'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే' | tdp mp jc diwakar reddy comments on pawan kalyan | Sakshi
Sakshi News home page

'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే'

Jul 23 2015 2:07 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే' - Sakshi

'పవన్ కళ్యాణ్ నోరు మూయించడానికే'

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద గురువారం టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ ప్రజలను మభ్యపెట్టే కంటితుడుపు చర్యలన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూపించడానికి ఇటువంటి ధర్నాలు పనికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రాలకు చింతకాయలు రాలవంటూ ఎద్దేవా చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement