breaking news
All India Bar Council
-
మద్రాసు హైకోర్టు సీజే రాజీనామాపై మరో కోణం
సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తహిల్రమణి రాజీనామా వ్యవహారంలో గురువారం మరో కొత్తకోణం ఆవిష్కృతమైంది. సీజేకు మద్దతుగా గత ఐదురోజులు సంఘీభావాలు కొనసాతుండగా.. గురువారం అందుకు భిన్నమైన వాదనలు చోటుచేసుకోవడంతో రాజీనామా వ్యహారం చిత్రమైన మలుపుతిరిగే అవకాశం ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్ర స్థాయి న్యాయస్థానాల్లో మద్రాసు హైకోర్టు కూడా ఒకటి. 75 మంది న్యాయమూర్తులు కలిగిన మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం 4.5 లక్షల కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజయ్ కిషన్ కౌల్ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిపోయారు. దీంతో ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్ రమణి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. క్రిమినల్, అప్పీలు కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల విచారణలో ఆమెకు మంచి పేరుంది. గుజరాత్ అల్లర్ల కేసుల నుంచి కొందరు నిర్దోషులుగా బయటపడగా ముంబై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆ తీర్పును రద్దు చేసి వారిలో కొందరికి శిక్షపడేలా చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపుపొందారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏడాది కాలం పూర్తయిన దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె కంటే జూనియర్ అయిన ఒక న్యాయమూర్తికి పదోన్నతి కల్పించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం, దీంతో తహిల్ రమణి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అసంతృప్తికి లోనై ఉన్న జస్టిస్ తహిల్ రమణికి సుప్రీంకోర్టు కొలీజియం మరింత మనస్థాపం కలింగించేలా వ్యవహరించినట్లు కొందరు న్యాయవాదులు విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్, సీనియర్ న్యాయమూర్తులైన ఎస్కే బాప్డే, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సీజే తహిల్ రమణిని మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేలా గతనెల 28వ తేదీన కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానాల్లో ఒకటైన 75 న్యాయమూర్తులు కలిగి ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులున్న మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడంపై ఆమె మరింత కలతచెందినట్లు సమాచారం. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు, సీనియర్ న్యాయవాదులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో 4.5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేవలం 1,400 కేసులున్న చిన్నపాటి మేఘాలయా న్యాయస్థానానికి తహిల్ రమణిని బదిలీ చేయడాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందానికి, ప్రధాన న్యాయమూర్తికి ఆమె లేఖరాయగా వారు తోసిపుచ్చారు. దీంతో తహిల్ రమణి తన పదవికి రాజీనామా చేశారు. అండదండలు సీజే రాజీనామా చేయడంతో ఆవేదన, ఆందోళన చెందిన తమిళనాడు, పుదుచ్చేరి న్యాయవాదులు బహిరంగంగా ఆమెకు సంఘీభావం తెలిపారు. విధులను బహిష్కరించారు. తాము అండాదండా ఉంటామని పేర్కొన్నారు. మేఘాలయాకు బదిలీ చేయరాదని మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన న్యాయమూర్తుల బృందానికి విన్నవించుకున్నారు. అతిపెద్ద మద్రాసు హైకోర్టు నుంచి అతి చిన్న మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం అంటే ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్’తో సమానమని అన్నారు. తగిన కారణాలతోనే బదిలీ: కొలీజియం న్యాయమూర్తులు బదిలీలు, పరిపాలనపరమైన ఇతర వ్యవహారాల్లో నిబద్దతతో వ్యవహరిస్థామని కొలీజియం గురువారం ఢిల్లీలో ప్రకటించింది. తగిన కారణాలతోనే ఎవరినైనా బదిలీ చేస్తాము, అకారణమైన నిర్ణయాలు ఎంతమాత్రం ఉండవని స్పష్టం చేసింది. తమ బదిలీలపై ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు కొలీజియం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. కొలీజియం ఆదేశాలు శిరోధార్యం కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సీజే తహిల్ రమణి శిరసావహించాలని పేర్కొంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘం ఢిల్లీలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొలీజియం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తహిల్ రమణికి మేలుజరిగిందని, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతల నుంచి తహిల్ రమణిని బదిలీ చేయడంలో దురుద్దేశం దాగి ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ఎంతమాత్రం సరికాదు. ముంబై హైకోర్టులో అమె మూడుసార్లు తాత్కాలిక న్యాయమూర్తిగా, తరువాత శాశ్వత న్యాయమూర్తిగా, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సులతో నియమితులు కావడాన్ని ఆమె మరువరాదు. కొలిజియం ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయనందున వారు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె శిరసావహించాలి. మేఘాలయా హైకోర్టును, దానితో సంబంధాలున్న వ్యక్తులను వేర్వేరుగా చూడకుండా బదిలీ ఉత్తర్వులను అనుసరించి బాధ్యతలు స్వీకరించి ఉంటే బాగుండేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆక్రోశం
సాక్షి ప్రతినిధి, చెన్నైః కొన్నాళ్లుగా శాంతియుతంగా సాగుతున్న లాయర్ల ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాదుల చట్టంలో చెన్నై హైకోర్టు కొన్ని సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులు తమిళనాడు గె జిట్లో కూడా ప్రచురితమయ్యాయి. చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించాలని కోరుతూ న్యాయవాదులు రెండు నెలలుగా పలురకాల ఆందోళనలు సాగిస్తున్నారు. ఈనెల 22వ తేదీన న్యాయవాద సంఘాలతో ఐదుగురితో కూడిన న్యాయమూర్తుల బృందం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈనెల 29వ తేదీ నాటికి చర్చలను వాయిదావేశారు. ఇదిలా ఉండగా, కోర్టు కార్యక్రమాలను స్తంభింపజేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న న్యాయవాదు ల జాబితాను పంపాల్సిందిగా అఖిల భారత బార్ కౌన్సిల్ చెన్నై హైకోర్టు బార్ కౌన్సిల్ను ఆదేశించింది. అలాగే జాబితాలో ఉన్న 126 మంది న్యాయవాదులను సస్పెండ్ చేస్తున్నట్లు అఖిల భారత బార్ కౌన్సిల్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రెచ్చిపోయిన న్యాయవాదులు న్యాయవాదుల చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించక పోగా 126 మంది సస్పెండ్ కావడంతో న్యాయవాదులు సోమవారం మ రింతగా రెచ్చిపోయారు. సస్పెండ్ ఉత్తర్వులు అందిన నేపథ్యంలో చెన్నై హైకోర్టును ముట్టడించాలని ఆదివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఉద యం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో న్యాయవాదులు చేరుకోవడం ప్రారంభించారు. హైకోర్టుకు దారితీసే మార్గాల ను పోలీసులు ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డుపెట్టి మూసివేశారు. దీంతో అక్కడికి సమీపంలో ప్ర భుత్వ దంత వైద్యకళాశాల, రాజా అన్నామలై మన్రం వద్ద న్యాయవాదుల గుమికూడారు. న్యాయవాదులు జొరపడకుండా హైకోర్టు పరిసరాలను సుమారు 2 వేలమంది పోలీసులు మొహరించి బందోబస్తు నిర్వహించారు. హైకోర్టులోని ఏడు ప్రవేశద్వారాల వద్ద పోలీసులు నిలబడ్డారు. న్యాయవాదులు ఆందోళన కోసం సిద్ధం చేసుకున్న వేదికపైకి సస్పెండైన 126 మంది న్యాయవాదులు ఎక్కి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఉదయం 12 గంటల సమయానికి నాలుగువేల మందికి పైగా న్యాయవాదులు హైకోర్టువైపునకు ఊరేగింపుగా దూసుకువచ్చారు. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో న్యాయవాదుల, పోలీసుల మధ్య తోపులాట సాగింది. ఈ సమయంలో కొంద రు న్యాయవాదులు పోలీసులపైకి వాటర్ బాటిళ్లు విసిరేయగా, ఒక న్యాయవాది ఆత్మాహుతి యత్నం చే య డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో పాల్గొన్న లాయర్లు ‘న్యాయమూర్తులు’ అనే అక్షరాలు కలిగిన ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి తగులబెట్టారు. ప్రధాన న్యాయమూర్తి ఇంటిని కూడా ముట్టడించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే సుమారు 20 మంది సాయుధ పోలీసులను న్యాయమూర్తుల క్వార్టర్లోని ప్రధాన న్యాయమూర్తి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్తంభించిన ఉత్తర చెన్నై న్యాయవాదుల ఆందోళన కారణంగా పెద్దఎత్తున పోలీసులు మొహరింపు, బారికేడ్లు పెట్టడం, కొడిమర రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలతో ఉత్తర చెన్నై దాదాపుగా స్తంభించి పోయింది. ఉద్రిక్త పరిస్థితులను ముందుగానే ఊహించిన ఆయా ప్రాం తాల వ్యాపారులు ముందుగానే దుకాణాలను మూసివేశారు. కొన్ని రోడ్ల వద్ద అప్పటికప్పుడు ట్రాఫిక్ మళ్లించడం వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైకోర్టుకే బెదిరింపులాః ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కౌల్ న్యాయవాద పట్టా పుచ్చుకున్న వారు హైకోర్టుకే బెదిరింపులకు పాల్పడడం శోచనీయమని ప్రధాన న్యాయమూర్తి సంజ య్ కిషన్ కౌల్ అన్నారు. న్యాయవాదులు తమ అసంతృప్తిని మరో కోణంలో చాటుకోవడంలో తమకు అభ్యంతరం లేదని, అయితే హైకోర్టు ప్రాంగణంలోనే శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు సిద్ధం కావడంతో పోలీసు బందోబస్తు తప్పలేదని అన్నారు. న్యాయవాదులు చర్చలకు ముందుకు రావాలని కోరారు.