-
8వ తరగతి ప్రేమ.. బాలిక తిరస్కరించిందని ఆమె ఇంట్లోనే..?
పట్నంబజారు (గుంటూరు జిల్లా): చెడు వ్యసనాలకు బానిసగా మారిన బాలుడు ఓ బాలికను ప్రేమించాడు. ఆ యువతి తిరస్కరించడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరండల్పేట పోలీసుల వివరాల ప్రకారం... బొంగరాలబీడు 1వ లైనుకు చెందిన నల్లమోతు ఆంథోనిబాబు (15) వసంతరాయపురంలోని మెయిన్రోడ్డులో ఉన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆంథోనికి గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో వరసకు మరదలయ్యే నిరుపేదల కాలనీలో నివసించే ఆమె స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. ప్రేమించమని అడగడంతో ఆ బాలిక తిరస్కరించింది. దీంతో ఆంథోనిబాబు మస్తాపానికి గురై మంగళవారం నిరుపేదల కాలనీలోని మరదలు నివాసంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీబీఎన్ ఆర్మీ దుర్మార్గం:ఎంపీ విజయసాయిపై అసభ్య వీడియోలు
పట్నంబజారు (గుంటూరు): రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో పలు వీడియోలు అప్లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుంటూరు అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎంపీపై యూట్యూబ్లో సీబీఎన్ ఆర్మీ అనే చానల్ ద్వారా వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా పలు అసభ్యకర పోస్టింగ్లు వచ్చాయి. వీటిని చూసిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా గంటావారిపాలెంకు చెందిన మద్దినేని వెంకట మహేష్బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను టీడీపీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అతనితో పాటు మచిలీపట్నానికి చెందిన ముల్పూరి శ్రీసాయికళ్యాణ్ కలిసి ఎంపీపై అసభ్యకర దూషణలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. దర్యాప్తులో సాంకేతికంగా ఈ వివరాలు సేకరించిన పోలీసు సిబ్బంది వారిని చంద్రమౌళినగర్లో అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. -
ఉలికిపాటు !
- వినుకొండలో కూలిన నాలుగు అంతస్తుల భవనం - ప్రమాణాలు పాటించకపోవటమే లోపం - గుంటూరులో 30కు పైగా శిథిలావస్థకు చేరిన భవనాలు - కూలే దశలో పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్ అరండల్పేట (గుంటూరు): వినుకొండ కుమ్మరిబజారులో పిల్లర్లు లేకుండా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. రెండేళ్ల క్రితం పాత గుంటూరులో భవనం నిర్మిస్తున్న సమయంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు. మారుతీనగర్లో ఓ ఇంటి నిర్మాణ సమయంలోనే పూర్తిగా కూలిపోయి ఇద్దరు మృతి చెందారు. తాజాగా వినుకొండలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పాటు అను భవం లేని ఇంజినీర్లు భవనాలు నిర్మిస్తుండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, గుంటూరులో సాక్షాత్తూ నగరపాలక సంస్థకు చెందిన పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్లు కూలే దశలో ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శిథిలావస్థకు చేరిన 30 భవనాలు ... గుంటూరులో శిథిలావస్థకు చేరిన భవనాలు 30కు పైగా ఉన్నాయి. ప్రధానంగా లాలాపేట, గుంటూరువారితోట, పట్నం బజారు, పాతగుంటూరు, మారుతీనగర్, తదితర ప్రాంతాల్లో ఈ భవనాలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రణాళికాధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటితే ఒకసారి అధికారులు వాటిని పరిశీలించాలి. వందేళ్లు దాటిన భవనాలకు మాత్రం నోటీసులు జారీచేసి వాటిని కూల్చివేయాలి. గుంటూరులో ఇటీవల భవన నిర్మాణాలు అధికమయ్యాయి. ప్రతి నెలా 60కు పైగా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేవలం ప్లాను మంజూరు చేయడంతోనే తమ పనిపూర్తయిందని భావిస్తున్నారు. ఆ భవన నిర్మాణం ఎలా జరుగుతోంది. ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా,ఇంజినీరు శక్తిసామర్థ్యాలు, బిల్డర్ తీసుకుంటున్న జాగ్రత్తలు, పక్కనే ఉన్న భవనాలకు ఏమైనా నష్టం వాటిల్లుతుందా.. ప్లానుకు అనుగుణంగా పని జరుగుతుందా లేదా ఇలాంటి అంశాలను సంబంధిత బిల్డింగ్ ఇన్స్పెక్టరు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఇవేమీ నగరంలో జరుగుతున్న దాఖలాలు లేవు. ఒక్కోసారి నిర్మాణాలు జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న భవన యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. జీఎంసీ భవనాలకూ దిక్కులేదు.. నగరంలో భవనాలను పర్యవేక్షించాల్సిన నగరపాలక సంస్థ తన సొంత భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ ఎదురుగా పీవీకే నాయుడు మార్కెట్ గ్రౌండ్ఫ్లోర్లో 44 దుకాణాలు ఉన్నాయి. శ్లాబ్ మొత్తం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి ప్రజలపై పడుతున్నాయి. కోర్టుసైతం కార్పొ రేషన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చి పదిహేను రోజులకు పైగా అవుతున్నా కూల్చేందుకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా లాలాపేటలోని పండ్లమార్కెట్ ఇదే పరిస్థితి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం ... నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలపై చర్యలు తీసుకుంటాం. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం. పీవీకే నాయుడు మార్కెట్, పండ్లమార్కెట్లను వెంటనే కూల్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - రవీందర్, ఏసీపీ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
బాబుకు గుర్తు గుబులు
హరీష్ రావు ఎమోషనల్
సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి
ఐపీఎల్లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం
చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్
‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది
MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
మే డే: ఫిలిం ఫెడరేషన్ ఆఫీసు వద్ద జెండా ఎగురవేసిన పరుచూరి గోపాలకృష్ణ (ఫొటోలు)
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
Advertisement