-
‘క్రెడిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ అలెర్ట్’
ఆర్బీఐ, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థలు (సెబీ) క్రెడిట్ కార్డ్, డీమ్యాట్ అకౌంట్లపై పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మార్పులు అమలు కానున్నాయి. వీటితో పాటు టోకనైజేషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల్లోని మారిన నిబంధనల గురించి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే లక్క్ష్యంగా ఆర్బీఐ ఈ ఏడాది జులై నుంచి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై ఎప్పుటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది. తాజాగా ఆర్బీఐ క్రెడిట్ కార్డుల జారీ అంశంలో కొత్త నిబంధనల్ని తెచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు.. లబ్ధి దారులకు కార్డు జారీ చేసే ముందు వారి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అనుమతి కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా పొందాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత కార్డు బ్లాక్ అవుతుంది. అలాగే వినియోగదారుడి అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు లిమిట్ను పెంచవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అటల్ పెన్షన్ యోజన పన్ను చెల్లింపు దారులు అక్టోబర్ 1 లోపు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరే అవకాశం ఉంది. అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత నుంచి చేరేందుకు అనర్హులని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఒకవేళ అక్టోబర్ 1 న ఏపీవైలో చేరితే ఆ ఖాతాను బ్లాక్ చేసి, డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతా దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెన్షన్ ఫండ్ రెగ్యూలరేటరీ అండ్ డెవలప్మెంట్ అథారటీ ( పీఎఫ్ఆర్డీఏ) ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్ స్కీమ్ ఖాతాదారులు చేసిన ఈ - నామినేషన్ను నోడల్ కార్యాలయం అధికారులు 30 రోజుల వ్యవధిలో యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే రిజక్ట్ చేయొచ్చు. 30 రోజులు పూర్తయిన అధికారులు స్పందించకపోతే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ( సీఆర్ఏ) సిస్టమ్లో ఆటోమేటిక్గా ఇ- నామినేషన్ ఆమోదం పొందుతుంది. డీ మ్యాట్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పని సరి. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్పై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఈ ఏడాది జూన్ 14న సర్క్యూలర్ను పాస్ చేసింది. ఆ సర్క్యూలర్ ప్రకారం.. డీ మ్యాట్ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ను సెప్టెంబర్ 30,2022లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అకౌంట్ను ఓపెన్ చేసేందుకు ఐడీ, పాస్వర్డ్తో పాటు బయో మెట్రిక్ అథంటికేషన్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. -
ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ!
ఏపీవై చందాదారులకు ఇవ్వాలంటున్న పీఎఫ్ఆర్డీఏ న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు/చందాదారులకు ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలని పీఎఫ్ఆర్డీఏ భావిస్తోంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ను ఎంచుకునే వెసులుబాటును కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే వారికి కల్పించాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ కోరుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడుల్లో 5 శాతం వరకూ అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. దీంట్లో 2 శాతం వరకూ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్కు చేరుతుందని వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement