-
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
అక్రమార్కుల ‘భాగ్య’ బంగారుపేటలో ఆరు ప్రైవేట్ రైస్ మిల్లులపై దాడి వేల బస్తాలు స్వాధీనం కోలారు :బంగారుపేటలోని ఆరు ప్రైవేట్ రైస్ మిల్లులపై దాడి చేసిన రాష్ట్ర ఆహార శాఖ కమిషనర్ హర్షగుప్త, వేల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్నభాగ్య పథకం ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం బంగారుపేటలో అక్రమార్కుల పాలవుతోందని రాష్ట్ర ఆహార శాఖ కమిషనర్కు ఫిర్యాదు అందింది. దీంతో హర్షగుప్త కలెక్టర్ డీకే రవితో కలిసి మిల్లులపై దాడికి బుధవారం ఉపక్రమించారు. కోలారు మెయిన్ రోడ్డులోని చిన్నమ్మాళ్, మోడ్రన్ రైసు మిల్లులపై దాడి చేశారు. ఆ సమయంలో మిల్లు మెయిన్ గేటుకు తాళం వేసి యజమానులు, కార్మికులు పరారయ్యారు. తాళాలు పగులగొట్టి మిల్లులోకి వెళ్లిన కమిషనర్, కలెక్టర్ వేల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో నాలుగు మిల్లులపై కూడా దాడి చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. బంగారుపేటలో అనేక సంవత్సరాలుగా ఈ అక్రమాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారి గాయత్రిదేవిని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని మిల్లుల నుంచి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని, దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఆయా మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఉంచాలని ఆదేశించారు. -
రెండో రోజూ రైస్మిల్లులు బంద్
సాక్షి, బళ్లారి : రైస్మిల్లు యజమానుల అసోసియేషన్లు ఇచ్చిన బంద్ పిలుపు రైతులకు ఇక్కట్లు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీపీఎల్ కార్డులు ఉన్న వారికి అన్నభాగ్య పథకం ద్వారా కిలో రూ.1కే బియ్యం పంపిణీ పంపిణీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుండటంతో దాని నుంచి బయట పడేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో ఉన్న 1800కి పైగా రైస్మిల్లుల నుంచి లెవీ రూపంలో ఏకంగా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం తీర్మానించింది. వెంటనే రైస్మిల్లుల అసోసియేషన్ తిరగబడటంతో ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో ఇస్తున్నట్లు ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల నుంచి రూ.1.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 2 లక్షల కంటే ఒక కేజీ కూడా ఎక్కువ ఇవ్వలేమని భీష్మించి రైస్మిల్లుల యజమానులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్మిల్లులు మూసివేశారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతో బళ్లారి జిల్లాలో 200 రైస్మిల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం తుంగభద్ర ఆయకట్టు కింద వరికోతలు దాదాపు పూర్తి అయ్యాయి. వరిని అమ్మడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. వరి కొనుగోళ్లు జోరందుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా రైస్మిల్లులు బంద్ కావడంతో రైతులు అయోమయంలో పడ్డారు. రైస్మిల్లుల అసోసియేషన్ బంద్ పరోక్షంగా రైతులకు నష్టం కల్గించేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement