
ఎస్బీఐకి ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
ద వరల్డ్ బ్రాండింగ్ ఫోరమ్ (డబ్ల్యూబీఎఫ్) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అందించే ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’
హైదరాబాద్: ద వరల్డ్ బ్రాండింగ్ ఫోరమ్ (డబ్ల్యూబీఎఫ్) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అందించే ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఎస్బీఐ గెలుచుకుంది. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంకులకు డబ్ల్యూబీఎఫ్ ఈ అవార్డును అందిస్తుంది. డబ్ల్యూబీఎఫ్ చైర్మన్ రిచర్డ్ రోలిస్ నుంచి ఎస్బీఐ డీఎండీ, సీడీఓ అశ్విన్ మెహ్ర, ఎస్బీఐ జీఎం వినోద్ పాండే ఈ అవార్డును స్వీకరించారు.