-
క్వార్టర్స్కు నార్పల, మడకశిర
- అనంత ప్రీమియర్ లీగ్ పోటీల్లో సత్తా అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో స్థానిక అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–16 బాలుర అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. క్రికెట్ పోటీల్లో నార్పల, మడకశిర జట్లు నాకౌట్ స్థాయి నుంచి క్వార్టర్కు చేరాయి. కాగా ఇప్పటికే ఆర్డీటీ అకాడమీ, కదిరి, ఆత్మకూరు, ధర్మవరం, గుంతకల్లు, కణేకల్లు జట్లు క్వార్టర్స్కు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్పల, మడకశిర జట్లు క్వార్టర్స్కు చేరాయి. మ్యాచ్ వివరాలు విన్సెంట్ క్రీడా మైదానంలో పెనుకొండ, నార్పల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నార్పల జట్టు 38.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. జట్టులో విజయకృష్ణ (73) రాణించారు. పెనుకొండ బౌలర్లు బాబా ఫకృద్దీన్, ఖాదర్ తలా 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పెనుకొండ జట్టు 26.3 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నార్పల జట్టు బౌలర్లు లక్ష్మీకాంత్ 4, విష్ణువర్ధన్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా బీ గ్రౌండ్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మడకశిర జట్టు 42 ఓవర్లలో 227 పరుగులు చేసింది. జట్టులో భీమానాయక్ (61), అల్తాఫ్ (51) అర్ధశతకాలతో రాణించారు. తాడిపత్రి జట్టులో రమేష్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తాడిపత్రి నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి ఓడింది. జట్టులో లక్ష్మణ్కుమార్ (96) త్రుటితో సెంచరీ మిస్సయ్యాడు. వచ్చే ఆదివారం క్వార్టర్స్ మ్యాచ్లు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. క్వార్టర్స్ మ్యాచ్ల వివరాలు కదిరి–నార్పల ధర్మవరం–ఆత్మకూరు గుంతకల్లు–కణేకల్లు ఆర్డీటీ అకాడమీ–ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర -
హోరాహోరీగా అనంత ప్రీమియర్ లీగ్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంత క్రీడా మైదానం, గుంతకల్లులోని రైల్వే క్రికెట్ మైదానంలో ఆదివారం నిర్వహించిన అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంత క్రీడా మైదానంలో నార్పల జట్టుతో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంత స్పోర్ట్స్ అకాడమీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జట్టులో జాన్ మైఖేల్ (89), రాఘవేంద్ర (69), మహేంద్రరెడ్డి (71) రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నార్పల జట్టు 31.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో భార్గవ్ 4, నవీన్ 2 వికెట్లు పడగొట్టారు. గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ, గుంతకల్లు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు క్రికెట్ అకాడమీ జట్టు 40 ఓవర్లలో 213 పరుగులు చేసింది. జట్టులో ఆసిమ్ సెంచరీతో కదం తొక్కాడు. గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ జట్టు క్రీడాకారుడు మనోజ్ 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ జట్టు 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో అభిషేక్ 52, రియాజ్ 46 పరుగులు సాధించారు. -
అనంత ప్రీమియర్ లీగ్లో గుత్తి విజయం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్ అండర్–16 క్రికెట్ పోటీల్లో గుత్తి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం గుత్తి రైల్వే క్రీడా మైదానంలో గుత్తి, కొనకొండ్ల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొనకొండ్ల జట్టు 92 పరుగులకే కుప్పకూలింది. గుత్తి బౌలర్ ఇమ్రాన్ 5 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుత్తి జట్టు 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి విజయం సాధించింది. వచ్చే ఆదివారం చివరి రౌండ్ లీగ్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. -
రసవత్తరంగా అనంత ప్రీమియర్ లీగ్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్–16 అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆర్డీటీతో పాటు జిల్లాలోని పలు క్రీడా మైదానాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆర్డీటీ బీ మైదానంలో జరిగిన మ్యాచ్లో గుంతకల్లు, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన గుంతకల్లు 185 పరుగులు చేసింది. జట్టులో సూరి 31, సాయి 27 పరుగులు చేశారు. తాడిపత్రి జట్టులో వినయ్ 4, దీక్షత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన తాడిపత్రి జట్టు 27 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. గుంతకల్లు జట్టులోని సాహుల్, సాయిలు చెరీ 4 వికెట్లు పడగోట్టి జట్టు విజయానికి దోహదపడ్డారు. విన్సెంట్ మైదానంలో విశ్వనాథన్ ఆనంద్, బీకేఎస్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశ్వనాథన్ ఆనంద్ జట్టు 48 ఓవర్లలో 239 పరుగులు చేసింది. జట్టులో భరత్ 81, పవన్ కళ్యాణ్ 71, వీరేంద్ర 31 పరుగులు సాధించారు. బీకేఎస్ బౌలర్లలో రమేష్ 4, హరి 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బీకేఎస్ జట్టు 40 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో రమేష్ 56 పరుగులు చేశారు. ఆత్మకూరు స్కూల్ మైదానంలో జరిగిన ఆత్మకూరు, కళ్యాణదుర్గం జట్లు పోటీపడ్డాయి. మొదట బ్యాటింగ్కు దిగిన ఆత్మకూరు జట్టు 37.4 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో దిలీప్ 59 పరుగులు సాధించాడు. కళ్యాణదుర్గం జట్టులో ప్రశాంత్ 3 వికెట్లు తీశాడు. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 30.2 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఆత్మకూరు జట్టులో అనిల్ 5, దిలీప్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కీలకంగా మారారు. మరోమ్యాచ్లో పెనుకొండ, హిందూపురం జట్లు తలపడగా హిందూపురం జట్టు మొదట బ్యాటింగ్ చేసి 142 పరుగులు చేసింది. అనంతరం పెనుకొండ జట్టు 32.5 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. జట్టులో మంజునాథ్ 49, ముదస్సిర్ 41 పరుగులు చేశారు. ఇంకో మ్యాచ్లో కణేకల్, రాయదుర్గం జట్లు తలపడగా మొదట రాయదుర్గం జట్టు 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కణేకల్ జట్టు 133 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో హరిలాల్ నాయక్ 31 పరుగులు సాధించాడు. వచ్చే ఆదివారం కూడా మ్యాచ్లు కొనసాగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement