breaking news
Akshara Vidyalaya
-
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన అండర్–17 రాష్ట్ర స్థాయి బాలబాలికల చెస్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. చెస్ అసోషియేషన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు వైడీ రామరాజు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి ^è దరంగం పోటీలకు నెల్లూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి దేవరం శ్రీహరి, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, అక్షర డైరెక్టర్ హరగోపాల్, జిల్లా చెస్ అసోషియేషన్ కార్యదర్శి వై సుమన్, తదితరులు పాల్గొన్నారు. చెస్ పోటీల విజేతలు వీరే.. మూడు రోజుల పాటు జరిగిన అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో సీహెచ్ నాగసంపత్, కేవీ సుభాష్, వీ ప్రత్వికుమార్, కే సుదీష్, బాలికల విభాగంలో జీ హర్షిత, బీ మౌనిక అక్షయ, బీ కళ్యాణి, తదితరులు విజేతలుగా నిలిచారు. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెస్ టోర్నీ నిర్వాహక కార్యదర్శి వై సుమన్ తెలిపారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయంలో అండర్–17 రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి వెంకటరణమణయ్య తెలిపారు. గురువారం ఆయన అక్షర విద్యాలయంలో చెస్ చాంపియన్ షిప్ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల,బాలికల విభాగంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వారిని కోల్కత్తాలోని అమిత్ విశ్వవిద్యాలయంలో సెప్టంబరు 9 నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్, అక్షర విద్యాలయ డైరెక్టర్ హరగోపాల్, తదితరులు ఉన్నారు.