breaking news
Additional District. Magistrate
-
ఎట్టకేలకు..!
బెల్లంపల్లి, న్యూస్లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన బెల్లంపల్లికి చెందిన రూ.100 కోట్ల విలువైన భూముల మాయ వ్యవహారంపై కోర్టు స్పందించింది. అ వకతవకల వ్యవహారంలోప్రభుత్వ ఉద్యోగులపై పోలీసు కేసుకు ఆదేశించింది. తప్పుడు జీవోలు, నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ చేయడం, అవకతవకలకు పాల్పడటం, వంచనకు గురి చేయడం వంటి పలు ప్రధాన సెక్షన్లతో సస్పెన్షన్కు గురైన బి.విశ్వంభర్(కౌటాల తహశీల్దార్), రోహిత్దేశ్పాండే (జైనూర్ డిప్యూటీ తహశీల్దార్), ముడిమడుగుల వెంకట్రావ్ (మందమర్రి వీఆర్వో), మణిరాజ్ (మండల సర్వేయర్ నెన్నెల), రాంనర్సయ్య (రిటైర్డ్ డీఎఫ్వో, బెల్లంపల్లి)పై కేసు నమోదు చేయాల్సిందిగా బెల్లంపల్లి పోలీసులకు ఆసిఫాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ప్రభుత్వ రెవెన్యూ అధికారులపై బెల్లంపల్లి టూటౌన్లో శనివారం కేసు నమోదైంది. సదరు ఉద్యోగులపై ఐపీసీ 200, 409, 468, 471, 482, 488, 420, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి టూటౌన్ ఎస్హెచ్వో మహేశ్బాబు దర్యాప్తు చేస్తున్నారు. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. బెల్లంపల్లిలోని కాల్టెక్స్ భూముల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. 2012 ఆగస్టు 6వ తేదీన ‘భూమాయ’, 2012 ఆగస్టు 12వ తేదీన ‘భూకైలాస్’ శీర్షికలతో జిల్లా టాబ్లాయిడ్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కన్నాల శివారులోని సర్వే నంబర్ 108, 109, 110/1, 111లలో హైదరాబాద్లో నివాసం ఉంటున్న నలుగురితో సహా పరాయి దేశంలో నివసిస్తున్న ఓ మహిళ, మరికొందరి పేరుపై సు మారు 248.28 ఎకరాల భూములు ఉన్నట్లు సదరు రెవెన్యూ ఉద్యోగులు 2011 జనవరి 13వ తేదీన ప్రొసిడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రకారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి మొదలుకుని ప్రభుత్వాస్పత్రి వరకు ఉన్న భూములన్నీ సదరు వ్యక్తులవేనని రెవెన్యూ అధికారులు ప్రొ సిడింగ్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. డీఎఫ్వో కార్యాలయం, టూటౌన్, ట్రాన్స్కో, బీఎస్ఎన్ఎల్, ఇతర స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న భూములన్నీ కూడా ప్రొసిడింగ్స్లో జారీ చేసి వ్యక్తులవేనని సుస్పష్టం చేయడంతో ఒక్కసారిగా కల కలం రేగింది. దీంతో ‘సాక్షి’లో వచ్చిన వార్తా కథనాల క్లిప్పింగ్లను ఆధారం చేసుకొని బెల్లంపల్లికి చెందిన కొందరు కలెక్టర్ అహ్మద్బాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుకు స్పందించిన కలెక్టర్ బెల్లంపల్లిలోని కాల్టెక్స్ భూముల అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా అప్పటి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటయ్య (ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు)ను ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ జాయింట్ కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి కలెక్టర్కు నివేదికను సమర్పించారు. అడిషనల్ జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రూ.100 కోట్ల విలు వ చేసే భూముల అక్రమాల డొల్లతనం బయటపడింది. ఈ మేరకు కలెక్టర్ నలుగురు రెవె న్యూ ఉద్యోగులపై వేటు వేశారు. బెల్లంపల్లిలో అప్పట్లో పనిచేసిన తహశీల్దార్ విశ్వంభర్, డిప్యూటీ తహశీల్దార్ రమేశ్బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్దేశ్పాండే, వీఆర్వో ముడిమడుగుల వెంకట్రావ్ను సస్పెండ్ చేశారు. కోర్టు ఆదేశాలతో... కాల్టెక్స్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడిన వైనాన్ని బెల్లంపల్లికి చెందిన కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో ఫిటిషన్ వేయడంతో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్న ట్లు గుర్తించి సదరు కోర్టు తొలుత దిగువ స్థాయి కోర్టుకు వెళ్లాల్సిందిగా పిటిషన్దారులకు సూ చించింది. దీంతో సదరు పిటిషన్దారులు ఆసిఫాబాద్లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లా రు. ఫిటిషన్ను స్వీకరించిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కేసు పూర్వపరాలను పరిశీలించి భూముల అక్రమాలకు పాల్పడిన నలుగురు రెవెన్యూ ఉద్యోగు లు, ఆ భూముల వ్యవహారంలో ఉద్యోగులకు సహకరించిన రిటైర్డ్ డీఎఫ్వోపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కలెక్టర్ స్పందించడంతో... భూముల మాయపై కలెక్టర్ అహ్మద్బాబు సీరి యస్గా స్పందించడంతోనే అక్రమార్కుల గుట్టు రట్టైంది. సకాలంలో స్పందించిన కలెక్టర్ అడిషనల్జాయింట్ కలెక్టర్తో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల భూ భాగోతం బట్టబయలైంది. దీంతో రూ.100 కోట్లకుపైబడి విలువ చేసే భూములు బినామీల పరం కాకుండా నిలిచిపోయాయి. భూముల అక్రమాలను సహించలేని కలెక్టర్ చివరికి రెవెన్యూ ఉద్యోగులను సస్పెన్షన్ చేసి అక్రమార్కులకు దడ పుట్టించారు. -
జేసీ బదిలీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుజాతశర్మ బదిలీ అయ్యారు. ఆమెను వాణిజ్య పన్నులశాఖ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఆర్డీఏ పీడీగా ఉన్న ఆమెను అప్పటికే జిల్లాలో ఆమె భర్త సర్వశ్రేష్ట త్రిపాఠి పనిచేస్తుండటంతో జాయింట్ కలెక్టర్గా నియమించారు. 2006 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సుజాతశర్మ మొదటి పోస్టింగ్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్గా వచ్చారు. అనంతరం ఉట్నూర్ ఐటీడీఏ పీవో గా కొనసాగారు. ఆ తరువాత వరంగల్ డీఆర్డీఏ పీడీగా వెళ్లారు. అనంతరం 2011 నవంబర్ 18న జేసీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్లపాటు జిల్లాలో పనిచేస్తున్న ఆమె కలెక్టర్ అహ్మద్బాబు ఈనెల 11 నుంచి 18 వరకు సెలవులపై వెళ్లడంతో ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె భర్త సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లా ఎస్పీగా ప నిచేస్తూ ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా, సుజాతశర్మను ప్రభుత్వం వాణి జ్య పన్నులశాఖ కార్యదర్శిగా నియమించింది. కాగా కలెక్టర్ సెలవుల నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆమె ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. జిల్లాలో ఆమె సమర్థవంతమైన అధికారిణిగా జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. కాగా బదిలీ అయిన జేసీ సుజాతశర్మ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఉట్నూరు ఏఎస్పీకి వరంగల్ రూరల్ ఓఎస్డీగా పదోన్నతి ఐపీఎస్ అధికారి, ఉట్నూర్ ఏఎస్పీగా పనిచేస్తున్న అంబర్ కిషోర్ఝా వరంగల్ రూరల్ ఓఎస్డీగా పదోన్నతిపై బదిలీ చేశారు. అప్పటివరకు డీఎస్పీ స్థాయికే పరిమితమైన ఉట్నూరు సబ్ డివిజన్కు మొదటిసారిగా 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంబర్ కిశోర్ఝాను 2011 డిసెంబర్ 12న నియమించారు. సుమారు 23 నెలలపాటు ఉట్నూరు ఏఎస్పీగా పనిచేసిన ఆయన మొదటి పోస్టింగ్లోనే సమర్థవంతమైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, గుడిహత్నూరు తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల డంపులను ఈయన హయాంలోనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు జిల్లా కమిటీ, మరో ఇద్దరు దళకమాండర్ స్థాయి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. కాగా నిర్మల్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు మొదలుకుని.. రిమాండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కీలక కేసుకు అంబర్ కిషోర్ఝానే సారథ్యం వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలను అందించడంతోపాటు నిజాయతీ గల పోలీసు అధికారిగా మంచి పేరుంది. బెల్లంపల్లి అడిషనల్ భాస్కర్రావు బదిలీ బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ఓరం భాస్కర్రావును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 2011 డిసెంబర్ 2న బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన సుమారు రెండేళ్లపాటు పనిచేశారు. ఎస్పీగా పదోన్నతి జాబితాలో ఉన్న ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 1989వ ఎస్సై బ్యాచ్కు చెందిన భాస్కర్రావు కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన వారు. వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐగా పనిచేసిన ఆయన తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలో పేరు సంపాదించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా రాష్ట్రస్థాయిలో పేరున్న ఆయన డీఎస్పీ పదోన్నతిపై నిర్మల్లో నియామకమైన ఏడాదిన్నరకు మంచిర్యాల డీఎస్పీగా బదిలీ అయ్యారు. అనంతరం అడిషనల్ ఎస్పీ పదోన్నతిపై బెల్లంపల్లిలో 2011 డిసెంబర్ 2న నియమితులైన భాస్కర్రావు గురువారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన భరత్భూషణ్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వస్తున్నారు.