breaking news
attempted theft
-
బ్యాంకులో చోరీ యత్నం.. నిందితుడు 7వ తరగతి విద్యార్థి!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్లో బుధవారం రాత్రి జరిగిన చోరీ యత్నం ఘటనలో ఏడో తరగతి విద్యార్థి సీసీ కెమెరాకు చిక్క డం ఆసక్తిగా మారింది. నిత్యం జనసంచారం.. రహదారికి ప క్కన ఉండే బ్యాంకు ఆవరణలోకి రాత్రి 8.20 గంటలకే బా లుడు రావడం చూస్తుంటే ఎవరైనా డైరెక్షన్ ఇస్తే యాక్షన్లోకి దిగాడా లేక స్వతహాగానే వచ్చాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బయ్యారం–పందిపంపుల రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఆవరణలోకి బయ్యారంలో నివాసం ఉంటున్న ఇర్సులాపురానికి చెందిన 13 సంవత్సరాల బాలు డు గడ్డపారతో వెళ్లాడు. వెనుకవైపు గ్రిల్స్తో ఉన్న తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించాడు. బ్యాంకులో పల ఉన్న డెస్్కల్లో డబ్బులు, నగలు ఉంటాయేమోనని గంటపా టు వెతికి ఆ తరువాత బయటకు వెళ్లినట్టు సీసీ కెమెరాల ఫు టేజీని బట్టి తెలుస్తోంది. గురువారం ఉదయం బ్యాంకు వద్ద కు స్వీపర్ పద్మ వచ్చింది. తాళం పగులకొట్టిన విషయాన్ని అధికారులకు తెలిపింది. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడితో సాధ్యమేనా?: కట్టుదిట్టమైన భద్రతమధ్య ఉండే బ్యాంకులోకి 13 సంవత్సరాల బాలుడు ఇతరుల ప్రమేయం లేకుండా చోరీకి యత్నించడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. గడ్డపారతో తాళం పగులకొట్టడం కష్టమని, బాలుడు సునాయాసంగా ఎలాంటి చప్పుడు లేకుండా ఎలా పగులకొట్టాడని, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి చేయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెదిరింపులతోనే చేశా..: దొంగతనాల్లో అనుభవం ఉన్న ఓ పాత నేరస్తుడు చోరీకి యత్నించిన బాలుడికి ఇటీవల పరిచయం అయినట్టు తెలుస్తుంది. ఆ పరిచయం ఆధారంగా బాలుడిని మచ్చిక చేసుకున్న పాత నేరస్తుడు బ్యాంకు దొంగతనం చేయాలని బెదిరించినట్టు బాలుడు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం. వెనుక నుంచి బ్యాంకు గోడపైకి ఎక్కించి, తను బయటకు వచ్చే వరకు ఆ పాతనేరస్తుడు అక్కడే ఉన్నాడని, ఆ తరువాత ఇద్దరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లినట్టు బాలుడు చెప్పినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న గార్ల–బయ్యారం సీఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి బ్యాంకు పరిసరాలతోపాటు బ్యాంకులో రికార్డయిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. చోరీకి యతి్నంచిన బాలుడి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ఇర్సులాపురంలో అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. -
మహిళలే టార్గెట్: తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ..
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పూజల పేరుతో మాయమాటలు చెప్పి ఓ ఇంట్లో బంగారు వస్తువులు కాజేపే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సంఘటన శుక్రవారం కొలిమిగుండ్ల లో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా దొంగల్లో ఒక రు ఊర్లో తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నారు. ఈ కోవలోనే పెద్దమ్మ ఆలయం సమీ పంలోని వీధిలో నివాసముండే శ్రావణితో చిత్తూరు లక్ష్మి అనే దొంగ ఇంట్లోకి వెళ్లి పూజలు చేస్తే నీభర్త ఆరోగ్యం బాగుపడుతుంది. అంతా శుభం జరుగు తుందని పూజల పేరుతో మరొక మహిళ ఇంట్లోకి చేరింది. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) వారి మాటలు నమ్మి పూజకు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బంగారు కూడా పెట్టాలని చెప్పడంతో నమ్మి అక్కడే ఉంచింది. ఆమె దృష్టి మరల్చి రోల్డ్గోల్డ్ వస్తువులను పెట్టి అసలు వస్తువులను బ్యాగులో వేసుకుంది. అక్కడి నుంచి బయట పడేందుకు కిలాడీ లేడి ఇంకో చోట పూజ చేయాలి త్వరగా వస్తానని ప్రధాన రహదారిపైకి చేరి కానిస్టేబుల్ సుబ్బరాయుడు మఫ్టీలో బైక్లో వెళ్తుండడంతో ఆపి ఎక్కింది. బాధితురాలు శ్రావణి పక్కింట్లో ఉండే మరో మహిళ బంగారు తీసుకెళుతోందని కేకలు వేయడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ బైక్ను వెనక్కి తిప్పి పోలీస్స్టేషన్కు తీసుకెళ్తుండగా ఏటీఎం వద్దకు రాగానే కిందకు దూకే ప్రయత్నం చేసింది. అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.(చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) -
తాళం పగులగొట్టి చోరీకి యత్నం
సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి క్రాంతినగర్ కాలనీలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. రోడ్డు నంబర్-4లోని తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఇంట్లో ఉండే యువకులు సొంతూళ్లకు వెళ్లారని, నష్టంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.