breaking news
Architecture of Heritage
-
ఆమెకు 20 చేతులు ఐదు తలలు..!
సాక్షి, మంచిర్యాల: తెలంగాణ కొత్త చరిత్ర పరిశోధన బృందం ఇన్నాళ్లు మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలో పురాతన ఆలయ గొప్పతనాన్ని గుర్తించారు. చాళుక్యుల (6–12శతాబ్దం) కాలం నాటి అద్బుతమైన ప్రాచీన దేవాలయ విశిష్టతను తెలియ జేస్తున్నారు. ఇక్కడి విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కనబరుస్తున్నాయి. ఆలయం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాంకిడిలోని గుడిలో కొలువై ఉన్న ప్రధాన దేవత మహా మాత ఎల్లమ్మ. ఈ దేవతా శిల్పాన్ని పరిశీలిస్తే... ఉమాలింగనమూర్తి శిల్పంలో ఉన్నట్టే సుఖాసనంలో కూర్చుని ఉంది. ఆమెకు 20 చేతులున్నాయి. తల మీద తల ఐదు తలలున్నాయి. (చదవండి: పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం) ఆలయంలోని పూరతన విగ్రహాలు ఇద్దరికి కింద వాహనంగా రెండు చేతులు, కాళ్లు నేల మీద మోపి వంగి వున్న రాక్షసుడున్నాడు. ఈ గుడిలో సప్తాశ్వరథారుఢుడైన ఆదిత్య శిల్పం మనోహరం, సర్వాంగ సుందరంగా తోరణాదులతో హళేబీడు శిల్ప శైలిలో ఉంది. ఖజురహోలోని సూర్య శిల్పాన్ని పోలి వుంది. గర్బగుడి ద్వారం చాళుక్య పూర్వ శైలిలో కవాట పద్దతిలో కడప, శేరెల మీద స్తంభోప స్తంభాలున్నాయి. ఉత్తరాశి మీద ప్రస్తరం ఉంది. లలాటబింబంగా గణపతి ఉన్నాడు. గర్బగుడిలో క్షితిజసమాంతరంగా ఉన్న వర్తులాకార పానపట్టంలో సమతల శివలింగం ప్రతిష్టించబడి ఉంది. ఇది చాళుక్య శైలి లింగం. ఈ దేవాలయం కాలాముఖ శైవులది. ఇక్కడ శాక్తేయమతం కూడా ఉందని శిల్పాల వల్ల తెలుస్తున్నది. ఇటువంటి శిల్పాలున్న దేవాలయం తెలంగాణలోనే చాలా అరుదు. మధ్య భారత దేవాలయ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన గుడి ఇది. ఈ వివరాలన్నీ యువ పరిశోధకుడు సముద్రాల సునీల్ వెలుగులోనికి తెచ్చాడు. (చదవండి: మీకు తెలుసా? పోలింగ్ సమయంలో ‘సెక్షన్ 49పీ’ అంటే ఏంటో) ఆలయ అభిముఖం గుడిలోని విడి శిల్పాలు... లోహకారుల దేవత మహామాయ ( శిల్పం మీద పేరు చెక్కి ఉంది ) శాంకరి, చాముండ ఉమాలింగనమూర్తి (ఈ శిల్పం మీద దేవాలయ నిర్మాత రాజు ప్రతిమ ఉంది). లక్ష్మీ నారాయణ స్వామి, అనంతశయనుడు, గరుత్మంతుడు, త్రై పురుష మూర్తి, విష్ణువు, పాశుపతయోగులు, భైరవులు, వీర భద్రులు, గణపతి ప్రతిమలున్నాయి. ఇందులో కొన్ని చాళుక్య శైలి శిల్పాలు, గుడి బయట వీరగల్లులున్నాయి. ఆలయంలోని పూరతన విగ్రహాలు గుడి జగతి మీద శిల్పాలు... వాంకిడి శివాలయం ఎత్తైన జగతి మీద నిర్మితమైంది. జగతి మీద గజధార, అశ్వధారలతో పాటు కొన్ని పౌరాణిక కథా దృశ్యాలు చెక్కి ఉన్నాయి. వాటిలో అశ్వ, గజసైన్యాలు, గజాల యుద్ద దృశ్యాలున్నాయి. పాశుపతయోగుల శిల్పాలున్నాయి. గోపికా వస్త్రాపహరణం, అశ్వమేథాశ్వం కొరకు వచ్చిన రామ సోదరులతో లవకుశులు యుద్ద దృశ్యం, పాండవులు, పెండ్లి, మంగళస్నానాలు, చతుష్పాద నటత్రయం (రామప్ప పూర్వ శిల్పం ), నాట్య కత్తె, సింహవ్యాళి, ఒక చోట ఇద్దరు పరిచారికల చేత సేవింపబడుతున్న శైవ గురువు సుఖాసనంలో కూర్చుని వున్నాడు. చివరలో ఇద్దరు అప్సరలు చేతులు పట్టుకొని కొనిపోతున్న వీరుడున్నాడు. ఇదొక ఆత్మాహుతి వీరగల్లు దృశ్యం. (చదవండి: తోబుట్టువులతో మేటర్ చెప్పిన యువతి.. ప్రియుడు మాట దాటవేస్తుండటంతో..) -
బయటపడ్డ పదో శతాబ్దం నాటి శిల్పాలు..ఎలా ఉన్నాయో తెలుసా?
సాక్షి, నార్సింగి(తూప్రాన్): మెదక్జిల్లా నార్సింగి మండల కేంద్రశివారులో శైవవీరగల్లు వీరుల రాతి శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ అన్నారు. నార్సింగి శివారులో రెండోరోజు పర్యటనలో భాగంగా గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటివిగా భావించే రాతిపై చెక్కిన శిల్పాలను గుర్తించామన్నారు. మూడు రకాల వీరగల్లుల శిల్పాలు ఉండగా, వాటిలో కత్తిని చేబట్టి చేతిలో ఫలం పట్టుకున్న ఆత్మాహుతి వీరగల్లు శిల్పం ముఖ్యమైందన్నారు. 10వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పాలు పెద్ద పెద్ద మీసాలతో భయంగొలిపే ముఖంతో ఉన్నాయని తెలిపారు. శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురిస్తామని చెప్పారు. క్షేత్ర పరిశోధనలో ఫొటోగ్రాఫర్ కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోట’లో ఆర్కిటెక్చర్ ఆఫ్ హెరిటేజ్ డెరైక్టర్
ఖిలావరంగల్ : చారిత్రక ఖిలావరంగల్ కోటను ఆర్కిటెక్చర్ ఆఫ్ హెరిటే జ్ (న్యూఢిల్లీ) డెరైక్టర్ దివాయి గుప్త మంగళవారం సాయంత్రం సందర్శించారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి కాకతీయులు శిల్ప సంపదను తిలకించారు. స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి శిల్పాల ప్రాంగణంలోని నాలుగు కీర్తితోరణాల మధ్య నల్లరాతి శిల్పకళాకృతులు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియూడారు. అనంతరం ఏకశిల గుట్ట, ఖుషిమహల్ రాతి, మట్టికోట ఆందాలను కెమెరాల్లో బంధించారు.వారి వెంట ఇంటాక్ కన్వీనర్, ఫ్రొఫెసర్ పాండురంగారావు, ‘కుడా’ ఈఈ అజీత్రెడ్డి, డీఈ బీమారావు, శంకర్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు ఉన్నారు.