breaking news
Alok Sagar
-
ఆర్బీఐ మాజీ గవర్నర్కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. అతడి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులగా పనిచేస్తున్నారు. అతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అత్యంత సాదాసీదాగా జీవితం గడుపుతాడు. ప్రజల సేవ పరమావధిగా భావించే మహోన్నత వ్యక్తి ప్రోఫెసర్ అలోక్ సాగర్. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే.. అలోక్ సాగర్ ఐఐటీ ఢిల్లీ గ్య్రాడ్యేయేట్, ఎన్నో మాస్టర్స్ డిట్రీలు చేసిన వ్యక్తి. పైగా యూఎస్ఏలోని టెక్సాస్లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ కూడా చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన కొన్నాళ్లు ఐఐటీ ఢిల్లీలో మాజీ ప్రోఫెసర్గా పనిచేశారు అలోక్ సాగర్. అంతేగాదు ఐఐటీ ఢిల్లీలో ప్రోఫెసర్గా పాఠాలు బోధిస్తున్నప్పుడూ అలోక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాడు. ఏమయ్యిందో ఏమో సడెన్గా ప్రోఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అలోక్ మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి నివశించడం ప్రారంభించారు. ఆ గ్రామంలో సరైన రోడ్డు సదుపాయాలు, కరెంట్ సౌకర్యం వంటివి ఏమీలేవు. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల మాండలికాన్ని నేర్చుకున్నారు. వారి జీవన విధానాన్ని స్వీకరించారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముతారు అలోక్. అందుకోసమే ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అంతేగాదు ప్రొఫెసర్ అలోక్ పేరుమీద ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటన్నింటి త్యజించి గిరిజనుల కోసం పాటు పడ్డారు. ఆయన తల్లి మిరాండా హౌస్ డిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ తండ్రి ఇండియన్ రెవెన్నయూ సర్వీస్ అధికారి, తమ్ముడు ఐఐటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్యావంతుడు అయ్యి ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరింటిలో జీవించడం, కేవలం మూడు కుర్తాలతో ఉండటం అంత ఈజీ కాదు. చాలామంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటూరు గానీ ఇలా వారి జీవన విధానం స్వీకరించి మరీ సంక్షేమం కోసం పాటుపడరు. కానీ అలోక్ అలా కాదు గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పాటుపడ్డారు. అంతేగాదు ఆ గ్రామంలో పయనించేందుకు కూడా ఓ సాదారణ సైకిల్నే వినియోగిస్తారు. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50 వేలకు పైగా చెట్లను నాటారు. దీంతోపాటు గ్రామాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీట్లరు సైకిల్పై ప్రయాణించి మరీ ఇస్తారు. ఆయన చాలామంది డిగ్రీలు చేసి స్టేటస్ చూపించుకోవడం, ఆస్తులు సంపాదించే పనిలోనే ఉన్నారు. సమాజ సేవ కోసం తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదని ఆశోక్ బాధగా అన్నారు. ఇక ఆయాన దాదాపు 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు. ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు, గ్రామాధికారులు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడేమోనన్న భయంతో ఈ ఊరి వదిలి వెళ్లిపోమనడంతో..ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. తన వివరాలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయాయి. ఈ విషయం వార్తల్లో హైలెట్ అయ్యింది కూడా. చివరికి ఆయన చెప్పిందంతా నిజమేనని తేలింది. ఐఐటీ ప్రొఫెసర్ స్థాయి అయ్యి ఉండి కూడా కించెత్తు నామోషి లేకుండా ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజనుల కోసం పాటుపడటం వారితో కలిసి జీవించడం నిజంగా గ్రేట్ కదూ. ఇలా మరెవ్వరూ చేయరేమో.!గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన 'శ్రీమంతడు' ప్రొఫెసర్ అలోక్ సాగర్..! One of the most inspirational man one will ever come across. Prof Alok Sagar ji is an IIT Delhi graduate, masters & Phd from Houston & an ex IIT professor. However, these esteemed credentials held no meaning for him, as he discovered his true calling in one of the most remote… pic.twitter.com/OiRknPcjc7 — VVS Laxman (@VVSLaxman281) April 12, 2024 (చదవండి: ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.) -
బక్క పచ్చని మనిషి
ఒక పచ్చని మనిషి ఎక్కడైనా ఉంటే ఎలాగైనా తెలిసిపోతుంది. ఆ చుట్టపక్కల చల్లని నీడ ఉంటుంది. ఒక మంచి పని ఏదైనా జరుగుతోందంటే ఎలాగైనా తెలిసిపోతుంది. ఆ పరిసరాలలో సంతోషం విరగబూస్తూ ఉంటుంది. అలోక్ సాగర్ 32 ఏళ్లుగా మధ్యప్రదేశ్లో ఉంటున్నారు. వనాలలో ఒకడిగా కలిసిపోయి, గిరి జనాలకు మేలుకొలుపు పిట్టలా తిరుగుతున్నారు. అయితే ఆయన గురించి ఎవరికీ తెలీదు! ఒకప్పుడు ఆయన ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్! రిజర్వుబ్యాంకు గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్కు గురువు!! ఇప్పుడు? చెట్టు, పుట్ట, ఒక అలోక్ సాగర్. అంతే!! ఉండడానికైతే ‘కొచామూ’లో ఉంటారు అలోక్ సాగర్. కాలు మాత్రం ఒకచోట నిలవదు. చేతులూ ఖాళీగా ఉండవు. మొక్కల్ని, మంచి బలమైన విత్తనాలను పట్టుకుని పొద్దస్తమానం బెతుల్, హోషంగాబాద్ జిల్లాల్లోని గూడేల్లో తిరుగుతూ ఉంటాడు. మనిషి కనిపిస్తే ఆపుతాడు. మొక్క చేతిలో పెడతాడు. కొన్ని విత్తనాల కూడా ఇచ్చి సారం ఉన్నచోట చల్లమంటాడు. ఈ ముప్పై ఏళ్లలో ఆలోక్ నాటి, పెంచిన చెట్లే 50 వేలకు పైగా ఉన్నాయి. కొండల్లో, గుట్టల్లో ఆయన దిన దిన సంచారం సైకిల్ తొక్కుతున్న పొద్దుతిరుగుడు పువ్వులా అనిపిస్తుంది. దాహమైన చోట ఆగుతారు. ఆకలైన చోట సైకిల్ దిగుతారు. గత ముప్పైఏళ్లుగా ఆయన ఇంతే. మనిషేం మారలేదు. ఒక్కోసారి ఒంటిపై చొక్కా కూడా ఉండదు. నడుముకు పంచె చుట్టుకుని వెళ్లిపోతారు. తిరుగుతూ తిరుగుతూ తాండాలోకి అలోక్కి ఢిల్లీలో సొంత ఇల్లుంది. సొంత మనుషులూ ఉన్నారు. వాళ్లందర్నీ వదిలేసి ఏళ్ల క్రితమే కొచామూ వచ్చేశారు. ఆయన రావడం కాదు, కొచామూనే ఆ పచ్చటి మనిషిని తెచ్చేసుకుందేమో! అంతలా ఉంటుంది ఇప్పుడు అక్కడి గ్రీనరీ. బెతుల్ శివార్లలోని చిన్న తాండా కొచామూ. అక్కడి గిరిజన జనాభా 750 మంది. ఇవ్వాళ్టికీ కరెంటు లేదు. రోడ్లు లేవు! ఆ చీకట్లోనే, ఆ గతుకుల్లోనే అలోక్ కూడా ఓ స్థానిక గిరిజనుడిలా ఉండిపోయారు. ఢిల్లీ నుంచి నేరుగా కొచామూ వచ్చేయలేదు అలోక్. మధ్యప్రదేశ్లోని కొండా కోనల్లో ఆరేళ్లు తిరిగి, చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇరవై ఆరేళ్లుగా ఈ తాండాలోనే ఉంటున్నారు. లిస్టులో తేలని ‘ఎక్స్ట్రా’ మనిషి! అలోక్ ఎక్కువకాలం ప్రొఫెసర్గా లేరు. 1982లో అకస్మాత్తుగా రిజైన్ చేసి బయటికి వచ్చేశారు. ‘‘ఈ డిగ్రీలు, పదవులపై ఆయనకు ఆసక్తి లేదని ఆయన మాతో కలిసి పనిచేసిన కొద్ది రోజుల్లోనే గమనించాం. ఆయన ఆలోచనలన్నీ అనుక్షణం ఆదివాసీల సంక్షేమం చుట్టూ పరిభ్రమిస్తుండేవి’’ అని ‘శ్రామిక్ ఆదివాసీ సంఘటన్’ సంస్థలో అలోక్తో దగ్గరి పరిచయం ఉన్న అనురాగ్ మోదీ అనే కార్యకర్త చెప్పేవరకు అలోక్ ఎందుకు ఉద్యోగం మానేశారో, ఎందుకు అజ్ఞాతంగా ఉండిపోయారో ఎవరికీ తెలీదు. ఆ అజ్ఞాతమైనా.. ఈ మధ్య బెతుల్లో జిల్లా ఎన్నికలు జరగబట్టి వీడిపోయింది కానీ.. లేదంటే అలోక్ సాగర్ విషయం మన దాకా వచ్చేది కాదు. బెతుల్ ఎన్నికలకు ముందు ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని అధికారులు లెక్కలు తీస్తున్నారు. అలోక్ ఏ ఇంట్లోనూ, ఏ ఓట్ల జాబితాలోనూ లెక్కలోకి రాలేదు. పిలిచి అడిగితే ‘ఇదే నా ఊరు’ అంటాడు! ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే.. ‘ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాను’ అంటాడు! అధికారులకు అనుమానం వచ్చి, తక్షణం ఊళ్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించారు. అలోక్ ఊరొదిలి వెళ్లలేదు. ఊరికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. స్థానిక అధికారులు అడిగినట్లే పోలీసులూ అడిగారు.. ‘ఇంతకీ మీరెవరు?’ అని! అలోక్ తనెవరో చెప్పలేదు. తన క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్పాడు. మిగతా వివరాలు పోలీసులు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు మీడియా తెలుసుకుంది. ‘ఇదే నా ఫ్యామిలీ’ అలోక్ తండ్రి ఐ.ఆర్.ఎస్. ఆఫీసర్. రెండేళ్ల క్రితమే చనిపోయారు. తల్లి ఢిల్లీ యూనివర్శిటీలోని మిరిండా హౌస్లో ఫిజిక్స్ టీచర్. అలోక్ తమ్ముడు ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్. ఫ్యామిలీ ఢిల్లీలోని పత్పర్గంజ్లో ఉంటుంది. అయితే తన ఫ్యామిలీ మాత్రం కోచామూనే అంటారు అలోక్. ‘‘ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తారు?’’ అనే ప్రశ్నకు ‘‘ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి’’ అని నవ్వుతూ అంటారు అలోక్. ‘ఉన్నచోటే చేయడానికి చాలా ఉంటుంద’నే అర్థం ఆ నవ్వులో ధ్వనిస్తుంది. అజ్ఞాతంగా... ఆదివాసీల మధ్య అలోక్ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు. మనిషి బక్కపలుచగా ఉంటాడు. పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, మీసాలు. కళ్లు శూన్యంలోకి చూస్తున్నట్లు ఉంటాయి. ప్రొఫెసర్ లుక్. కానీ ప్రొఫెసర్నని చెప్పుకోరు. సోషల్ యాక్టివిస్ట్ అనే మాటనూ ఒప్పుకోరు. మాట కూడా బంగారం. పచ్చ బంగారం! గిరిజనులు పచ్చగా ఉంటే, పర్యావరణ పచ్చగా ఉంటుందంటారు. పర్యావరణం పచ్చగా ఉంటే నగర జనం పచ్చగా ఉంటారంటారు. మొత్తం మీద ప్రకృతి, మనిషి పచ్చగా ఉండాలని అలోక్ అభిలాష. ఆకాంక్ష, ఆశయం. వాస్తవానికి అలోక్ సబ్జెక్ట్.. ఎన్విరాన్మెంట్ కాదు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఢిల్లీ ఐఐటీలో 1973లో మాస్టర్ డిగ్రీ చేశారు. తర్వాత పీహెచ్డి కోసం యు.ఎస్. వెళ్లిపోయి, టెక్సాస్లోని హ్యూస్టన్ యూనివర్శిటీలో చేరారు. తర్వాత ఇండియా వచ్చి, తను చదువుకున్న ఐఐటీలోనే ఫ్రొఫెసర్ అయ్యారు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు పెద్దపెద్ద హోదాల్లోకి చేరుకున్నారు. రఘురామ్ రాజన్ రిజర్వు బ్యాంకు గవర్నర్ అయ్యారు. -
'గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు'