ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి | Two Maoists killed in Chhattisgarh's Bastar region | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి

Sep 24 2016 2:50 PM | Updated on Oct 9 2018 2:39 PM

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు బలగాలు,మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

భద్రాచలం: సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పోలీసులు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్‌పూర్ జిల్లా బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్తర్ సమీపంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం మేరకు పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
 
ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు గంటపాటు కాల్పుల అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన అనంతరం గాలించగా ఆ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. సంఘటన స్థలంలో ఒక తుపాకి, ఒక రైఫిల్‌తో పాటు పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని బస్తర్ ఎస్పీ రాజేంద్ర నారాయణ్ దాస్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement