
ట్రంప్ నిర్ణయం శాస్త్రీయ పరిశోధనకు దెబ్బ
హెచ్ -1 బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అమెరికా పరిశోధన సంస్థలకు పెద్ద దెబ్బ అని దేశంలోని టాప్ పరిశోధన బృందం వెల్లడించింది.
వాషింగ్టన్: హెచ్ -1 బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అమెరికా పరిశోధన సంస్థలకు పెద్ద దెబ్బ అని దేశంలోని టాప్ పరిశోధన బృందం వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు, పరిశోధకులపై ఆధారపడే సంస్థల పై ఈ ప్రభావం భారీగా పడనుందని అంచనా వేసింది. హెచ్-1 బి ప్రీమియం వీసాల సస్పెన్షన్పై తీసుకున్న నిర్ణయం ద్వారా పరిశోధన పని నెమ్మదించే అవకాశం ఉందని సెల్ బయాలజీ అమెరికన్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరిశోధన పని నెమ్మదించే అవకాశం ఉందని అలాగే ఆయా రంగాల్లో జరిగిన ఇతర ముఖ్యమైన పరిశోధనల గురించే తెలుసుకునే అవకాశం కూడా తగ్గిపోనుందని హెచ్చరించింది. పుట్టిన స్థలంతో సంబంధం లేకుండా పరిశోధనా ఫలితాలు పంచుకునే క్రమంలో పరిశోధకులకు కూడా తాకనుందని ఈ లోటును భర్తీ చేయలేమని వ్యాఖ్యానించింది. ట్రావెల్ కు సంబంధించిన చర్యలు ద్వారా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనిశ్చితి ,అసంతృప్తికరమైన వాతావరణాన్ని సృష్టించిందని సెల్ బయాలజీ అమెరికన్ సొసైటీ పేర్కొంది.
వీసాల జారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో, అమెరికా బయట దేశాలలోని శాస్త్రీయ సమాజం(పరిశోధనా విద్యార్థులు, పరిశోధకులు) తమ తమ దేశాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పింది. ప్రధానంగా శాస్త్రీయ పరిశోధనలు పరస్పర సహకారంతో కూడుకున్నవని, ఆయా పరిశోధనల నైపుణ్యాలను నేర్చుకోవడం ఇకమీదట క్లిష్టంగా మారనుందని చెప్పింది. పరస్పర చర్చలు, ఆలోచనలు, అభిప్రాయాలు ముఖాముఖిగా పంచుకోవడం పైనే సైంటిఫిక్ సమావేశాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది. దేశ భద్రత అవసరాన్ని ట్రంప్ టీంతో తాము కూడా గుర్తించినప్పటికీ అమెరికా సైంటిఫిక్ లీడర్గా నిలవాలంటే కీలకమైన శాస్త్రీయ సూత్రాలు పరిరక్షించడం ముఖ్యమని సొసైటీ స్పష్టం చేసింది.