breaking news
Aaryavir Sehwag
-
సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల ఎంపిక.. వాళ్లెవరూ సక్సెస్ కాలేదు!
టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ల వారసులు భారత అండర్-19 జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యారు. స్వదేశంలో ఆస్ట్రేలియా యువ జట్టుతో ఆడే వన్డే సిరీస్కు ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్, సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఎంపికయ్యారు.వీరిలో అన్వయ్ ఇప్పటికే భారత్ అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేయగా.. ఆర్యవీర్ తొలిసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఆసీస్తో యూత్ వన్డేలతో పాటు రెండు మల్డీ డే మ్యాచ్లు కూడా భారత్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను గురువారమే ప్రకటించారు.ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన భారత క్రికెటర్ల వారసులు ఎక్కడా పెద్దగా రాణించిన దాఖలాలు లేవన్నాడు. ఇంటిపేరుతో వచ్చే ఒత్తిడే ఇందుకు ఓ కారణమై ఉండవచ్చని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. వాళ్లెవరూ సక్సెస్ కాలేదు!‘‘భారత అండర్-19 జట్టులో ఇప్పుడు రెండు ప్రఖ్యాత ఇంటిపేర్లు కనిపిస్తున్నాయి. వారిపై ఆ ఇంటిపేరు వల్ల వచ్చే భారం పడకూడదని ఆశిస్తున్నా. గతంలో చాలా మంది టీమిండియా క్రికెటర్ల వారసులు.. తదుపరి దశకు చేరుకోలేకపోయారు.స్వతహాగా వారు మంచి ఆటగాళ్లే అయినప్పటికీ తండ్రుల స్థాయిలో పేరు తెచ్చుకోలేక సతమతమయ్యారు. రోహన్ గావస్కర్ (దిగ్గజ సునిల్ గావస్కర్ కుమారుడు), అర్జున్ టెండుల్కర్ (లెజెండరీ సచిన్ టెండుల్కర్ కుమారుడు) ఇందుకు ఉదాహరణ. దిగ్గజ ఆటగాళ్ల కుమారులనే ట్యాగ్, ఇంటిపేరే వాళ్లపై బహుశా ఒత్తిడిని పెంచి ఉండవచ్చు’’ అని హనుమ విహారి పేర్కొన్నాడు.ఆర్యవీర్ అటాకింగ్ ప్లేయర్అదే విధంగా.. ‘‘ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 స్థాయిలో బాగానే ఆడుతున్నాడు. తండ్రి మాదిరే అతడూ విధ్వంసకర బ్యాటర్. ఇక ముందు కూడా అలాగే అటాకింగ్గా ఆడాలని కోరుకుంటున్నా. ఇక ద్రవిడ్ కుమారుడు అన్వయ్ కూడా చాలా చాలా మంచి క్రికెటర్.ఇప్పటికే అండర్-19 జట్టు తరఫున ఆడి మంచి స్కోర్లు సాధించాడు’’ అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో అన్వయ్ 101 పరుగులు సాధించాడు. కాగా భారత్- ఆసీస్ యువ జట్ల మధ్య సెప్టెంబరు 18- అక్టోబరు 8 వరకు ద్వైపాక్షిక సిరీస్లకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ఆసీస్తో సిరీస్.. భారత అండర్-19 జట్లు ఇవే! -
భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్ కుమారుడికి చోటు
ఆస్ట్రేలియా యువ జట్టుతో స్వదేశంలో జరిగే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ అండర్-19 జట్టును ప్రకటించిది. ఈ జట్టులో టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ కుమారులకు చోటు దక్కింది. ఆసీస్తో ఆడే వన్డే జట్టుకు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యారు. కాగా భారత్ ఆసీస్తో లక్ష్య రాయ్చందాని, యశ్వర్దన్ చౌహాన్ సారథ్యంలో మూడు వన్డే, రెండు మల్టీ డే మ్యాచ్లలో తలపడనుంది.ఆర్యవీర్కు తొలిసారి పిలుపుటీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. భారత అండర్-19 జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. కూచ్ బెహర్ ట్రోఫీ-2024 సీజన్లో ఢిల్లీ అండర్-19 తరఫున మేఘాలయతో మ్యాచ్లో 18 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 309 బంతుల్లోనే ఏకంగా 297 పరుగులు సాధించాడు.తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజారినప్పటికీ ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్యవీర్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో ఆర్యవీర్ చివరిగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున కాంపిటేటివ్ మ్యాచ్ ఆడాడు. స్థానం నిలబెట్టుకున్న అన్వయ్టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ఇప్పటికే భారత్ అండర్-19 జట్టు తరఫున ఆడాడు. 16 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గత నెలలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు యూత్ వన్డేలు ఆడి రెండు ఇన్నింగ్స్లో కలిపి 101 పరుగులు సాధించాడు.భారత్ వర్సెస్ ఆసీస్ అండర్-19 జట్ల షెడ్యూల్యూత్ వన్డేలు👉తొలి వన్డే- సెప్టెంబరు 18- రాజ్కోట్👉రెండో వన్డే- సెప్టెంబరు 21- రాజ్కోట్👉మూడో వన్డే- సెప్టెంబరు 23- రాజ్కోట్మల్టీ డే మ్యాచ్లు👉తొలి మ్యాచ్- సెప్టెంబరు 27-30: రాజ్కోట్👉రెండో మ్యాచ్- అక్టోబరు 5-8: అ హ్మదాబాద్- బి గ్రౌండ్.ఆస్ట్రేలియా యువ జట్టుతో వన్డే మ్యాచ్లకు భారత జట్టులక్ష్య రాయ్చందాని (కెప్టెన్), యశ్వర్దన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ భగేల్ (వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి.యశ్వీర్, రోహిత్ యాదవ్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్.ఆస్ట్రేలియా యువ జట్టుతో మల్డీ-డే మ్యాచ్లకు భారత జట్టుయశ్వర్దన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్ చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ క్రిష్ణ (వికెట్ కీపర్), అభిప్రయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), రోహిత్ యాదవ్, ఇషాన్ ఓమ్, అయాన్ అక్రం, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.చదవండి: విమర్శలపై స్పందించిన డివిలియర్స్ -
దంచికొట్టిన సెహ్వాగ్ కుమారుడు.. అచ్చం తండ్రిలాగే..
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందాడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ముందుకు వెళ్తూ బంతిని బౌండరీకి తరలించడమే అతడికి అలవాటు. ఇక సెహ్వాగ్ ట్రేడ్మార్క్ బ్యాక్ ఫుట్ పంచ్ షాట్కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు.అచ్చం తండ్రిలాగే..వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తాజాగా ఈ మ్యాజిక్ను రిపీట్ చేశాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్ బాది అభిమానులను ఖుషీ చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో వెస్ట్ ఢిల్లీ లయన్స్- న్యూ ఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.మనీశ్ సెహ్రావత్ సుడిగాలి ఇన్నింగ్స్అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూ ఢిల్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (35), వికెట్ కీపర్ బ్యాటర్ కేశవ్ దలాల్ సింగ్ (36)లతో పాటు పార్థ్ బాలి (36*) రాణించగా.. లోయర్ ఆర్డర్లో మనీశ్ సెహ్రావత్ మెరుపు ఇన్నింగ్స్ (8 బంతుల్లో 30*) ఆడాడు.వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో తిశాంత్ డబ్లా, మయాంక్ గుసేన్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, మనన్ భరద్వాజ్ తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూ ఢిల్లీ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్ ఢిల్లీ ఓపెనర్లు క్రిష్ యాదవ్, ఆర్యవీర్ సెహ్వాగ్ వేగంగా ఆడారు.దంచికొట్టిన ఓపెనర్లుక్రిష్ యాదవ్ 32 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 45 పరుగులతో అదరగొట్టగా.. ఆర్యవీర్ సైతం దంచికొట్టాడు. పద్నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది 22 పరుగులు రాబట్టాడు. తండ్రి మాదిరే బ్యాక్ ఫుట్ పంచ్ షాట్తో బంతిని బౌండరీకి తరలించి కనువిందు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన వీరూ భాయ్ అభిమానులు.. ‘అచ్చం తండ్రిలాగే.. సెహ్వాగ్ బ్రాండ్ అలాంటిది మరి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.మెరుపు అర్ధ శతకాలుఇదిలా ఉంటే.. వన్డౌన్లో వచ్చిన నితీశ్ రాణా (23 బంతుల్లో 50), కెప్టెన్ ఆయుశ్ దోసేజా (33 బంతుల్లో 64*) మెరుపు అర్ధ శతకాలు బాదగా.. వెస్ట్ ఢిల్లీ 201 పరుగులు సాధించింది. కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్లో సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ వెస్ట్ ఢిల్లీకి ఆడుతుండగా.. చిన్న కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Delhi Premier League T20 (@delhipremierleaguet20) -
నాన్న చెబితే వినక తప్పదు.. నా ఫోకస్ మాత్రం..: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వారసుడు ఆర్యవీర్ (Aaryavir Sehwag) సెహ్వాగ్ లీగ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ధనాధన్ ఆడి.. శుభారంభం అందుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025లో భాగంగా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున ఆర్యవీర్ బుధవారం అరంగేట్రం చేశాడు.వరుసగా రెండు బౌండరీలుఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా పేసర్ నవదీప్ సైనీ (Navdeep Saini) బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాది ఆర్యవీర్ తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అయితే, మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న ఈ జూనియర్ సెహ్వాగ్ నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.ఏదేమైనా.. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రి వీరేందర్ సెహ్వాగ్ను గుర్తుచేస్తూ అభిమానులను అలరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యశ్ ధుల్ దులిప్ ట్రోఫీ కారణంగా ఈ మ్యాచ్ మిస్సయ్యాడు.ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయానుమా జట్టు గత మ్యాచ్ పూర్తైన తర్వాతే.. ధుల్ స్థానంలో నేను ఆడబోతున్నానని తెలిసింది. జాంటీ భయ్యా వచ్చి నాకు ఈ విషయం ఈ చెప్పాడు. ఈ మ్యాచ్లో ఆడటం బాగా అనిపించింది. బౌండరీలు బాదడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాను. తదుపరి మ్యాచ్లో మరింత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నా’’ అని ఆర్యవీర్ తెలిపాడు. నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదుఇక తండ్రి వీరేందర్ సెహ్వాగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదు కదా!’’ అంటూ ఆర్యవీర్ నవ్వులు చిందించాడు. తండ్రి నుంచి తప్పక ఫీడ్బ్యాక్ తీసుకుంటానని తెలిపాడు.కేవలం ఆట మీద మాత్రమే దృష్టిఅదే విధంగా.. ‘‘మమ్మల్ని, మా ఆట తీరును అందరూ గమనిస్తూ ఉంటారని తెలుసు. స్కౌట్స్ మా ప్రదర్శనను విశ్లేషిస్తూ ఉంటారు. అయితే, ఆ విషయం గురించి మేము ఎక్కువగా ఆలోచించము. ఒకవేళ అలా చేసినట్లయితే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి.. మైదానంలో కేవలం ఆట మీద మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్లో ఆడాలన్న తన కల గురించి చెప్పుకొచ్చాడు.కాగా భారత ఓపెనర్గా అద్భుతంగా రాణించిన వీరేందర్ సెహ్వాగ్కు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆర్యవీర్. చిన్నోడు వేదాంత్. ఆర్యవీర్ దేశీ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటుతున్నాడు. డీపీఎల్ వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని ఎనిమిది లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది.చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్ -
బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో
ఢిల్లీకి చెందిన ‘సెహ్వాగ్’ అనే క్రికెటర్ తిరిగి మళ్లీ ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చాడు. అయితే మీరు అనుకుంటున్నట్లు అతడు వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. అతడి పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్. ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్పై తన తొలి టీ20 మ్యాచ్ను ఆర్యవీర్ ఆడాడు.తండ్రికి తగ్గ తనయుడు..ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన ఆర్యవీర్ తన తండ్రి శైలిలో ఫోర్ కొట్టి ఖాతా తెరవకపోయినా.. కానీ వీరేంద్రుడి మాదిరే తన దూకుడును ప్రదర్శించాడు. 18 ఏళ్ల ఆర్యవీర్ ఫాస్ట్ బౌలర్లను అద్బుతంగా ఎదుర్కొన్నాడు. కొత్త బంతితో భారత పేసర్ నవదీప్ సైనీని ఎదుర్కొన్న ఆర్యవీర్.. వరుసగా రెండు బౌండరీలు బాదాడు.తొలి బౌండరీని ఆఫ్-సైడ్ దిశగా బాదిన జూనియర్ సెహ్వాగ్.. రెండో బౌండరీని చక్కటి లాఫ్టెడ్ డ్రైవ్తో రాబట్టాడు. అతడి డేరింగ్ బ్యాటింగ్కు అందరూ ఫిదా అయిపోయారు. ఆర్యవీర్ కాసేపే క్రీజులో ఉన్నప్పటికి తన బ్యాటింగ్తో అలరించాడు. 16 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. 4 ఫోర్లు సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా ఆర్యవీర్ ఇటీవలే ఇన్ సైడ్స్పోర్ట్స్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలన్న తన కోరికను ఆర్యవీర్ వ్యక్తం చేశాడు.ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్పై 62 పరుగుల తేడాతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ గెలిచింది.Classy batting! Aaryavir Sehwag smashes consecutive fours. 💥 🏏Aaryavir Sehwag | East Delhi Riders | Central Delhi Kings | Anuj Rawat | Jonty Sidhu | #DPL2025 #DPP #AdaniDPL2025 #Delhi pic.twitter.com/08KwyxqPeK— Delhi Premier League T20 (@DelhiPLT20) August 27, 2025 -
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామన్యుల నుంచి సెలబ్రేటిల వరకు విరాట్ కోహ్లిని ఆరాధిస్తుంటారు. ఈ ఢిల్లీ బాయ్ ఎంతో మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఉన్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్స్టార్ విరాట్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలని ఆర్యవీర్ కలలు కంటున్నాడు. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్యవీర్ మాత్రం ఆర్సీబీకి ఆడాలని తహతహలాడుతున్నాడు.17 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డీపీఎల్ వేలంలో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీలో ఇప్పటివరకు ఆడే అవకాశం అతడికి లభించలేదు. సెంట్రల్ ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లనుండడంతో ఆర్యవీర్కు మిగితా మ్యాచ్ల్లో ఆర్యవీర్ భాగమయ్యే ఛాన్స్ ఉంది."ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గొప్ప బ్యాటర్. కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తాను. అదేవిధంగా మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.ప్రతి ఒక్కరిని గౌరవించడం, అందరితో మర్యాదగా నడుచుకోవడం, కెరీర్ పరంగా ఎంత ఎదిగినా తగ్గే ఉండాలి మా నాన్న మాకు నేర్పించారు అని ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యవీర్ పేర్కొన్నాడు.కాగా ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.చదవండి: వాంఖెడే స్టేడియంలో గావస్కర్ విగ్రహావిష్కరణ -
జాక్పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సొంతం చేసుకుంది.డబుల్ సెంచరీ వీరుడుకాగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.కాగా టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ఫెరారీ మిస్ అయ్యావు‘‘టెస్టు క్రికెట్లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్ క్రికెట్లోనైనా నా హయ్యస్ట్ స్కోరు 319 పరుగుల బెంచ్ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్ గతంలో చెప్పాడు.ఇక తన కుమారుడు ఆర్యవీర్ 2024లో ఈ ఫీట్ను మిస్ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.అమ్ముడుపోని వేదాంత్కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చింది.ఖరీదైన ఆటగాడిగా సన్రైజర్స్ప్లేయర్కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్ పేసర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలోనూ సిమర్జీత్ భాగమయ్యాడు.మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగమైన జట్లు ఇవేసౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ విజేతకాగా.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ రన్నరప్గా నిలిచింది.చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్హామ్లో జైహింద్


