-
ఇంటర్ అఫిలియేషన్ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అఫిలియేషన్ వ్యవహారంలో వివాదాలకు తెరదించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఉపక్రమించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధిచిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బోర్డ్ సోమవారం విడుదల చేసింది. గతంలో పరీక్ష ఫీజు చెల్లించే తేదీ సమీపిస్తున్నా.. అఫిలియేషన్ వ్యవహారం కొలిక్కిరాక గుర్తింపు రాని కాలేజీల్లోని విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేకుండా పోయేది. దీంతో ఇలాంటి వివాదాలకు పుల్స్టాప్ పెడుతూ వచ్చే ఏడాది కాలేజీలు మొదలయ్యే నాటికే అఫిలియేషన్ల ప్రక్రియ ముగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యాసంవత్సరానికి కళాశాలల అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్ను బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ విడుదల చేశారు. అలాగే, ఏప్రిల్ 30లోపే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించాలని బోర్డు గడువుగా పెట్టుకుంది. ఆలస్యం లేకుండా ముందే... రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు బోర్డు అనుబంధ గుర్తింపును పొందిన తర్వాతే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేకపోగా, నడుస్తున్న కాలేజీలు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అయితే కొంతకాలంగా అనుమతుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇదంతా జూన్ కంటే ముందుగానే ముగియాల్సి ఉండగా, సెప్టెంబర్ వరకు కొనసాగుతోంది. అనుబంధ గుర్తింపు పొందకుండానే కాలేజీలు అడ్మిషన్లు తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీంతో ఏటా గందరగోళానికి దారి తీస్తోంది. ఈ సంవత్సరం మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా డిసెంబర్ వరకు అఫిలియేషన్ల జారీ కొనసాగింది. ఈ నేపథ్యంలో బోర్డు ఈసారి ముందుగానే అనుమతుల షెడ్యూల్ ప్రకటించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీ యాజమాన్యాలు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నవీన్మిత్తల్ వెల్లడించారు. ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అఫిలియేషన్కూ జీఎస్టీ ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపునకూ ఇకపై జీఎస్టీ చెల్లించాలి. తాజాగా ఇంటర్ బోర్డు విడుదల చేసిన అఫిలియేషన్ నోటిఫికేషన్లో ఈ అంశాన్ని కొత్తగా చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే కళాశాలలకు వేర్వేరు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూ. 21 వేల నుంచి రూ. 65 వేల వరకూ ఉంటాయి. ఈ మొత్తానికి 18 శాతం జీఎస్టీ చెల్లించాలని పేర్కొన్నారు. అఫిలియేషన్ పొందే కాలేజీలు కూడా సేవల పరిధిలోకి వస్తాయని బోర్డు పేర్కొనడం గమనార్హం. -
అఫిలియేషన్పై నేడు హైకోర్టు తీర్పు
ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీ నివేదికలు సిద్ధం సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ వ్యవహారంలో మంగళవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల మేరకు ఆయా కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో కూడిన బృందాలు తనిఖీలు పూర్తి చేసిన నేపథ్యంలో, అఫిలియేషన్పై నిర్ణయం ఎవరు తీసుకోవాలన్న దానిపై తాము స్పష్టతనిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, అఫిలియేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఎ.అభిషేక్రెడ్డిలు ఈ కేసు గురించి ప్రస్తావించారు. తనిఖీ బృందాలు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి, వాటిలో సౌకర్యాలపై నివేదికలు తయారు చేశాయని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించిన 122 కాలేజీల్లో 23 కాలేజీలు తనిఖీలకు ముందే తమకు అసలు అఫిలియేషన్ అవసరం లేదని చెప్పాయని, మిగిలిన 99 కాలేజీల్లో అత్యధిక శాతం కాలేజీలు ఒకటి, రెండు కోర్సులకే అఫిలియేషన్ చాలని చెప్పాయని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీల నివేదికలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అఫిలియేషన్ ఇచ్చే విషయంలో అటు ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోవాలా..? లేక జేఎన్టీయూ నిర్ణయం తీసుకోవాలా..? అన్న సందిగ్థత ఉందని, అందువల్ల ఈ విషయంలో స్పష్టతనివ్వాలని వారు కోర్టును కోరారు. ధర్మాసనం ఆదేశాల మేరకు తనిఖీ బృందాల నివేదికలను సీల్డ్ కవర్లలో ఉంచి హైకోర్టు రిజిష్టర్ ముందుంచామని తెలిపారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement