బాలికపై సామూహిక లైంగిక దాడి | Teenage girl gangraped in UP | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక లైంగిక దాడి

Apr 23 2015 8:32 PM | Updated on Sep 3 2017 12:45 AM

పదిహేనేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.

రాయ్బరేలీ: పదిహేనేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. జగత్ పూర్ అనే గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాలిక పొలం పనులకు వెళ్లగా దర్మేశ్ కుమార్, ప్రమోద్ కుమార్, అరవింద్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు బుధవారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారు ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లగా అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న తమ కూతురును తల్లిదండ్రులు గుర్తించి తమకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement