-
అహుడాలో ఆ ‘ఇద్దరు’
నగరంలోని బళ్లారి బైపాస్ సమీపంలో ఓ వ్యక్తి 16 సెంట్ల స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలనుకున్నాడు. ఇందుకోసం అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అహుడా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఐదు నెలలు గడుస్తున్నా... ఆ ఫైల్ ముందుకుసాగలేదు. అహుడాలోని ఇద్దరు అధికారులు ఉద్దేశ పూర్వకంగా ఏదో ఒక కొర్రీ వేస్తూ అనుమతులు ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఇలా అహుడా పరిధిలోని వందల మంది నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, అనంతపురం: అనంతపురం, హిందూపురం డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)లో ఇద్దరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. అనుమతుల కోసం కార్యాలయానికి వచ్చే నిర్మాణదారులను వేధిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో కీలకంగా వ్యవహరించి ఓ అధికారి, మరో ఉద్యోగికి చేయితడపంతే ఫైల్ ముందుకుసాగని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా..అది మాటలకే పరిమితమవుతోంది. అహుడా అనుమతులకు సంబంధించిన ఫైల్ను క్షణాల్లో షార్ట్ఫాల్ కింద రిటర్న్ చేస్తున్నారు. ఇదేమిటని నిర్మాణాదారులు ఆరా తీస్తే లైసెన్స్ ఇంజినీర్ సరిగా చేయలేని తమ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోండంటూ ‘ఆ ఇద్దరు’ నిర్మాణదారులను మభ్యపెడుతున్నారు. ఆ ఇద్దరు ఉద్యోగుల ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు చకచకా పరుగులు పెడుతున్నాయి. కాసులిస్తేనే పని అహుడాలోని ఆ ఇద్దరు ఉద్యోగులకు చేయితడపంతే ఫైల్ ముందుకుసాగదని కొందరు నిర్మాణదారులు, లైసెన్స్ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహుడా అనుమతుల కోసం వెళ్తే లైసెన్స్ ఇంజినీర్ సరైన సమాచారాన్ని పొందుపర్చలేదని ఓ అధికారి చెబుతారు. అంతలోనే మరో ఉద్యోగి కల్పించుకుని తమకు చెందిన ఓ లైసెన్స్ ఇంజినీర్(హిందూపురం) ఉన్నారని... ఆయనే అన్నీ చూసుకుంటారని నిర్మాణదారులకు చెబుతారు. దీంతో నిర్మాణదారులు గత్యంతరం లేక వారి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. లేఅవుట్లు అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి రూ.లక్షల్లో ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అహుడా విస్తీర్ణమిలా... అనంతపురం, హిందూపురం డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) 2017 మార్చిలో ఏర్పాటైంది. మొదట్లో అనంతపురం నగరపాలక సంస్థ, ధర్మవరం, హిందూపురం మునిసిపాలిటీల్లోని 18 మండలాల్లోని 180 గ్రామ పంచాయతీలను అహుడా పరధిలోకి తెచ్చారు. అప్పట్లో అహుడా విస్తీర్ణం 3120.05 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. 2018లో పెరిగిన విస్తీర్ణం 2018 మే 22న ఉరవకొండ నియోజకవర్గంలోని మరో 5 మండలాల్లోని 84 గ్రామ పంచాయతీలను కలుపుకుని 1900.44 చదరపు కిలోమీటర్లను అదనంగా చేర్చారు. ఇలా మొత్తంగా అహుడా 5120.49 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అహుడా పరిధిలో నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. నగరపాలక సంస్థ పరిధిలో వెయ్యి చదరపు మీటర్లు, మునిసిపాలిటీ, పంచాయతీ పరిధిలో 300 చదరపు కిలోమీటర్లు పైబడి నిర్మాణాలు చేపడితే అహుడా అనుమతులు తప్పనిసరి. హడావుడిగా నోటీసులు అహుడా అధికారులు హడావుడిగా 57 అక్రమ లేఅవుట్లను గుర్తించి, ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లను చేయవద్దని జిల్లా రిజిస్ట్రార్లతో పాటు సబ్ రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేశారు. అహుడా అనుమతులకు ఇద్దరు ఉద్యోగులకు చేయితడిపితేనే లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుతులిస్తున్నారని..దీనిపై వివరణ ఇవ్వాలని అహుడా వైస్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ను ‘సాక్షి’ వివరణ కోరిన నేపథ్యంలో ఆయన జిల్లాలోని అక్రమ లేఅవుట్ల జాబితాను సిద్ధం చేసి చర్యలకు ఉపక్రమించారు. 57 అక్రమ లేఅవుట్లు అహుడా పరిధిలో 57 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించారు. అనంతపురంలోని కక్కలపల్లి, కురుకుంట, రాచానపల్లి, కొడిమి, ఉప్పరపల్లి, ఇటుకలపల్లి, జంగాలపల్లి, అనంతపురం రూరల్, హిందూపురంలోని శ్రీకంఠాపురం, హిందూపురం, బుక్కరాయసముద్రం తదితర చోట్ల అక్రమ లేఅవుట్లు వెలిశాయి. విచారణ చేపడతాం కొందరు ఉద్యోగుల కారణంగా అహుడా అనుమతుల జాప్యమవుతున్న విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా. అటువంటి ఫిర్యాదులందితే వెంటనే విచారణ చేస్తాం. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటా. – అహుడా వీసీ మురళీకృష్ణ గౌడ్ -
నగరపాలక సంస్థ కమిషనర్గా ప్రశాంతి
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ ప్రశాంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు అహుడా వైస్ చైర్పర్సన్గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఈమె కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేస్తున్నారు. అంతకు ముందు అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) వైస్ చైర్పర్సన్గా పనిచేశారు. అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా.. ఏ మాత్రం లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో ఆమెను కర్నూలు కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో ఆమె ఐదు నెలలుగా కమిషనర్ హోదాలు పని చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం అనంతపురం కమిషనర్గా పని చేస్తున్న పీవీవీఎస్ మూర్తి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్నూలులో రిలీవ్ ఐఏఎస్ పి.ప్రశాంతి కర్నూలులో శనివారం రిలీవ్ అయ్యారు. త్వరలోనే అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పి.ప్రశాంతి పేరు వినగానే కొందరు అధికారులు, సిబ్బందిలో వణుకు పుడుతోంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్లడంతో పాటు అభివృద్ధి విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహిస్తారనే పేరున్న అధికారిణి కావడంతో అక్రమార్కులు అప్పుడే ఆలోచనలో పడ్డారు. -
అహుడా వైస్ చైర్మన్గా కమిషనర్ పీవీవీఎస్ మూర్తి
అనంతపురం న్యూసిటీ : అనంతపురం, హిందూపురం డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) ఇన్చార్జ్ వైస్ చైర్మన్గా అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న పీవీవీఎస్ మూర్తి నియమితులయ్యారు. గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కమిషనర్తో పాటు మునిసిపల్ ఆర్డీగా కూడా పీవీవీఎస్ మూర్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement