breaking news
agama school
-
AP: వేదంతో పాటు ఆధునిక విద్యాబోధన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆదీనంలో ఉన్న వేద ఆగమ పాఠశాలల్లో సంప్రదాయ వేద విద్యతో పాటు గణితం, సైన్స్, ఆంగ్లం, కంప్యూటర్ బేసిక్స్, సోషల్ వంటి ఆధునిక విద్యా బోధనను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేద, ఆగమ తరగతులకు అదనంగా ప్రతి వారం రెండేసి గంటలు ఆధునిక సబ్జెక్టులతో తరగతులు నిర్వహించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 12 వేద, ఆగమ పాఠశాలల ఈవోలకు సూచనలు చేశారు. చదవండి: AP: భలే చాన్స్.. విద్యుత్ బకాయిలకు వన్ టైమ్ సెటిల్మెంట్ వేద పాఠశాలలో చదివే విద్యార్థులను వయస్సు, ఇతర అర్హతల ఆధారంగా ఒపెన్ స్కూల్ విద్యా విధానంలో మూడు, ఐదు, ఎనిమిది, పది, ఇంటరీ్మడియట్ పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక గంట శారీరక వ్యాయామం తరగతులు కూడా నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం వేద పాఠశాలలో వేద, ఆగమ తరగతులను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడి విద్యార్ధులు తర్వాత కాలంలో సహచర ఆధునిక విద్యను అభ్యసించి విద్యార్ధులతో పోటీ పడలేకపోతున్నారని, అందువల్ల ఇతర సబ్జెక్టులనూ బోధించాలని అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుపతిలో కంచి పీఠం నిర్వహించే వేద పాఠశాలలో ఆధునిక విద్యా బోధన చేయడాన్ని ఉదహరించాయి. ఈ ప్రతిపాదనలపై గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించారు. దేవదాయ శాఖ పరిధిలోని వేద, ఆగమ పాఠశాలల్లో ఆధునిక విద్యా బోధనలకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చక సంఘాలు స్వాగతించాయి. వేద పాఠశాలలోనూ ఎక్కువ మంది చేరతారు: అర్చక సమాఖ్య కంచి మఠం వేద పాఠశాల తరహాలో దేవదాయ శాఖ పరిధిలోని వేద, ఆగమ పాఠశాలల్లో ఆధునిక సబ్జెక్టుల బోధన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో వేద పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరతారని చెప్పారు. విద్య పూర్తి చేసిన తరువాత వారికీ ఇతర రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రూ.2.27 కోట్లతో ఆగమ పాఠశాల
అన్నవరం: అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై సుమారు ఎకరం స్ధలంలో రూ.2.27 కోట్లు వ్యయంతో స్మార్త, ఆగమ పాఠశాల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను దేవస్థానం ఛైర్మన్, ఈఓలతో కూడిన పాలకవర్గం ఆమోదించింది. గురువారం దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు సమావేశమై పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమావేశం నిర్ణయాలివీ.. ∙సత్యదేవుని శాశ్వత కల్యాణానికి రూ.పది వేలు రుసుం చెల్లించిన భక్తులకు పది సంవత్సరాలు మాత్రమే వారి పేరు మీద స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తారు. గతంలోలా మూడేళ్లు పొడగించే పరిస్థితి ఇకపై ఉండదు. ∙విద్యుత్ ఝ్ఛర్జీల ఆదాలో భాగంగా ఐఎస్ఐ స్టార్ రేటింగ్ కలిగిన పంప్సెట్లనే వాడాలని నిర్ణయించారు. పాత విద్యుత్ బల్బులను తొలగించి ఎల్ఈడీ బల్బులనే వాడాలని నిర్ణయించారు. ∙దేవస్థానంలో ఏర్పాటు చే స్తున్న బైక్, చిన్నకార్లు స్టాండ్ల కోసం నిర్వహించిన వేలంలో ఖరారైన నెలకు రూ.61,000 వేలంపాటను సమావేశంలో ఆమోదించారు. ∙అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్న కార్తీకమాసంలో స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేపట్టనున్న ఏర్పాట్లను సమావేశంలో సమీక్షించారు. అదే విధంగా నవంబర్ 11వ తేదీన క్షీరాబ్థి ద్వాదశినాడు జరగనున్న సత్యదేవుని తెప్పోత్సవానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సమావేశంలో తీర్మానించారు.