనం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అటవీ అధికారి పీబీ చవాన్ తెలిపారు. బాధితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అసలు నదిలో అతను ఎలా పడ్డాడో విచారిస్తున్నామని తెలిపారు. అయితే బ్రిడ్జిపై నుంచి ఆ యువకుడే నదిలో దూకినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. మరోవైపు ఈ నదిలో దాదాపు 100- 200 మొసళ్లు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.


