
'191 దేశాలు యోగాను ఆమోదించాయి'
యోగా సాధనను ఒక మతం లేదా కులం లేదా వర్గంతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
లక్నో: యోగా సాధనను ఒక మతం లేదా కులం లేదా వర్గంతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నేడు భారత్ తో పాటు ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదాన్ని తమ అంతర్గత సంస్కృతిగా ఆచరిస్తోందని తెలిపారు.
లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచానికి భారత్ అందించిన అతిపెద్ద కానుక యోగా అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలోని 191 దేశాలు యోగాను ఆమోదించాయని వెల్లడించారు.