breaking news
anjel
-
కొంచెం భయం కొంచెం ఆనందం
‘‘నేనొక దేవకన్య. స్వర్గం నుంచి భూమిపైకి ఎందుకొచ్చాను? హీరోను ఎలా కలిశాను? తనతో నా జర్నీ ఏంటి? అనేదే ‘ఏంజెల్’ సినిమా కథ. నా పాత్ర రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్లు బబ్లీగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది’’ అని కథానాయిక హెబ్బా పటేల్ అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ నిర్మించిన ‘ఏంజెల్’ రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర ్భంగా హెబ్బా చెప్పిన విశేషాలు... ► ‘ఏంజెల్’ సినిమా రెగ్యులర్గా మనం చూసే హెవీ సబ్జెక్ట్ కాదు. చాలా సింపుల్గా, లైట్గా ఉంటుంది. ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో కథ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. నా గత సినిమాల కంటే ఇందులో నా బాధ్యత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ► నేనిప్పటి వరకూ ‘ఏంజెల్’ సినిమా చూడలేదు. రేపు విడుదల అంటే కొంచెం కంగారుగా, సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆత్రుతగా ఉంది. మంచి సినిమా చేశామనే ఆనందం ఉంది. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా. ► నాగ అన్వేష్ చాలా మంచివాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు బాగా చేశాడు. తనతో పనిచేయడం హ్యాపీ. ‘ఏంజెల్’ మా ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ► ప్రస్తుతం సినిమా తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. చర్చల దశలో ఉన్నాయి. వినాయక్ మాట సాయం ఓ స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఓ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే ఆ చిత్రంపై క్రేజ్ మరింతగా పెరుగుతుంది. తాజాగా ‘ఏంజెల్’ సినిమాకి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ వాయిస్ ఓవర్ అందించారు. కచ్చితంగా వినాయక్ మాటలు సినిమాకి ప్లస్ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. -
'ఏంజిల్'గా కుమారి
అలా ఎలా సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన హేబాపటేల్ తరువాత కుమారి 21 ఎఫ్ సినిమాతో హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించిన ఈ బ్యూటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత మరోసారి రాజ్ తరుణ్ సరసన నటించిన ఆడో రకం ఈడోరకం సినిమా కూడా సక్సెస్ సాధించటంతో ఇక హేబాకు వరుస అవకాశాలు క్యూ కడతాయని భావించారు. కానీ అలా జరగలేదు. సీనియర్ హీరోల సరసన సూట్ అవ్వకపోవటంతో పాటు యంగ్ హీరోల సరసన నటించడానికి భారీ పోటి ఉండటంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆడోరకం ఈడోరకం తరువాత యంగ్ హీరో నాగాన్వేష్ సరసన హీరోయిన్గా నటిస్తుంది హేబా. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయిన నాగాన్వేష్ తరువాత వినవయ్యా రామయ్య సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. రాజమౌళి దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఏంజిల్ అనే టైటిల్ను ఫైనల్ చేశారు.