హీరోయిన్స్ అనగానే అయితే ముంబై లేదంటే దక్షిణాది రాష్ట్రాల నుంచే.
							కానీ అసోంకి చెందిన ఓ అమ్మాయి ఇప్పుడు దక్షిణాదిలో హీరోయిన్.
							ఆమెనే కాయాదు లోహర్. రీసెంట్ గా వచ్చిన 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' మూవీలో హీరోయిన్.
							అసోంలోని తేజ్ పూర్ లో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. పుణెలో ప్రస్తుతం ఉంటోంది.
							టీనేజీలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 2021లో కన్నడ మూవీతో నటిగా మారింది.
							2022లో 'అల్లూరి' సినిమాతో తెలుగులోనూ నటించింది. కానీ బ్యాడ్ లక్. ఆ మూవీ హిట్ కాలేదు.
							రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.
							తెలుగు మూవీతో దక్కని హిట్.. తమిళ సినిమాతో అందుకుంది కాయదు లోహర్.
							ప్రస్తుతానికైతే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో ఒక్కో సినిమా చేసింది.
							ఇప్పటికైతే ఈమెకు 24 ఏళ్లే. మరి 'డ్రాగన్'తో హిట్ కొట్టింది కదా.. తెలుగు దర్శకులు ఈమెకు మళ్లీ ఛాన్సిస్తారేమో చూడాలి?
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
